Share News

IAS Officer Srilakshmi: సుప్రీంలో శ్రీలక్ష్మికి చుక్కెదురు

ABN , Publish Date - May 07 , 2025 | 11:51 AM

IAS Officer Srilakshmi: ఐఏఎస్ అధికారిణి శ్రీలక్ష్మికి బిగ్ షాక్ ఇచ్చింది సుప్రీం కోర్టు. శ్రీలక్ష్మికి సంబంధించి తెలంగాణ హైకోర్టు ఇచ్చిన తీర్పును సుప్రీం ధర్మాసనం కొట్టివేసింది.

IAS Officer Srilakshmi: సుప్రీంలో శ్రీలక్ష్మికి చుక్కెదురు
IAS Officer Srilakshmi

న్యూఢిల్లీ, మే 7: ఐఏఎస్ అధికారిణి శ్రీలక్ష్మికి (IAS Officer Srilakshmi) సుప్రీంకోర్టులో చుక్కెదురైంది. ఓబుళాపురం అక్రమమైనింగ్ కేసులో ఆమెకు విముక్తి కల్పిస్తూ తెలంగాణ హైకోర్టు (Telangana High Court) ఇచ్చిన తీర్పును సుప్రీం ధర్మాసనం కొట్టివేసింది. ప్రతివాదుల వాదనలను పరిగణలోకి తీసుకోకుండా హైకోర్టు తీర్పు ఇచ్చిందని సీబీఐ వాదనలు వినిపించింది. సీబీఐ వాదనతో సుప్రీం కోర్టు ఏకీభవించింది. మళ్లీ శ్రీలక్ష్మి కేసును తాజాగా విచారించాలని తెలంగాణ హైకోర్టుకు ఆదేశాలు జారీ చేసింది. మూడు నెలల్లోగా విచారణను ముగించాలని హైకోర్టును సుప్రీం ఆదేశించింది.


వైఎస్సార్ హయాంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లోని అనంతపురం జిల్లా ఓబులాపురం మైనింగ్స్‌లో అక్రమాలు జరిగాయంటూ సీబీఐ కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. ఈ కేసులో నిందితురాలిగా ఐఏఎస్‌ అధికారిణిని శ్రీలక్ష్మి అరెస్ట్ అయి కొంత కాలం జైలు జీవితం కూడా అనుభవించారు. అయితే ఈకేసులో శ్రీలక్ష్మిపై నమోదు అయిన కేసును తెలంగాణ హైకోర్టు కొట్టివేసింది. 2022లో శ్రీలక్ష్మిని ఈ కేసు నుంచి హైకోర్టు డిశ్చార్జ్ చేసింది. దీంతో ఈ తీర్పును సవాల్ చేస్తూ పిటిషనర్ సుప్రీం కోర్టును ఆశ్రయించారు. ఈ కేసుపై ఈరోజు (బుధవారం) సుప్రీం కోర్టులో విచారణ జరగగా.. తెలంగాణ హైకోర్టు ఇచ్చిన తీర్పును కొట్టివేసింది. మళ్లీ శ్రీలక్ష్మి కేసును విచారించాలని ఆదేశాలు జారీ చేసింది.

Indian Army: చెప్పిందే.. చేసింది.. ఆర్మీ వీడియో వైరల్


కాగా... ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో సంచలనం సృష్టించిన ఓఎంసీ కేసులో నిన్న (మంగళవారం) సీబీఐ కోర్టు సంచలన తీర్పు ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ కేసులో మాజీ మంత్రి గాలి జానర్దన్‌రెడ్డిని కోర్టు దోషిగా నిర్ధారించింది. ఏ1 బీవీ శ్రీనివాస్ రెడ్డి, ఏ2 గాలి జనార్దన్ రెడ్డితో పాటు ఏ3 అప్పటి గనుల శాఖ అసిస్టెంట్‌ డైరెక్టర్‌ వీడీ రాజగోపాల్‌, ఏ4 ఓబుళాపురం మైనింగ్‌ కంపెనీ, ఏ7 మెహఫుజ్‌ అలీ ఖాన్‌ (గాలి వ్యక్తిగత సహాయకుడు)లను దోషులుగా నిర్ధారించిన కోర్టు.. వీరికి ఏడేళ్ల జైలు శిక్షను విధించింది. అలాగే ఈ కేసులో మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డిని నిర్దోషిగా ప్రకటించింది న్యాయస్థానం. సబితతో పాటు ఈకేసులో ఏ5గా ఉన్న ఆర్. లింగారెడ్డిని కూడా నిర్దోషిగా తేల్చింది. అయితే ఏ6గా ఉన్న ఐఏఎస్ అధికారిణి శ్రీలక్ష్మి హైకోర్టులో క్వాష్ పిటిషన్‌తో 2022లో ఈ కేసు నుంచి విముక్తి పొందిన విషయం తెలిసిందే.


ఇవి కూడా చదవండి

Operation Sindoor: అందుకే.. ఆపరేషన్ సింధూర్‌.. త్రివిధ దళాల రియాక్షన్ ఇదే..

India Operation Sindoor: ఆపరేషన్‌ సింధూర్‌.. ఈ పేరు పెట్టడానికి అసలు కారణం ఇదే..

Read Latest Telangana News And Telugu News

Updated Date - May 07 , 2025 | 12:33 PM