లోక్ అదాలత్లతో సత్వర న్యాయం
ABN , Publish Date - Jun 15 , 2025 | 12:00 AM
లోక్ అదాలత్లతో సత్వర న్యాయం సాధ్యమని జిల్లా అదనపు న్యాయమూర్తి డాక్టర్ శ్రీనివాసరావు పేర్కొ న్నారు. శనివారం కోర్ట్ కాంప్లెక్స్లలో నిర్వహించిన లోక్ అదాలత్లో సబ్ జడ్జి జీవన్ సూరజ్సింగ్, జూనియర్ సివిల్ జడ్జిలు వెంకట సచిన్ రెడ్డి, వెంకటేష్ గురువ, స్వారికలు పాల్గొన్నారు.

కోల్సిటీ, జూన్ 14(ఆంధ్రజ్యోతి): లోక్ అదాలత్లతో సత్వర న్యాయం సాధ్యమని జిల్లా అదనపు న్యాయమూర్తి డాక్టర్ శ్రీనివాసరావు పేర్కొ న్నారు. శనివారం కోర్ట్ కాంప్లెక్స్లలో నిర్వహించిన లోక్ అదాలత్లో సబ్ జడ్జి జీవన్ సూరజ్సింగ్, జూనియర్ సివిల్ జడ్జిలు వెంకట సచిన్ రెడ్డి, వెంకటేష్ గురువ, స్వారికలు పాల్గొన్నారు. న్యాయమూర్తి శ్రీనివాసరావు మాట్లాడుతూ రాజీతో ఇరువర్గాలకు ప్రయోజనం ఉంటుందన్నారు. ఆయా కోర్టుల్లో 3,393 కేసులు పరిష్కారం కాగా రూ.68.48లక్షలు బాధితు లకు అందించామన్నారు. అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ నహీద ఫర్హిన్, లోక్ అదాలత్ సభ్యులు జాగిరి రాజయ్య, పెట్టం శ్రీనివాస్, సదన్ కుమార్, శ్రావణ్ కుమార్, గుర్రాల రాజేందర్, ఆసంపల్లి రవీందర్, పెర్క మనోహర్, ఏసీపీ మడత రమేష్, సీఐలు ఇంద్రసేనారెడ్డి, ప్రసాద్రావు, ప్రవీణ్ కుమార్, ఎస్ఐలు ఉదయ్ కిరణ్, వెంకటస్వామి పాల్గొన్నారు.
సుల్తానాబాద్, (ఆంధ్రజ్యోతి): క్షణికావేశంలో కేసులు పెట్టుకుని కోర్టుల చుట్టూ తిరుగుతూ విలువైన సమయాన్ని కోల్పోకుండా రాజీ మార్గం ఎంచుకోవాలని జూనియర్ సివిల్ జడ్జి దుర్గం గణేష్ అన్నారు. సుల్తానా బాద్ కోర్టులో లోక్అదాలత్ నిర్వహించారు. సివిల్, క్రిమినల్, కుటుంబ, చెక్ బౌన్స్ తదితర 469 కేసులకు సంబంధించి రాజీ కుదుర్చుకున్నారు. జడ్జి గణేష్ మాట్లాడుతు లోక్ అదాలత్ల ద్వారా ఇచ్చిన తీర్పులు ఎక్కడా అప్పీల్ చేసుకోవడానికి వీలు లేదన్నారు. బార్ అసోసియేషన్ అధ్యక్ష, కార్యదర్శులు తిరుపతిరెడ్డి, బోయిని భూమయ్య, ఏజీపీ అంజనేయులు, లక్ష్మీరాజం యాదవ్, మాడూరి అంజన్న, శివకృష్ణ, పాల్గొన్నారు.
మంథని, (ఆంధ్రజ్యోతి): కోర్టు ఆవరణలో జాతీయ లోక్ అదాలత్ నిర్వహించగా 359 కేసులను రాజీమార్గం ద్వారా పరిష్కరించారు. సీని యర్ సివిల్ జడ్జి వీ.భవాని, ద్వితీయ శ్రేణి న్యాయమూర్తి అనురాధ, బార్ అసోసియేషన్ అధ్యక్షుడు కేవీఎల్ఎన్ హరిబాబు, ఉపాధ్యక్షుడు కేతిరెడ్డి రఘోత్తంరెడ్డి, న్యాయవాదులు శశిభూషణ్కాచే, కట్కం శ్రీనివాస్, విజయ్ కుమార్, భాగ్యలక్ష్మి, సుభాష్, అంజియాదవ్, సీఐలు పాల్గొన్నారు.