మాదకద్రవ్యాల నియంత్రణకు కట్టుదిట్టమైన చర్యలు
ABN , Publish Date - Apr 15 , 2025 | 11:26 PM
జిల్లాలో మాదకద్రవ్యాలు, డ్రగ్స్ నియంత్రణకు కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని అదనపు కలెక్టర్ డి.వేణు అధికా రులను ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్లో మాదక ద్రవ్యాల, నియంత్రణ చర్యలపై అధికారులతో జిల్లా స్థాయి నార్కోటిక్ కంట్రోల్ సమావేశాన్ని నిర్వహించారు.

పెద్దపల్లిటౌన్, ఏప్రిల్ 15 (ఆంఽధ్రజ్యోతి): జిల్లాలో మాదకద్రవ్యాలు, డ్రగ్స్ నియంత్రణకు కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని అదనపు కలెక్టర్ డి.వేణు అధికా రులను ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్లో మాదక ద్రవ్యాల, నియంత్రణ చర్యలపై అధికారులతో జిల్లా స్థాయి నార్కోటిక్ కంట్రోల్ సమావేశాన్ని నిర్వహించారు. జిల్లాలో నమోదవుతున్న ఎన్డిపిఎస్ కేసులు, గంజాయి సాగు నివారణ చర్యలు, మాదక ద్రవ్యాల నివారణకు శాఖల వారీగా చేపట్టాల్సిన కార్యక్రమాలపై చర్చించారు. అదనపు కలెక్టర్ మాట్లాడుతూ, చెడు అలవాట్ల వల్ల ఆరోగ్యం దెబ్బ తింటుందని, ఆలోచనా శక్తి నశిస్తాయ న్నారు. భావితరాలు మాదక ద్రవ్యాల పట్ల ఆకర్షితులు కాకుండా సమాజంలో మంచి, చెడు తెలియజేయాలని ఆయన పేర్కొన్నారు. కస్తూర్బా గాంధీ విద్యాలయాలు, మోడల్ పాఠశాలలు, వసతి గృహాలు, గురుకుల పాఠశాలల్లో మాదకద్రవ్యాల వల్ల కలిగే నష్టాలపై వైద్య అధికారులతో అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు. డ్రగ్స్ నియంత్రణకు వివిధ శాఖల అధికారులు సమన్వ యంతో కృషి చేయాలని, మాదక ద్రవ్యాల రవాణా, సాగు, విని యోగం నివారణకు పటిష్ట చర్యలు తీసుకోవాలన్నారు. మాదక ద్రవ్యాలకు బానిసైన వారిని గుర్తించి అవసరమైన చికిత్స, కౌన్సెలింగ్ అం దించే విధంగా చర్యలు తీసుకోవాలని వైద్యారోగ్య శాఖ అధికారులకు సూచించారు. గోదావరిఖని ఆసుపత్రిలో 10 పడకల డీ అడిక్షన్ సెంటర్ ఏర్పాటు చేశామని, అవసరమైన వారికి చికిత్స అందించాలని సూచించారు. అటవీ భూములు పరిశీలించి గంజాయి సాగు కనిపిస్తే పోలీస్ అధికారులకు సమాచారం అందించాలన్నారు. జిల్లా లోని ఆసుపత్రులు, మెడికల్ షాపులలో స్టాక్ వివరాలను ప్రతి నెల తనిఖీ చేయాలని అదనపు కలె క్టర్ డ్రగ్ ఇన్స్పెక్టర్ ను సూచించారు. ఏసిపిలు జి. క్రిష్ణ, రమేష్, కలెక్టరేట్ పర్యవేక్షకులు ప్రకాష్, అధికారులు పాల్గొన్నారు.