Train: మంచిర్యాల పరిసర ప్రాంత ప్రజలకు గుడ్న్యూస్.. అదేంటంటే..
ABN , Publish Date - May 28 , 2025 | 11:48 AM
సింగరేణి కార్మిక ప్రాంతమైన మంచిర్యాల ప్రజలకు శుభవార్త. మంచిర్యాల రైల్వేస్టేషన్ లో ఇకనుంచి భగత్ కి కోఠి-డా.ఎంజీఆర్ చెన్నై సెంట్రల్ సూపర్ ఫాస్ట్ ప్రత్యేక రైలు మంచిర్యాల స్టేషన్లో ఆగుతుంది. ఈ నెల 31వ తేది నుంచి ఈ ప్రత్యేక రైలుకు హాల్టింగ్ కల్పించారు.

- మంచిర్యాలలో సూపర్ఫాస్ట్ రైలుకు హాల్ట్..
చెన్నై: చెన్నై సెంట్రల్-భగత్ కి కోఠి- సెంట్రల్ సూపర్ ఫాస్ట్ రైళ్లకు తెలంగాణా రాష్ట్రం మంచిర్యాల(Manchiryal) స్టేషన్లో హాల్ట్ ఇచ్చార. ఈ మేరకు దక్షిణ రైల్వే విడుదల చేసిన ప్రకటనలో నెం.06157 డా.ఎంజీఆర్ చెన్నై సెంట్రల్-భగత్ కి కోఠి వారాంతపు సూపర్ ఫాస్ట్ రైలు ఈ నెల 28వ తేది నుంచి ఉదయం 6.14 గంటలకు మంచిర్యాల స్టేషన్(Manchiryal Station)కు చేరుకుని 6.15 గంటలకు బయల్దేరుతుంది.
అలాగే, నెం.06158 భగత్ కి కోఠి-డా.ఎంజీఆర్ చెన్నై సెంట్రల్ సూపర్ ఫాస్ట్ ప్రత్యేక రైలు ఈ నెల 31వ తేది నుంచి ఉదయం 10.34 గంటలకు మంచిర్యాల స్టేషన్ చేరుకుని 10.35 గంటలకు బయల్దేరి వెళ్తుందని దక్షిణ రైల్వే తెలియజేసింది.
ఈ వార్తలు కూడా చదవండి.
Gold Rates Today: గుడ్ న్యూస్..వరుసగా రెండోరోజు తగ్గిన బంగారం ధరలు..
Miss World 2025: మిస్ వరల్డ్ ఫైనల్స్... 3 గంటలు.. 3500 మంది ప్రేక్షకులు
Read Latest Telangana News and National News