Kavitha Tour: బీఆర్ఎస్ నిఘా నీడలో కవిత పర్యటన
ABN , Publish Date - May 30 , 2025 | 03:36 PM
Kavitha Tour: బీఆర్ఎస్ నిఘా నీడలో ఎమ్మెల్సీ కవిత పర్యటన సాగినట్లు తెలుస్తోంది. బీఆర్ఎస్ పార్టీ నేతలు, కార్యకర్తలు కవిత పర్యటనకు దూరంగా ఉన్నారు. కేవలం జాగృతి కార్యకర్తలతో కలిసి మాత్రమే జిల్లాలో కవిత పర్యటించారు.

మంచిర్యాల, మే 30: జిల్లాలో ఎమ్మెల్సీ కవిత (ఛMLC Kavitha) పర్యటనపై బీఆర్ఎస్ అధిష్టానం (BRS High Command) పూర్తిస్థాయిలో నిఘా పెట్టింది. పార్టీకి సంబంధించి నేతలు ఎవరెవరు వెళ్తున్నారనే దానిపై ఆరా తీసింది. సొంత మీడియా ప్రతినిధులతో పర్యటన మొత్తాన్ని చిత్రీకరించాలని ఆదేశించింది. న్యూస్ అవసరం లేదని.. కవిత వెంట ఎవరెవరు ఉన్నారో వివరాలు ఇవ్వాలని ఆదేశించినట్లు తెలుస్తోంది. అయితే పార్టీకి సంబంధించి నాయకులు ఎవరూ కూడా కవిత పర్యటనకు హాజరుకాకుండా ఆమెకు పెద్ద షాకిచ్చారు. కవిత టీజీబీకే అధ్యక్ష హోదాలో ఉన్న సమయంలో ఆమె వెంట తిరిగిన వందలాది మంది కార్మిక నేతలు, బీఆర్ఎస్ నేతలు ఎవరూ కూడా కవిత పర్యటనవైపు కన్నెత్తి చూడని పరిస్థితి.
మర్యాదపూర్వంగానూ నేతలు మొహం చూపలేదు. కేవలం దాసరి ఉష మాత్రమే కాసేపు వచ్చి వెళ్లినట్లు తెలుస్తోంది. బీఆర్ఎస్ పార్టీ నేతలు, కార్యకర్తలు కవిత పర్యటనకు దూరంగా ఉన్నారు. కేవలం జాగృతి కార్యకర్తలతో కలిసి మాత్రమే జిల్లాలో ఎమ్మెల్సీ పర్యటించారు. దీన్ని బట్టి బీఆర్ఎస్ నుంచి కవిత బయటకు వెళితే ఆమె వెంట ఎవరూ వెళ్లరన్న సంకేతం వెలువడినట్లైంది.
అంతేకాకుండా మీడియాతో నిర్వహించిన చిట్చాట్లో పార్టీలో పరిణామాలు, తనకు జరిగిన అవమానాల గురించి చెప్పుకొచ్చారు కవిత. గత పదేళ్లుగా క్షోభను అనుభవిస్తున్నానని తెలిపారు. ఆ తరువాత మీడియా ముందుకు వచ్చిన సమయంలో బీఆర్ఎస్ పార్టీ ప్రస్తావన లేకుండానే ముగించేశారు. మీడియాతో ఆచితూచీ మాట్లాడారు ఎమ్మెల్సీ. కేవలం ఆపరేషన్ కగార్ గురించి మీడియాతో మాట్లాడుతూ... ఈ ఆపరేషన్ కగార్ను వెంటనే నిలిపివేయాలని డిమాండ్ చేశారు. ఆపరేషన్ కగార్ను తప్పు బట్టడంతో పాటు నంబాల కేశవరావు వంటి మావోయిస్టు నేతల మృతదేహాలను ఇవ్వకుండా బీజేపీ ప్రభుత్వం నిరంకుశంగా వ్యవహరిస్తోందని మండిపడ్డారు. అలాగే సరస్వతీ పుష్కరాల్లో స్థానిక ఎంపీ వంశీని అవమానించారని... దీంతో కాంగ్రెస్ పార్టీలో దళిత వ్యతిరేకత బయట పడిందన్నారు. తనను కూడా పుష్కరాలకు ఆహ్వానించలేదని.. అది వారి విజ్ఞతకే వదిలేస్తున్నట్లు తెలిపారు. దళితుడు కాబట్టే డిప్యూటీ సీఎంను యాదాద్రిలో కింద కూర్చొబెట్టారని పేర్కొన్నారు. కేవలం రెండు నిమిషాల్లోనే ఎమ్మెల్సీ కవిత తన మీడియా సమావేశాన్ని ముగించేశారు.
ఇవి కూడా చదవండి
కరీంనగర్ నుంచి కుట్రలు.. రాజాసింగ్ సంచలన ఆరోపణలు
అన్నింటినీ భరించుకుంటూ వచ్చా.. సిన్సియర్గా పనిచేశా.. అయినప్పటికీ
Read Latest Telangana News And Telugu News