Share News

ACB: హరి‌రామ్‌ బ్యాంక్ లాకర్లను ఓపెన్ చేయనున్న ఏసీబీ అధికారులు...

ABN , Publish Date - Apr 28 , 2025 | 09:44 AM

ఏసీబీ అధికారులు హరీ రామ్‌ను అరెస్ట్ చేసి రీమాండ్‌కు తరలించారు. కాళేశ్వరం కార్పొరేషన్ ఎండీగా ఆయన వ్యవహారించారు. హరీ రామ్‌ను అధికారులు కస్టడీలోకి తీసుకొని విచారించాలని భావిస్తున్నారు. ఈ మేరకు సోమవారం కోర్టులో కస్టడీ పిటీషన్ దాఖలు చేయనున్నారు. కస్టడీలోకి తీసుకుని విచారిస్తే మరిన్ని విషయాలు బయటకు వచ్చే అవకాశం ఉందని ఏసీబీ అధికారులు భావిస్తున్నారు.

ACB: హరి‌రామ్‌ బ్యాంక్ లాకర్లను ఓపెన్ చేయనున్న ఏసీబీ అధికారులు...
Kaleswaram Case Hari Ram

హైదరాబాద్: కాలేశ్వరం (Kaleswaram) ఈఎన్‌సీ (ENC) హరి రామ్ కేసు (Hari Ram case)లో ఏసీబీ (ACB) దర్యాప్తు (investigation) ముమ్మరం చేసింది. ఇప్పటికే ఆయన నివాసంలో సోదాలు చేసి భారీగా అక్రమ ఆస్తులను ఏసీబీ అధికారులు గుర్తించిన విషయం తెలిసిందే. హరి రామ్‌ఫై ఆదాయనికి మించిన ఆస్తుల కేసు నమోదు చేశారు. ఆయనకు చెందిన మూడు బ్యాంక్ లాకర్ల (Bank lockers)ను ఓపెన్ చేయనున్నారు. ఇప్పటికే రూ. 200 కోట్ల స్థిర చరా ఆస్తులను అధికారులు గుర్తించిన విషయం తెలిసిందే. ఒక్క గజ్వేల్‌లోనే హరీ రామ్ 30 ఎకరాల భూములు కొనుగోలు చేశారు. కాలేశ్వరం నిర్మాణం సమయంలోనే ఆయన భారీగా ఆస్తులను కూడా పెట్టుకున్నారు.

Also Read: విద్యుత్ అధికారుల నిర్లక్ష్యంతో నిండు ప్రాణం బలి


ఏసీబీ కస్టడీ పిటిషన్..

ఏసీబీ అధికారులు హరీ రామ్‌ను అరెస్ట్ చేసి రీమాండ్‌కు తరలించారు. కాళేశ్వరం కార్పొరేషన్ ఎండీగా ఆయన వ్యవహారించారు. హరీ రామ్‌ను అధికారులు కస్టడీలోకి తీసుకొని విచారించాలని భావిస్తున్నారు. ఈ మేరకు సోమవారం కోర్టులో కస్టడీ పిటీషన్ దాఖలు చేయనున్నారు. కస్టడీలోకి తీసుకుని విచారిస్తే మరిన్ని విషయాలు బయటకు వచ్చే అవకాశం ఉందని ఏసీబీ అధికారులు భావిస్తున్నారు. కాగా ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో అరెస్టయిన కాళేశ్వరం ఈఎన్‌సీ భూక్యా హరిరామ్‌ కూడ బెట్టిన ఆస్తుల విలువ రూ.200 కోట్ల పైమాటేనని ఏసీబీ వర్గాలు చెబుతున్నాయి. అయితే, తన బినామీల గుట్టును హరిరామ్‌ బయటపెట్టలేదని సమాచారం. దీంతో ఆయనను కస్టడీలోకి తీసుకుని విచారణ చేపట్టాలని ఏసీబీ భావిస్తోంది. హరిరామ్‌ను శనివారం అదుపులోకి తీసుకున్న అధికారులు ఆదివారం తెల్లవారుజామున 3 గంటలకు న్యాయమూర్తి ఇంట్లో హాజరు పరిచారు. న్యాయమూర్తి 14 రోజుల జ్యూడీషియల్‌ కస్టడీ విధించగా హరిరామ్‌ను చంచల్‌గూడ జైలుకు తరలించారు.


ప్రాజెక్టుల్లో హరిరామ్‌ కీలకపాత్ర

కాళేశ్వరం ప్రాజెక్టు సహా నీటిపారుదల శాఖలోని పలు ముఖ్యమైన ప్రాజెక్టుల్లో హరిరామ్‌ కీలకపాత్ర పోషించారు. హరిరామ్‌ చేతుల మీదుగా వేలకోట్ల రూపాయల విలువైన ప్రాజెక్టుల పనులు జరిగాయి. ఈ క్రమంలోనే హరిరామ్‌ భారీగా అక్రమ ఆస్తులు కూడబెట్టినట్లు ఏసీబీ అధికారులు గుర్తించారు. బహిరంగ మార్కెట్‌లో రూ.200 కోట్లకు పైగా విలువ ఉండే ఆస్తులను ఇప్పటి వరకు గుర్తించామని అధికారులు అంతర్గత సంభాషణల్లో పేర్కొంటున్నారు. కేసీఆర్‌ వ్యవసాయ క్షేత్రం ఉన్న మర్కూక్‌ మండలంలో హరిరామ్‌ 28 ఎకరాల వ్యవసాయ భూమిని కొనుగోలు చేశారు. హైదరాబాద్‌లోని షేక్‌పేట్‌, కొండాపూర్‌లో హరిరామ్‌కు రెండు విల్లాలుండగా వాటి విలువ రూ.10 కోట్లకు పైనే ఉంటుందని సమాచారం. ఇక, హైదరాబాద్‌లోని శ్రీనగర్‌కాలనీ, మాదాపూర్‌, నార్సింగ్‌ ప్రాంతాల్లో ఆయనకు ఉన్న ఫ్లాట్ల విలువ రూ.10 కోట్లకుపైనే ఉంటుందని అంచనా. ఏపీ రాజధాని అమరావతిలో హరిరామ్‌కు ఉన్న వాణిజ్య స్థలం విలువ రూ.20 కోట్లు ఉండవచ్చునని చెబుతున్నారు. ఇవే కాక, పటాన్‌చెరు లాంటి కీలక ప్రాంతంలో 20 గుంటల స్ధలం, శ్రీనగర్‌ కాలనీలో రెండు ఇండిపెండెంట్‌ ఇళ్లు, బొమ్మలరామారంలో ఆరు ఎకరాల మామిడితోటలో ఖరీదైన ఫామ్‌హౌస్‌, కొత్తగూడెంలో ఓ వాణిజ్య సముదాయం, కుత్బుల్లాపూర్‌, మిర్యాలగూడలో ఇళ్ల స్థలాలు గుర్తించారు. హరిరామ్‌కు చెందిన కొన్ని బ్యాంకు లాకర్లు ఇంకా తెరవాల్సి ఉంది.


ఈ వార్తలు కూడా చదవండి..

మీ ఇంట్లో ఏపీ ఉందా.. అయితే ఈ జాగ్రర్తలు పాటించండి..

కేంద్రంపై 1.50 లక్షల కోర్టు ధిక్కరణ కేసులు

For More AP News and Telugu News

Updated Date - Apr 28 , 2025 | 09:44 AM