Share News

Eatela Kaleshwaram Inquiry: కాళేశ్వరం కమిషన్ విచారణకు ఈటెల

ABN , Publish Date - Jun 06 , 2025 | 11:49 AM

Eatela Kaleshwaram Inquiry: కాళేశ్వరం ప్రాజెక్ట్ అవకతవలపై న్యాయవిచారణ కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో కమిషన్ చైర్మన్ పీసీ ఘోష్ ముందు ఎంపీ ఈటెల రాజేందర్ విచారణకు హాజరయ్యారు.

Eatela Kaleshwaram Inquiry: కాళేశ్వరం కమిషన్ విచారణకు ఈటెల
Eatela Kaleshwaram Inquiry

హైదరాబాద్, జూన్ 6: కాళేశ్వరం ప్రాజెక్ట్‌పై (Kaleshwaram Project) పీసీ ఘోష్ కమిషన్ విచారణ మరోసారి మొదలైంది. ఇందులో భాగంగా బీజేపీ ఎంపీ ఈటెల రాజేందర్ (BJP MP Etela Rajender) కాళేశ్వరం కమిషన్ ముందు విచారణకు హాజరయ్యారు. ఈరోజు (శుక్రవారం) ఉదయం శామీర్‌పేట నివాసం నుంచి బీఆర్‌కే భవన్‌కు (BRK Bhavan) చేరుకున్నారు ఎంపీ. ఈటల రాజేందర్ వెంట పెద్ద సంఖ్యలో అభిమానులు తరలివచ్చారు. కాళేశ్వరం కమిషన్ చైర్మన్ పీసీ ఘోష్ బీఆర్‌కే భవన్‌కు చేరుకోవడంతో విచారణ ప్రారంభమైంది.


కాగా.. కాళేశ్వరం ప్రాజెక్ట్ అవకతవలపై న్యాయవిచారణ కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఈరోజు విచారణకు రావాల్సిందిగా ఈటెలకు ఇదివరకే కాళేశ్వరం కమిషన్ నోటీసులు పంపించింది. దీంతో నేడు కమిషన్‌ ముందు విచారణకు ఎంపీ హాజరయ్యారు. బ్యారేజీల నిర్మాణ సమయంలో అప్పటి బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో ఈటెల ఆర్థిక మంత్రిగా పనిచేశారు. బ్యారేజీల నిర్మాణాలకు నిధులు విడుదల, మంత్రి మండలి తీర్మానాలపై కమిషన్ ప్రశ్నించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటి వరకు జరిగిన విచారణలో ప్రస్తుత మాజీ ఈఎన్సీలు, సీఈలు, ఐఏఎస్ అధికారులు.. కమిషన్‌ ముందు విచారణకు హాజరై ఆర్థిక సంబంధమైన పలు అంశాలపై వాంగ్మూలం ఇచ్చారు.


వారు పేర్కొన్న అంశాల ఆధారంగా ఆర్థిక సంబంధమైన లోపాలు, నింబంధనల ఉల్లంఘనలు ఏమైనా చోటు చేసుకున్నాయా, నాడు జరిగిన నిర్ణయాలు ఏమిటి అనే విషయాలపై ఈటెలను కమిషన్ ప్రశ్నించే అవకాశం ఉంది. ఈ క్రమంలో అప్పటి మంత్రి అయినప్పటికీ ప్రస్తుతం బీజేపీ ఎంపీగా ఈటెల ఉన్న నేపథ్యంలో కమిషన్ ముందు ఏ విషయాలు తెలియజేస్తారా అనే ఉత్కంఠ సర్వత్రా నెలకొంది. ఇక మరోవైపు ఈనెల 11న విచారణకు రావాల్సిందిగా మాజీ ముఖ్యమంత్రి, బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్‌కు కూడా కమిషన్ నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే. అంతకు ముందు జూన్ 5 నే విచారణకు రావాల్సిందిగా కేసీఆర్‌కు కమిషన్ నోటీసులు పంపింది. అయితే సమయం కావాలని కోరడంతో ఈనెల 11కు విచారణకు రావాలని కమిషన్ పేర్కొంది. అలాగే మాజీ మంత్రి హరీష్‌ రావుకు కూడా కమిషన్ నోటీసులు ఇచ్చింది. దీంతో ఈనెల 9న కమిషన్‌ ముందు హరీష్‌ రావు విచారణకు హాజరుకానున్నారు.


ఇవి కూడా చదవండి

ముదిరిన వివాదం.. శాతవాహన కాలేజ్ నేలమట్టం

ఆర్సీబీకి పోలీసుల షాక్.. గట్టిగా బిగిస్తున్నారుగా..

Read Latest Telangana News And Telugu News

Updated Date - Jun 06 , 2025 | 01:54 PM