Share News

Seethakka Speech: వాస్తవాల ప్రాతిపదికన పథకాలు తీసుకొస్తాం: మంత్రి సీతక్క

ABN , Publish Date - May 30 , 2025 | 04:15 PM

Seethakka Speech: తెలంగాణలో విద్య, వైద్యం, పౌష్టికాహారం కోసం తెలంగాణ ప్రజా ప్రభుత్వం పనిచేస్తోందని మంత్రి సీతక్క తెలిపారు. పాఠశాలల్లో ప్రభుత్వ హాస్టల్లలో మెరుగైన విద్యతో పాటు, మెరుగైన భోజన సదుపాయాలను కల్పిస్తున్నామన్నారు.

Seethakka Speech: వాస్తవాల ప్రాతిపదికన పథకాలు తీసుకొస్తాం: మంత్రి సీతక్క
Seethakka Speech

హైదరాబాద్, మే 30: తెలంగాణలో (Telangana) విద్య, ఆరోగ్యం, పౌష్టికాహారం, నేర్చుకునే సామర్థ్యం, పని, కుటుంబ పరిస్థితులపై సెస్ సర్వే చేయడం అభినందనీయమని పంచాయతీరాజ్ గ్రామీణ అభివృద్ధి మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క (Minister Seethakka) అన్నారు. ఈరోజు (శుక్రవారం) బేగంపేటలోని సెంటర్ ఫర్ ఎకనామిక్ అండ్ సోషల్ స్టడీస్ ప్రాంగణంలో యంగ్ లైవ్స్ రౌండ్ - 7 సర్వే నివేదికను మంత్రి విడుదల చేశారు. ఈ సందర్భంగా సీతక్క మాట్లాడుతూ.. సర్వే నివేదికలు విధాన రూపకల్పనలో ప్రభుత్వానికి (Telangana Govt) ఎంతగానో ఉపయోగపడతాయన్నారు.


క్షేత్రస్థాయి అధ్యయనాల వల్ల ప్రభుత్వ విధానాల్లో ఏవైనా లోటు పాట్లు ఉంటే సవరించుకోవచ్చని చెప్పారు. తెలంగాణలో విద్య, వైద్యం, పౌష్టికాహారం కోసం తెలంగాణ ప్రజా ప్రభుత్వం పనిచేస్తోందని తెలిపారు. పాఠశాలల్లో ప్రభుత్వ హాస్టల్లలో మెరుగైన విద్యతో పాటు, మెరుగైన భోజన సదుపాయాలను కల్పిస్తున్నామన్నారు. సరైన పౌష్టికాహారం లేకపోతే విద్యార్థులు విద్య మీద దృష్టి సారించలేకపోతున్నారని అన్నారు. ఒక ఆదివాసి బిడ్డగా తనకు ఆకలి బాధ తెలుసన్నారు. అందుకే ఎక్కడ ఫుడ్ గ్యాప్స్ లేకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు.


అమ్మాయిల్లో రక్తహీనతను నివారించేందుకు పోషకాలతో కూడిన చిక్కిల పంపిణీ పథకాన్ని ప్రారంభించామని తెలిపారు. సెస్ నిర్వహిస్తున్న సర్వేలకు, అధ్యయనాలకు కాంగ్రెస్ ప్రభుత్వం సహకారం పూర్తిస్థాయిలో ఉంటుందన్నారు. సెస్ ఇచ్చే వాస్తవాల ప్రాతిపదికన ప్రజా సంక్షేమం కోసం మరిన్ని పథకాలు తీసుకొస్తామన్నారు. సర్వేలు కేవలం సర్వేల కోసమే జరగకూడదని.. ప్రజల సమస్యలు, అభివృద్ధి ఆకాంక్షలు, విధానపరమైన లోటు పాట్లు తెలిపేలా సర్వేలు జరగాలని అన్నారు. వాస్తవాల ప్రాతిపదికన రూపొందిన సర్వేలను పూర్తిస్థాయిలో అధ్యయనం చేసి పథకాలను రూపొందిస్తామని మంత్రి సీతక్క పేర్కొన్నారు.


మంత్రి ఔదార్యం

ఫిట్స్‌తో బాధపడుతున్న వ్యక్త పట్ల మంత్రి సీతక్క మానవత్వాన్ని చూపారు. పంజాగుట్ట ఫ్లైఓవర్‌పై ఓ వాహనదారుడికి ఫిట్స్‌ వచ్చాయి. ఆ మార్గంలో వెళ్తున్న మంత్రి సీతక్క.. తక్షణమే స్పందించారు. తన వాహనాన్ని ఆపి అతని చేతిలో తాళం చెవులు పెట్టారు. అతను కోలుకునేదాకా మంత్రి సహాయపపడ్డారు. అతను కుదుటపడే వరకు అక్కడే ఉండి ధైర్యం చెప్పి ఆ తరువాత సదరు వ్యక్తిని ఆస్పత్రికి పంపించారు. మంత్రి సీతక్క ఔదార్యాన్ని చూసిన ప్రతి ఒక్కరూ హ్యాట్సాఫ్ చెబుతున్నారు.


ఇవి కూడా చదవండి

2047 నాటికి 2.4 ట్రిలియన్ డాలర్ల స్టేట్‌గా ఏపీ.. ఇదే మా లక్ష్యం

ఇదెక్కడి అభిమానంరా బాబు.. ఏకంగా పాముతోనే థియేటర్లోకి ఎంట్రీ

Read Latest Telangana News And Telugu News

Updated Date - May 31 , 2025 | 09:22 AM