ప్రైవేట్ పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలు
ABN , Publish Date - Jun 14 , 2025 | 12:33 AM
ప్రైవేట్ విద్యా సంస్థల కు దీటుగా ప్రభుత్వ పాఠశాలలను ప్రభుత్వం తీర్చిదిద్దుతోందని, అనేక వసతి సౌకర్యాలు కల్పిస్తుందని జిల్లా విద్యాధికారి మాదవి అన్నారు. సుల్తానాబాద్ మండలం గర్రెపల్లి ప్రాథమిక పాఠశాలలో శుక్రవారం చిన్నారులకు అక్షరాభ్యాసం చేయించారు.

సుల్తానాబాద్, జూన్ 13 (ఆంధ్రజ్యోతి): ప్రైవేట్ విద్యా సంస్థల కు దీటుగా ప్రభుత్వ పాఠశాలలను ప్రభుత్వం తీర్చిదిద్దుతోందని, అనేక వసతి సౌకర్యాలు కల్పిస్తుందని జిల్లా విద్యాధికారి మాదవి అన్నారు. సుల్తానాబాద్ మండలం గర్రెపల్లి ప్రాథమిక పాఠశాలలో శుక్రవారం చిన్నారులకు అక్షరాభ్యాసం చేయించారు. అనంతరం డీఈవో మాట్లాడుతు పాఠశాలల్లో సౌకర్యాలు మెరుగుపడ్డాయని, ప్రభుత్వం శ్రద్ధతో పాఠశాలల అభివృద్ధికి కృషి చేస్తుందన్నారు. బోధన పరికరాలు సమకూర్చడమే కాకుండా ఉన్నత విద్యావం తులైన ఉపాధ్యాయులచే బోధన అందిస్తున్న విషయాన్ని తల్లిదం డ్రులు మరవరాదన్నారు. మంచి విద్య, ఉచితంగా పాఠ్య పుస్తకాలు, నోట్ బుక్స్, యూనిఫారమ్స్ అందిస్తూ నాణ్యమైన భోజనం సమకూరుస్తున్నామన్నారు. పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పిం చాలని తల్లిదండ్రులకు సూచించారు. విద్యార్థులకు పాఠ్య పుస్తకాలు, నోట్ బుక్స్ అందించారు. గర్రెపల్లి ఫ్రీ ప్రైమరీ విద్యార్థుల కోసం ఏర్పాటు చేసిన ఫర్నీచర్ లైబ్రరీ బుక్స్ ప్రొజెక్టర్ను ప్రారంభించారు. ఎంఈవో ఆరేపల్లి రాజయ్య మాట్లాడుతు బడిబాటలో ప్రభుత్వ పాఠశాలల వసతి, సౌకర్యాల గురించి తెలుపుతూ అడ్మిషన్లను పెం చుతున్నామన్నారు. గర్రెపల్లిలోని గొల్లవాడ ప్రభుత్వ స్కూల్లో కూడా అక్షరాభ్యాసం చేశారు. హెచ్ఎం వాణి, శ్రీనివాసరావు పాల్గొ న్నారు. ఐతరాజుపల్లి పాఠశాలలో కొత్తగా చేరిన వారికి గ్రామంలోని ఆలయంలో అక్షరాభ్యాసం చేయించారు. మాజీ సర్పంచ్ గుజ్జేటి వెంకన్న, మాజీ ఎంపీటీసీ భూమేష్, హెచ్ఎం కవిత, తిరుపతి రెడ్డి, శ్రీలత, జయ, రవీందర్, పర్శరాం పాల్గొన్నారు. హన్మాండ్లపల్లిలో జరిగిన కార్యక్రమంలో జయపాల్ పాల్గొన్నారు.