తమ కుటుంబాన్ని ప్రజలు గుండెల్లో పెట్టుకున్నారు
ABN , Publish Date - Jun 14 , 2025 | 11:53 PM
పెద్దపల్లి పార్లమెంట్ నియోజక వర్గ ప్రజలతో తమకు నలభై ఏళ్ల అనుబంధం ఉందని రాష్ట్ర కార్మిక, గనుల శాఖ మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి అన్నారు. మంత్రి పదవి లభించిన అనంతరం ఆయన చెన్నూరు వెళుతుండగా సుల్తానాబాద్లో ఘన స్వాగతం పలికారు.

సుల్తానాబాద్, జూన్ 14 (ఆంధ్రజ్యోతి): పెద్దపల్లి పార్లమెంట్ నియోజక వర్గ ప్రజలతో తమకు నలభై ఏళ్ల అనుబంధం ఉందని రాష్ట్ర కార్మిక, గనుల శాఖ మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి అన్నారు. మంత్రి పదవి లభించిన అనంతరం ఆయన చెన్నూరు వెళుతుండగా సుల్తానాబాద్లో ఘన స్వాగతం పలికారు. వెంకటస్వామి, అంబేద్కర్ విగ్రహానికి వివేక్ పూలమాలలు వేసి నివాళులర్పించారు.
మంత్రి మాట్లాడుతు నియోజకవర్గ ప్రజలకు ఎప్పటికీ రుణపడి ఉంటానన్నారు. కాకా వెంకటస్వామిని మూడు సార్లు, తనను ఒక సారి, తన కుమారుడు వంశీని ఎంపీగా గెలిపించారన్నారు. నాయకులు గాజుల రాజమల్లు, సజ్జత్, హరీష్, రాంరాజు, ఐఎన్టీయుసి జిల్లా ఉపాధ్య క్షుడు నీరటి శంకర్, గంగుల సంతోష్, జగన్, కలువల శ్రీనివాస్, న్యాతరి శ్రీనివాస్, అజయ్, ఐలయ్య, నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.