Share News

Hyderabad Metro: మెట్రో రెండో దశకు అనుమతులివ్వండి

ABN , Publish Date - May 25 , 2025 | 04:15 AM

మెట్రో రెండో దశకు అనుమతులివ్వాలని ప్రధాని నరేంద్ర మోదీకి ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి విజ్ఞప్తి చేశారు. తెలంగాణలో పదేళ్లు అధికారంలో ఉన్న గత ప్రభుత్వం విస్తరణ చేపట్టలేదని ప్రధాని దృష్టికి తీసుకెళ్లారు.

Hyderabad Metro: మెట్రో రెండో దశకు అనుమతులివ్వండి

గత ప్రభుత్వం విస్తరణ చేపట్టలేదు.. ఆర్‌ఆర్‌ఆర్‌కు ఆర్థిక, క్యాబినెట్‌ ఆమోదం తెలపండి

  • బందరు పోర్టు-హైదరాబాద్‌ డైప్రోర్టు.. గ్రీన్‌ ఫీల్డ్‌ హైవేను మంజూరు చేయండి

  • ఐఎ్‌సఎమ్‌ ప్రాజెక్టును ఆమోదించండి

  • రక్షణ రంగ ప్రాజెక్టులకు మద్దతివ్వండి

  • ప్రధాని మోదీకి సీఎం రేవంత్‌ విజ్ఞప్తి

న్యూఢిల్లీ, మే 24 (ఆంధ్రజ్యోతి): మెట్రో రెండో దశకు అనుమతులివ్వాలని ప్రధాని నరేంద్ర మోదీకి ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి విజ్ఞప్తి చేశారు. తెలంగాణలో పదేళ్లు అధికారంలో ఉన్న గత ప్రభుత్వం విస్తరణ చేపట్టలేదని ప్రధాని దృష్టికి తీసుకెళ్లారు. శనివారం ఢిల్లీలో ప్రధాని మోదీని సీఎం రేవంత్‌రెడ్డి కలిసి పలు అంశాలపై వినతి పత్రాలను అందజేశారు. హైదరాబాద్‌లో మెట్రో మొదటి దశలో భాగంగా రూ.22 వేల కోట్లతో 69 కిలోమీటర్ల మేర నిర్మించారని వివరించారు. రెండోదశ విస్తరణకు ప్రతిపాదనలను ఇప్పటికే సమర్పించామని గుర్తుచేశారు. రెండో దశలో భాగంగా.. రూ.24,269 కోట్లతో 76.4 కిలోమీటర్లలో ఐదు కారిడార్లను నిర్మించనున్నట్టు తెలిపారు. ఇది కేంద్ర, రాష్ట్రాల సమన్వయంతో చేపట్టాల్సిన ప్రాజెక్టని చెప్పారు. కేంద్రం వాటా కింద 18ు(రూ.4,230 కోట్లు), రాష్ట్ర వాటాగా 30ు(రూ. 7,313 కోట్లు), మిగిలిన 48ు(రూ. 11,693 కోట్లు) రుణంగా తీసుకోనున్నట్టు వివరించారు. హైదరాబాద్‌ మెట్రో రెండో దశకు సంబంధించి గతేడాది నవంబరు 4న కేంద్ర గృహ, పట్టణ శాఖకు ప్రతిపాదనలు సమర్పించామన్నారు. వాటిపై కేంద్రం కొన్ని ప్రశ్నలను లేవనెత్తగా.. సమాధానాలిచ్చామన్నారు.


రీజినల్‌ రింగ్‌ రోడ్డు విషయంలో..

హైదరాబాద్‌ చుట్టూ రెండు జాతీయ రహదారులతో రీజినల్‌ రింగు రోడ్డు(ఆర్‌ఆర్‌ఆర్‌)ను ప్రతిపాదించామని సీఎం రేవంత్‌ గుర్తుచేశారు. ఉత్తర భాగం(సంగారెడ్డి- నర్సాపూర్‌- తూప్రాన్‌-గజ్వేల్‌-భువనగిరి-చౌటుప్పల్‌), దక్షిణ భాగం(చౌటుప్పల్‌-అమన్‌గల్‌-షాద్‌నగర్‌-సంగారెడ్డి) మీదుగా ఆర్‌ఆర్‌ఆర్‌ నిర్మించనున్నట్లు వివరించారు. ఉత్తర భాగానికి సంబంధించి 2022లో భూసేకరణ ప్రారంభమైందని.. ఇందులో 50ు వ్యయాన్ని రాష్ట్రమే భరిస్తుందని చెప్పారు. 90ు భూముల ప్రతిపాదనలను జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ(ఎన్‌హెచ్‌ఏఐ)కు పంపగా, టెండర్లను పిలిచిందని, దీనికి సంబంధించి ఆర్థిక, క్యాబినెట్‌ ఆమోదం తెలపాలని విజ్ఞప్తి చేశారు. ఉత్తర భాగంతోపాటే దక్షిణ భాగాన్ని సైతం ఏకకాలంలో చేపట్టాలని భావిస్తున్నామని తెలిపారు. ఐటీ, ఫార్మా, లాజిస్టిక్స్‌ వృద్ధితో హైదరాబాద్‌ వేగంగా అభివృద్ధి చెందుతోందని చెప్పారు. ప్రస్తుతమున్న ఓఆర్‌ఆర్‌ రాబోయే ఐదేళ్లలో సరిపోదన్నారు. ఉత్తర భాగం తర్వాత దక్షిణ భాగం నిర్మాణం చేపడితే భూ సేకరణ, నిర్మాణ వ్యయం భారీగా పెరిగే ప్రమాదముందని, అందుకే రెండు భాగాలను కలిపి ఒకేసారి పూర్తి చేస్తేనే ఉపయుక్తంగా ఉంటుందని తెలిపారు. దక్షిణ భాగానికి సంబంధించి భూ సేకరణకు అయ్యే వ్యయంలో 50ు భరించేందుకు తెలంగాణ సిద్ధంగా ఉందన్నారు.


