Asaduddin Owaisi: ఆపరేషన్ సిందూర్కు మజ్లిస్ చీఫ్ ఒవైసీ మద్దతు
ABN , Publish Date - May 08 , 2025 | 04:45 AM
పాకిస్థాన్లోని ఉగ్రవాద శిబిరాలపై భారత రక్షణ దళాలు నిర్వహించిన ఆపరేషన్ సిందూర్కు మజ్లిస్ పార్టీ అధ్యక్షుడు, ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ మద్దతు పలికారు.

హైదరాబాద్, మే 7 (ఆంధ్రజ్యోతి): పాకిస్థాన్లోని ఉగ్రవాద శిబిరాలపై భారత రక్షణ దళాలు నిర్వహించిన ఆపరేషన్ సిందూర్కు మజ్లిస్ పార్టీ అధ్యక్షుడు, ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ మద్దతు పలికారు. మరోసారి అమాయక పర్యాటకులపై దాడికి పాల్పడకుండా పాకిస్థాన్కు గట్టి గుణ పాఠం నేర్పించాలని బుధవారం ఎక్స్ వేదిక ద్వారా ఆయన పేర్కొన్నారు.
పాక్లోని ఉగ్రవాదులకు మౌలిక సదుపాయాలు అందకుండా చర్యలు తీసుకోవాలని, ఉగ్రవాద శిబిరాలను సమూలంగా నాశనం చేయాలన్నారు. ఉగ్రవాదుల శిక్షణ శిబిరాలపై భారత రక్షణ దళాలు నిర్వహించిన దాడులను స్వాగతిస్తున్నట్టు ఆయన పేర్కొన్నారు.
ఇవి కూడా చదవండి:
Operation Sindoor: ఆపరేషన్ సిందూర్ దాడికి ముందు..దాడి తర్వాత ఎలా ఉందంటే..
Operation Sindoor: ఆపరేషన్ సిందూర్పై..సచిన్, సెహ్వాగ్ సహా పలువురి క్రీడా ప్రముఖుల స్పందన
Bank of Baroda Recruitment: టెన్త్ అర్హతతో బ్యాంకులో ఉద్యోగాలు..నెలకు రూ.37 వేల జీతం
Read More Business News and Latest Telugu News