Special Trains: 12 నుంచి చర్లపల్లి-శ్రీకాకుళం మధ్య 26 ప్రత్యేక రైళ్లు
ABN , Publish Date - May 09 , 2025 | 09:56 AM
ప్రస్తుత వేసవి సెలవుల రద్దీ నేపధ్యంలో ఈనెల 12వతేదీ నుంచి చర్లపల్లి-శ్రీకాకుళం మధ్య 26 ప్రత్యేక రైళ్లను నడుపుతున్నట్లు దక్షిణమధ్య రైల్వే ఒక ప్రకటనలో తెలిపింది. ఈ రైళ్లలో కొన్ని నల్గొండ, మిర్యాలగూడ, సత్తెనపల్లి, గుంటూరు, విజయవాడ మీదుగా, మరికొన్ని ఖాజీపేట్, వరంగల్, ఖమ్మం మీదుగా నడుస్తాయని రైల్వేశాఖ తెలిపింది.

హైదరాబాద్ సిటీ: వేసవి రద్దీ నేపథ్యంలో చర్లపల్లి-శ్రీకాకుళం(Cherlapalli-Srikakulam) స్టేషన్ల మధ్య ఈనెల 12 నుంచి 26 ప్రత్యేకరైళ్లను నడుపుతున్నట్లు దక్షిణమధ్య రైల్వే(South Central Railway) గురువారం ప్రకటించింది. వీటిలో 14 ప్రత్యేక రైళ్లు నల్గొండ, మిర్యాలగూడ, సత్తెనపల్లి, గుంటూరు, విజయవాడ(Nalgonda, Miryalaguda, Sattenapalli, Guntur, Vijayawada) మీదుగా, మరో 12రైళ్లు ఖాజీపేట్, వరంగల్, ఖమ్మం(Warangal, Khammam), రాయనపాడు మీదుగా నడుస్తాయని సీపీఆర్ఓ శ్రీధర్ తెలిపారు.
ఈ వార్తను కూడా చదవండి: Hyderabad: మిస్ వరల్డ్ పోటీల ‘వీక్షణ’ పాస్లకు అపూర్వ స్పందన
ఈనెల 12నుంచి జూన్ 23వరకు ప్రతి సోమవారం శ్రీకాకుళం నుంచి (07422) చర్లపల్లికి, 13నుంచి జూన్ 25వరకు ప్రత్యేకరైలు (07421) ప్రతి మంగళవారం చర్లపల్లి(Cherlapalli) నుంచి బయలుదేరుతాయని పేర్కొన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి
Breaking News: భారత్-పాక్ యుద్ధంపై చైనా తాజా రియాక్షన్ ఇదే..
ToDay Gold Rates: పసిడి ప్రియులకు షాక్.. మళ్లీ పెరిగిన బంగారం ధరలు..
మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్ మసూద్ అజర్ చనిపోయాడా ..?
Operation Sindoor: యుద్ధ బీభత్సం
Read Latest Telangana News and National News