Gajjal Kantham: కేసీఆర్ను విచారణకు ఎందుకు పిలవకూడదు..
ABN , Publish Date - Jun 13 , 2025 | 01:16 PM
Gajjal Kantham: రాష్ట్ర ముఖ్యంత్రిగా రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేసిన రోజే కాళేశ్వరంపై విచారణ చేయిస్తామని మాట ఇచ్చారని, పీసీసీ చీఫ్గా ఉన్నపుడే రేవంత్ రెడ్డి కాళేశ్వర ప్రాజెక్టులో జరిగిన అవినీతిని బయట పెట్టారని కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ గజ్జల కాంతం అన్నారు.

Hyderabad: బీఆర్ఎస్ అధ్యక్షుడు (BRS Chief), మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు (Ex CM KCR), ఆయన కుమారుడు కేటీఆర్ (KTR)పై కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ (Congress Leader) గజ్జల కాంతం (Gajjal Kantham) కామెంట్స్ (Comments) చేశారు. శుక్రవారం ఆయన గాంధీ భవన్లో మీడియాతో మాట్లాడారు. కేసీఆర్ తెలంగాణ జాతి పిత కాదని, కేసీఆర్ని విచారణకు ఎందుకు పిలవకూడదని ప్రశ్నించారు. నీతి మంతులు అయితే విచారణ ఎదుర్కోవాలన్నారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మరో సారి పిచ్చిపిచ్చిగా మాట్లాడితే ఆయన ఇల్లు ముట్టడిస్తామని గజ్జల కాంతం అన్నారు.
అవినీతి జరిగిందని తెలిసే విచారణకు..
రాష్ట్ర ముఖ్యంత్రిగా రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేసిన రోజే కాళేశ్వరంపై విచారణ చేయిస్తామని మాట ఇచ్చారని, పీసీసీ చీఫ్గా ఉన్నపుడే రేవంత్ రెడ్డి కాళేశ్వర ప్రాజెక్టులో జరిగిన అవినీతిని బయట పెట్టారని అన్నారు. బీఆర్ఎస్ అవినీతి భరింలేకనే రాష్ట్ర ప్రజలు కాంగ్రెస్ పార్టీని గెలిపించారన్నారు. అధికారులు, చీఫ్ ఇంజనీర్లను విచారణ చేసిన తర్వాతే అవినీతి జరిగిందని కమిటీ నిర్ధారించి కేసీఆర్ను విచారణకు పిలిచిందన్నారు.
కాళేశ్వరం ప్రాజెక్ట్ మీ అబ్బా జాగీరా..
కాళేశ్వరం ప్రాజెక్ట్ మీ అబ్బా జాగీరా.. అని గజ్జల కాంతం ప్రశ్నించారు. తెలంగాణ ప్రజల సొమ్ముతో కట్టిన ప్రాజెక్ట్ కాళేశ్వరమని.. ప్రాజెక్టులో అవినీతి జరిగిందని అధికారులు చెబుతున్నారని.. దీనిపై బీఆర్ఎస్ నాయకులు నీతి పరుల్లా మాట్లాడుతున్నారని విమర్శించారు. కేటీఆర్ ఒళ్లు దగ్గర పెట్టుకొని మాట్లాడాలని అన్నారు. తెలంగాణ సెంటిమెంట్ను అడ్డం పెట్టుకొని కేసీఆర్ ఫ్యామిలీ అవినీతి చేశారని ఆయన ఆరోపించారు. హైదరాబాద్ చుట్టూ పక్కల 30 వేల ఎకరాల భూములు కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు, కవిత బినామీల పేర్లపై ఉన్నాయని గజ్జల కాంతం ఆరోపించారు.
ఇవి కూడా చదవండి:
కొమ్మినేనికి బెయిల్ మంజూరు చేసిన సుప్రీం కోర్టు..
భార్యను హతమార్చి భర్త ఆత్మహత్య..
For More AP News and Telugu News