MLC Kavitha Letter: కవిత లేఖపై ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ రియాక్షన్
ABN , Publish Date - May 23 , 2025 | 06:31 PM
బీఆర్ఎస్ ఎమ్మెల్సీ, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ తనయి కల్వకుంట్ల కవిత రాసిన లేఖ ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో సంచలనంగా మారుతోంది. తాజాగా ఈ లేఖపై BRS ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ స్పందించారు.

ఇంటర్నెట్ డెస్క్: MLC Kavitha's Letter: బీఆర్ఎస్ ఎమ్మెల్సీ, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ తనయి కల్వకుంట్ల కవిత రాసిన లేఖ ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో సంచలనంగా మారుతోంది. తాజాగా ఈ లేఖపై BRS ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ స్పందించారు. కవిత లేఖ పార్టీ అంతర్గత వ్యవహారమని, తాము తేల్చుకుంటామని చెప్పారు. కవిత పేరుతో లేఖ.. రేవంత్ సృష్టించినది కావొచ్చు? అనే సందేహాన్ని కూడా దాసోజు వ్యక్తం చేశారు.
"ఒకవేళ కవితనే రాస్తే.. తప్పేంటి? పార్టీలో అంతర్గత ప్రజాస్వామ్యం ఉంది. కవిత తన సూచనలు చేశారు. నిజంగా కవిత లేఖ రాస్తే.. దాన్ని భూతద్దంలో చూడాల్సిన పని లేదు. BJPని KCR టార్గెట్ చేయలేదనటం కవిత సొంత అభిప్రాయం. బీజేపీ, మోదీని కేసీఆర్ మాదిరి ఎవరూ ప్రశ్నించలేదు." అని దాసోజు వ్యాఖ్యానించారు. కేంద్రమంత్రి కిషన్ రెడ్డి తన పార్టీలోని గ్రూపులను చక్కదిద్దుకోవాలని సలహా ఇచ్చిన శ్రవణ్.. నేషనల్ హెరాల్డ్ కేసును కప్పిపుచ్చుకునేందుకే కవిత లేఖ పేరుతో రేవంత్ డ్రామాలాడుతున్నారని శ్రవణ్ ఆరోపించారు.
ఇవీ చదవండి:
భారత సైన్యాన్ని మెచ్చుకున్న అమిత్ షా
ఆర్గానిక్ ఉత్పత్తులకు కొత్త ప్రపంచం
మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి