Viral Video: బంతి పడిందని పాడుబడ్డ ఇంట్లోకి యువకుడు.. షాకింగ్
ABN , Publish Date - Jul 14 , 2025 | 05:56 PM
హైదరాబాద్ నాంపల్లి మార్కెట్ ప్రాంతంలోని ఒక యువకుడు చేసిన రీల్ సంచలనంగా మారింది. తాను చేసిన వీడియో వెనుక ఇంతటి దిగ్భ్రాంతికర విషయం ఉందా అని ఆ కుర్రాడు షాక్ అయ్యే పరిస్థితి..

హైదరాబాద్, జులై 14: హైదరాబాద్ నాంపల్లి మార్కెట్ ప్రాంతంలోని ఒక యువకుడు చేసిన రీల్ సంచలనంగా మారింది. తాను చేసిన వీడియో వెనుక ఇంతటి విషయం ఉందా? అని ఆ కుర్రాడు ఇప్పుడు షాక్ అయ్యే పరిస్థితి ఏర్పడింది.
వివరాల్లోకి వెళ్తే, స్థానికంగా ఉండే యువకులు క్రికెట్ ఆడుతున్నారు. ఈ క్రమంలో బాల్ పక్కన ఉన్న ఇంట్లో పడింది. లోపలకి వెళ్లి బాల్ తెచ్చుకునే ప్రయత్నంలో అతనికి ఇంట్లో ఒక వింత సన్నివేశం కనిపించింది. ఆ ఇంట్లో.. మనిషి అస్తిపంజరాన్ని చూశాడా యువకుడు. దీంతో అతనికి ఒక ఐడియా వచ్చింది. దీనిని రీల్స్ చేస్తే మంచి వ్యూస్ రావడంతోపాటు, తన స్నేహితుల్నీ థ్రిల్ చేయొచ్చని ఆలోచనకు వచ్చాడు.
అంతే, తన సెల్ ఫోన్ తో షూట్ చేసుకుంటూ.. మీకు ఒక షాకింగ్ వీడియో చూపిస్తానంటూ పాడుబడ్డ ఇంట్లోకి వెళ్లాడు యువకుడు. ఇంటి లోపలితోపాటు, అక్కడే ఉన్న మనిషి అస్తిపంజరం చూపిస్తూ వీడియో రికార్డ్ చేశాడు. ఆ వీడియోను తన ఫేస్బుక్ లో పెట్టాడు. అది కాస్తా వైరల్ కావడంతో సదరు రీల్ పోలీస్ల వరకూ వెళ్లింది. ఆ వీడియో చూసిన హబీబ్ నగర్ పోలీసులు యువకుడెవరని ఆరా తీసి, మొత్తానికి తెలుసుకుని అతడ్ని స్టేషన్కు పిలిచి వివరాలు అడిగారు.
క్రికెట్ ఆడుతుండగా బాల్ ఆ ఇంట్లో పడటంతో తీసుకునేందుకు వెళ్లానని, అక్కడ అస్తిపంజరం కనిపించడంతో మరుసటి రోజు వీడియో తీశానని పోలీసులకు వెల్లడించాడు ఆ యువకుడు. దీంతో హబీబ్ నగర్ పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని క్లూస్ టీం సాయంతో ఆధారాలు సేకరిస్తున్నారు. సదరు అస్తిపంజరం ఎవరిదని ఆరా తీస్తున్నారు.
అయితే, ఏడు సంవత్సరాలుగా ఆ ఇంట్లో ఎవరూ లేరని, ఇంటి ఓనర్ విదేశాలలో ఉన్నట్లు స్థానికులు పోలీసులకు చెప్పారు. ఘటనా స్థలానికి సౌత్ వెస్ట్ జోన్ డీసీపీ చంద్రమోహన్ చేరుకుని దర్యాప్తు చేస్తున్నారు.
ఇవి కూడా చదవండి
గోవా గవర్నర్గా అశోక్ గజపతిరాజు నియామకం
ఆ మూడు ఘటనలు జగన్ కుతంత్రాల్లో భాగమే: దేవినేని
Read Latest AP News And Telugu News