Share News

Gulzar House Fire Incident: గుల్జార్ హౌస్ ప్రమాదంపై ఎఫ్‌ఐఆర్ నమోదు

ABN , Publish Date - May 19 , 2025 | 12:57 PM

Gulzar House Fire Incident: పాతబస్తీలోని గుల్జార్ హౌస్ అగ్నిప్రమాదంపై పోలీసులు ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. ఉత్కర్ష్ మోదీ ఇచ్చిన ఫిర్యాదు కేసు ఫైల్ అయ్యింది.

Gulzar House Fire Incident: గుల్జార్ హౌస్ ప్రమాదంపై ఎఫ్‌ఐఆర్ నమోదు
Gulzar House Fire Incident

హైదరాబాద్, మే 19: నగరంలోని పాలబస్తీ గుల్జార్ హౌస్‌ అగ్ని ప్రమాదంపై (Gulzar House Fire Incident) విచారణ కొనసాగుతోంది. ఈ ప్రమాద ఘటనపై ఎఫ్‌ఐఆర్ (FIR) నమోదు అయ్యింది. మృతుల కుటుంబ సభ్యుడు ఉత్కర్ష్ మోదీ ఇచ్చిన ఫిర్యాదుతో చార్మినార్ పోలీసులు ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. ఫిర్యాదులో నిన్న (ఆదివారం) ఏం జరిగిందో ఉత్కర్ష్ మోదీ వివరించారు. నిన్న ఉదయం 6:10 నిమిషాలకు తన తండ్రి వినోద్ మోదీకి అత్యవసరంగా రావాలని రాహుల్ ఫోన్ చేసినట్లు తెలిపారు. కాల్ అందుకున్న వెంటనే తాము తన తండ్రితో కలిసి గుల్జార్ హౌస్ చేరుకున్నామన్నారు.


కానీ అప్పటికే భవనం గ్రౌండ్, సెకండ్ ఫ్లోర్‌లలో మంటలు వ్యాపించాయని చెప్పారు. అక్కడ ఉన్నవారు, అగ్నిమాక శాఖ, డీఆర్ఎఫ్ టీమ్స్ సహాయ చర్యలు చేపట్టినట్లు తెలిపారు. ఈ ప్రమాదంలో గాయపడిన వారిని వైద్య చికిత్స నిమిత్తం వేరియస్‌ హాస్పిటల్స్‌కు తరలించినట్లు వెల్లడించారు. అగ్నిప్రమాదం ఘటనపై అనుమానాలు ఉండటంతో క్షుణ్ణంగా విచారణ జరపాలని చార్మినార్ పోలీసులకు ఉత్కర్ష్ మోడీ ఫిర్యాదు చేశారు. ఉత్కర్ష్ మోదీ ఇచ్చిన ఎఫ్‌ఐఆర్ ఏబీఎన్-ఆంధ్రజ్యోతి (ABN - Andhrajyothy) చేతిలో ఉంది.


కాగా.. నిన్న (ఆదివారం ) ఉదయం పాతబస్తీలోని గుల్జార్‌ హౌస్‌లో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఓ భవనం మొదటి అంతస్తులో మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో 17 మంది ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో ఎనిమిది మంది చిన్నారులు, ఐదుగురు మహిళలు ఉన్నారు. ప్రహ్లాద్ మోదీ తన కుటుంబసభ్యులతో కలిసి గత కొన్నేళ్లుగా గుల్జార్ హౌస్‌లో నివాసముంటున్నారు. నిన్న అగ్నిప్రమాదం సంభవించిన సమయంలో 21 మంది కుటుంబసభ్యులు ఆ ఇంట్లో ఉన్నారు. అత్తాపూర్‌లో ఓ వేడుకకు హాజరై వచ్చిన వీరంతా ఇంట్లోనే నిద్రించారు. అదే సమయంలో తెల్లవారుజామున బిల్డింగ్ గ్రౌండ్‌‌ ఫ్లోర్‌లో మంటలు చెలరేగాయి. ఆ మంటలు అంతకంతకూ పెరగడంతో ఇంట్లో ఉన్న నాలుగు ఏసీ కంప్రెజర్‌లో ఒక్కసారిగా బ్లాస్ట్ అయ్యాయి. వెంటనే మేల్కొన్న కుటుంబసభ్యులు బయటకు వచ్చే ప్రయత్నం చేయగా.. ప్రధాన మార్గంలో మంటలతో మూసుకుపోవడంతో వారు బయటకు వచ్చే అవకాశం లేకుండా పోయింది.


పైకి వెళ్లేందుకు ప్రయత్నించినప్పటికీ అప్పటికే మంటలు వ్యాపించాయి. ఓ వైపు మంటలు, దట్టమైన పొగ వ్యాపించడంతో వారంతా కూడా పొగను పీల్చి అపస్మారకస్థితిలోకి వెళ్లిపోయారు. అప్పటికే సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేసేందుకు ప్రయత్నించారు. స్థానికంగా ఉండే వ్యక్తులు వెనక నుంచి హోల్ చేసి లోపలికి వెళ్లి అపస్మారస్థితిలోకి వెళ్లిని వారిని బయటకు తీసుకొచ్చే ప్రయత్నం చేశారు. అలాగే ఫైర్ సిబ్బంది కూడా మంటలను అదుపు చేసి లోపలికి వెళ్లి వారిని బయటకు తీసుకువచ్చారు. అయితే దట్టమైన పొగ పీల్చడంతో 21 మందిలో 17 మంది ప్రాణాలు కోల్పోయారు. మిగిలిన నలుగురు చికిత్స అనంతరం కోలుకున్నారు. ఈ ఘటనపై అగ్నిమాపక సిబ్బందితో పాటు చార్మినార్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.


ఇవి కూడా చదవండి

Hydra Demolitions: హైడ్రా కూల్చివేతలు షూరూ.. టెన్షన్ టెన్షన్

Diamond: వజ్రాన్ని విక్రయించిన రైతు.. ధర ఎంతంటే..

Read Latest Telangana News And Telugu News

Updated Date - May 19 , 2025 | 01:15 PM