Share News

TG News: మూడో రోజు ఢిల్లీ పర్యటనలో సీఎం రేవంత్ రెడ్డి

ABN , Publish Date - Jun 11 , 2025 | 08:56 AM

TG News: తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గంలోని మంత్రుల శాఖల్లో భారీ మార్పులు చోటుచేసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. కొత్తగా బాధ్యతలు చేపట్టిన ముగ్గురు మంత్రులకు శాఖల కేటాయింపుతోపాటు ప్రస్తుతం ఉన్న మంత్రుల శాఖలను మార్చే దిశగా కాంగ్రెస్‌ అధిష్టానం కసరత్తు చేస్తోంది. శాఖల కేటాయింపుపై బుధవారం స్పష్టత రానుంది.

TG News: మూడో రోజు ఢిల్లీ పర్యటనలో సీఎం రేవంత్ రెడ్డి
CM Revanth Reddy Delhi Tour

న్యూఢిల్లీ: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) మూడోరోజు (3rd Day) బుధవారం ఢిల్లీ పర్యటనలో (Delhi Visit) ఉన్నారు. ఈరోజు మరోసారి కాంగ్రెస్ అధిష్టాన పెద్దలను (Congress High Command) కలిసే అవకాశం ఉంది. నూతన మంత్రులకు శాఖల కేటాయింపుపై ఈరోజు స్పష్టత రానుంది. మరోవైపు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా ఢిల్లీ పర్యటనలో ఉన్నారు. గోదావరి బనకచర్ల ప్రాజెక్టుపై కేంద్ర జలశక్తి మంత్రిని కలిసే అవకాశం ఉన్నట్లు సమాచారం. కాగా రెండు రోజులుగా ఢిల్లీలోనే బిజీబిజీగా కాంగ్రెస్ పెద్దలతో భేటీ అవుతున్న సీఎం రేవంత్ రెడ్డికి తోడు ఇద్దరు కీలక మంత్రులకు హస్తిన నుంచి పిలుపు రావడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. మొదట ఉత్తమ్‌.. ఆ వెంటనే ఉప ముఖ్యమంత్రి భట్టిని ఢిల్లీకి రావాలని హైకమాండ్ నుంచి ఆదేశాలు రావడంతో వారిద్దరూ వెళ్లారు. కొత్త మంత్రులకు శాఖల కేటాయింపుతోపాటు మరిన్ని కీలక అంశాలపై చర్చలు జరుగుతున్నట్లు సమాచారం.


మంత్రుల శాఖల్లో భారీ మార్పులు ..!

తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గంలోని మంత్రుల శాఖల్లో భారీ మార్పులు చోటుచేసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. కొత్తగా బాధ్యతలు చేపట్టిన ముగ్గురు మంత్రులకు శాఖల కేటాయింపుతోపాటు ప్రస్తుతం ఉన్న మంత్రుల శాఖలనూ మార్చే దిశగా కాంగ్రెస్‌ అధిష్ఠానం కసరత్తు చేస్తోంది. సీఎం రేవంత్‌రెడ్డి రెండు రోజులుగా ఢిల్లీలో ఇదే అంశంపై అధిష్ఠానం పెద్దలతో విస్తృత చర్చలు జరుపుతున్నారు. సోమవారం ఢిల్లీకి వచ్చిన రేవంత్‌ రెడ్డి.. ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి (సంస్థాగత) కేసీ వేణుగోపాల్‌తో గంటకు పైగా చర్చించారు.


మంత్రుల పనితీరుపై రాహుల్ ఆరా..

తిరిగి సీఎం రేవంత్‌ రెడ్డి మంగళవారం పార్టీ అగ్రనేతలు రాహుల్‌గాంధీ, మల్లికార్జున ఖర్గే, కేసీ వేణుగోపాల్‌తో రెండున్నర గంటలపాటు భేటీ అయ్యారు. ఇందిరా భవన్‌లో జరిగిన ఈ సమావేశంలో ప్రధానంగా మంత్రుల శాఖల మార్పు పైనే చర్చించినట్లు కాంగ్రెస్‌ పార్టీ వర్గాల ద్వారా తెలిసింది. సీఎం రేవంత్‌ రెడ్డితో కలిపి మంత్రివర్గంలో ఇప్పటికే 12 మంది ఉండగా, కొత్తగా మరో ముగ్గురికి అవకాశం కల్పించిన విషయం తెలిసిందే. దీంతో కొత్త మంత్రులకు ఏ శాఖలు కేటాయించాలనే అంశంపై నిర్ణయించేందుకుగాను.. ప్రస్తుత ఎవరెవరివద్ద ఏయే మంత్రిత్వ శాఖలు ఉన్నాయనే దానిపై చర్చించినట్లు తెలిసింది. ఇందులో కీలక శాఖలు నిర్వహిస్తున్న మంత్రులెవరు? వారి పనితీరు ఎలా ఉంది? అనే విషయాలపై రేవంత్‌రెడ్డిని రాహుల్‌గాంధీ ప్రత్యేకంగా అడిగి తెలుసుకున్నట్టు పార్టీ వర్గాలు పేర్కొన్నాయి.


ఇవి కూడా చదవండి:

సజ్జల, కొమ్మినేనిపై ఎమ్మెల్యే కోటంరెడ్డి హాట్ కామెంట్స్...

కత్తిని మింగిన పాము.. తర్వాత ఏం జరిగిందంటే..

For More AP News and Telugu News

Read Latest and Crime News

Updated Date - Jun 11 , 2025 | 08:56 AM