డ్రైపోర్టుకు గ్రీన్‌ఫీల్డ్‌ హైవే

రీజినల్‌ రింగు రోడ్డుకు సమాంతరంగా 370 కిలోమీటర్ల పరిధిలో రైల్వే లైన్‌ను ప్రతిపాదించామని ప్రధానికి సీఎం రేవంత్‌ వివరించారు. బందరు పోర్టు నుంచి హైదరాబాద్‌ డైప్రోర్ట్‌ వరకు గ్రీన్‌ఫీల్డ్‌ హైవేను మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు. దేశంలో 35ు ఔషధాలను తెలంగాణ ఉత్పత్తి చేస్తోందని గుర్తుచేశారు. ‘‘డైప్రోర్ట్‌ గ్రీన్‌ఫీల్డ్‌ హైవేతో సరుకు రవాణా ఖర్చును తగ్గించవచ్చు. తయారీ రంగానికి ప్రోత్సాహకంగా ఉంటుంది. కొత్త ఉద్యోగాలను సృష్టిస్తుంది’’ అని వివరించారు. సెమీ కండక్టర్‌ రంగానికి మద్దతు ఇవ్వాలని కోరారు. ఇండియా సెమీకండక్టర్‌ మిషన్‌(ఐఎ్‌సఎమ్‌)కు తెలంగాణ పూర్తి మద్దతు ఇస్తోందన్నారు. హైదరాబాద్‌లో ఏఎండీ, క్వాల్‌ కామ్‌, ఎన్వీఐడీఐఏ వంటి ఆర్‌అండ్‌ డీ కేంద్రాలున్నాయని తెలిపారు. హైదరాబాద్‌లో పరిశ్రమలకు అనుకూలమైన స్థలాలు, మౌలిక సదుపాయాలు అందుబాటులో ఉన్నాయని చెప్పారు. తెలంగాణ ఐఎ్‌సఎమ్‌ ప్రాజెక్టుకు ఆమోదం తెలపాలని విజ్ఞప్తి చేశారు. తద్వారా పెట్టుబడిదారులకు నమ్మకాన్ని కలిగించి ఉద్యోగాలు సృష్టించవచ్చని.. 2030 నాటికి ఎలకా్ట్రనిక్స్‌ ఉత్పత్తిలో 500 బిలియన్‌ డాలర్లకు చేరుకోవాలనే లక్ష్యానికి ఇది తోడ్పడుతుందని అభిప్రాయపడ్డారు.


రక్షణ రంగ ప్రాజెక్టులపై..

హైదరాబాద్‌లో ప్రభుత్వ, ప్రభుత్వ-పైవ్రేటు సంయుక్త భాగస్వామ్యం(పీపీపీ)లో ఎంఎ్‌సఎంఈల్లో ఉన్న రక్షణ రంగ ప్రాజెక్టులకు మద్దతు ఇవ్వాలని ప్రధాని మోదీని సీఎం రేవంత్‌ కోరారు. హైదరాబాద్‌లో డీఆర్డీవో, డిఫెన్సు పీఎ్‌సయూలు ఉన్నత స్థాయిలో పని చేస్తున్నాయని గుర్తుచేశారు. హైదరాబాద్‌-బెంగళూరు ఢిఫెన్స్‌ కారిడార్‌ను మంజూరు చేయాలన్నారు. యూపీ, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాలకు ప్రోత్సాహం ఉందని, తెలంగాణకు లేదని రేవంత్‌ తెలిపారు. ఆయా రాష్ట్రాలతో సమానంగా తెలంగాణకు కేంద్రం మద్దతు ఇవ్వాలన్నారు. రక్షణ రంగ పరికరాల తయారీలో ముందున్న హైదరాబాద్‌లో ఢిఫెన్సు ఎక్స్‌పోను నిర్వహించాలని కోరారు.


ఇవి కూడా చదవండి

Government Doctor: భార్యను పుట్టింటికి పంపించి.. వేరే మగాళ్లతో ఇంట్లో ఆ వీడియోలు..

Telangana: కవిత చెప్పిన దెయ్యాలు వారే.. సామ సంచలన కామెంట్స్..

Updated Date - May 25 , 2025 | 04:15 AM