విద్యారంగ సమస్యలు పరిష్కారంలో ప్రభుత్వం విఫలం
ABN , Publish Date - Jun 14 , 2025 | 11:56 PM
విద్యారంగ సమస్యలు పరి ష్కరించడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో శనివా రం బస్టాండ్ చౌరస్తాలో నిరసన కార్యక్రమం చేపట్టారు. రాష్ట్ర అధ్యక్షుడు శని గరపు రజినీకాంత్ మాట్లాడుతూ విద్యాశాఖకు మంత్రి లేనటువంటి దుర్భర పరిస్థితి రాష్ట్రంలో ఉందన్నారు. విద్యాశాఖ మంత్రిని ఏర్పాటు చేసి సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు.

పెద్దపల్లి కల్చరల్, జూన్ 14 (ఆంధ్రజ్యోతి): విద్యారంగ సమస్యలు పరి ష్కరించడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో శనివా రం బస్టాండ్ చౌరస్తాలో నిరసన కార్యక్రమం చేపట్టారు. రాష్ట్ర అధ్యక్షుడు శని గరపు రజినీకాంత్ మాట్లాడుతూ విద్యాశాఖకు మంత్రి లేనటువంటి దుర్భర పరిస్థితి రాష్ట్రంలో ఉందన్నారు. విద్యాశాఖ మంత్రిని ఏర్పాటు చేసి సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ప్రైవేట్ కార్పొరేట్ విద్యాసంస్థల్లో లక్ష రూపాయల ఫీజు దోపిడీ జరుగుతున్నా ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం సిగ్గుచేటని మండిపడ్డారు. రాష్ట్రంలో ప్రైవేట్ కార్పొరేట్ విద్యాసంస్థలలో విద్యాహక్కు చట్టాన్ని పకడ్బందీగా అమలు చేయాలని, ఫీజుల దోపిడిని అరికట్టాలని డిమాండ్ చేశారు.
ప్రభుత్వాలు మారుతున్నా స్కాలర్షిప్ ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు విడుదల చేయకపోవడం సరైంది కాదన్నారు. సంక్షేమ హాస్టల్, గురుకులాలలో మౌలిక సదుపాయాలు కల్పించాలని, పెంచిన బస్పాస్ చార్జీలను తగ్గించాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో ఆందోళన కార్యక్రమాలకు పిలుపునిస్తామని ప్రభుత్వాన్ని హెచ్చ రించారు. ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు ఆర్ల సందీప్, జిల్లాల ప్రశాంత్, జిల్లా ఉపాధ్యాక్షుడు బందెల రాజ్కుమార్, జిల్లా కమిటి సభ్యులు తమన వెణిఅభిరామ్, దుర్గం రాజు, నాయకులు దామెర గణేష్, చంద్రకాంత్ మహేందర్, ప్రశాంత్, సురేందర్, అభివర్థన్, సిధ్ధార్థ, ఆదిత్య పాల్గొన్నారు.