Share News

Jeevan Reddy Supreme Court: మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డికి సుప్రీంలో ఊరట

ABN , Publish Date - May 14 , 2025 | 03:06 PM

Jeevan Reddy Supreme Court: మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డికి సుప్రీం కోర్టు బిగ్ రిలీఫ్ ఇచ్చింది. మొయినాబాద్ వద్ద ప్రైవేటు భూమిని ఆక్రమించి నిర్మాణాలు చేపట్టారన్న కేసులో జీవన్ రెడ్డికి ముందస్తు బెయిల్‌పై సుప్రీంలో వాదనలు జరిగాయి.

 Jeevan Reddy Supreme Court: మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డికి సుప్రీంలో ఊరట
Jeevan Reddy Supreme Court

న్యూఢిల్లీ, మే 14: ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డికి (Former MLA Jeevan Reddy) సుప్రీం కోర్టులో (Supreme Court) ఊరట లభించింది. మొయినాబాద్ వద్ద ప్రైవేటు భూమిని ఆక్రమించి నిర్మాణాలు చేపట్టారన్న కేసులో జీవన్ రెడ్డికి సుప్రీం ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. మొయినాబాద్ భూ వ్యవహారంలో జీవన్ రెడ్డి పిటిషన్ కొట్టేసి, దర్యాప్తునకు పూర్తిగా సహకరించాలని తెలంగాణ హైకోర్టు ఆదేశించిన విషయం తెలిసిందే. తెలంగాణ హైకోర్టు ఆదేశాలను సుప్రీంకోర్టులో జీవన్ రెడ్డి సవాల్ చేశారు. ఈ పిటిషన్‌పై ఈరోజు (బుధవారం) సుప్రీంలో విచారణ జరిగింది.


ఈ వ్యవహారంలో తన కుటుంబ సభ్యులకు బెయిల్ మంజూరు చేశారని కోర్టుకు జీవన్ రెడ్డి న్యాయవాది చెప్పారు. దర్యాప్తుకు పూర్తిగా సహకరించాల్సిందే అని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ముందస్తు బెయిల్ మంజూరు చేస్తూ జస్టిస్ పార్థివాలా ధర్మాసనం తుది ఉత్తర్వులు ఇచ్చింది. ఒకవేళ దర్యాప్తునకు సహరించకపోతే విచారణాధికారులు తగిన చర్యలు తీసుకునే వెసులుబాటును సుప్రీం కోర్టు కల్పించింది.

KTR Slams Rahul: రాహుల్.. మీకు ఆ కంపెనీతో రహస్య ఒప్పందం ఉందా


కాగా.. మెకిలాలో 114 ఎకరాల భూమి కబ్జా చేశారంటూ ఆయనపై ఆ భూ యజమాని సామ దామోదర్ రెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు జీవన్ రెడ్డిపై మోకిలాతో పాటు చేవెళ్ల పోలీస్ స్టేషన్లలో పలు సెక్షన్ల కింద కేసులు నమోదయ్యాయి. జీవన్ రెడ్డి భార్య, తల్లిపై కూడా చేవెళ్ల పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదు అయిన విషయం తెలిసిందే.


ఇవి కూడా చదవండి

AP Liquor Scam: గోవిందప్పను కోర్టుకు తీసుకొచ్చిన పోలీసులు.. అంతలోనే

CAIT Letter To Piyush Goyal: ఈ-కామర్స్‌ ఫ్లాట్‌ఫారాలపై పాక్ జెండాలు.. సీఏఐటీ అభ్యంతరం

Read Latest Telangana News And Telugu News

Updated Date - May 14 , 2025 | 03:53 PM