IND vs SA 1st ODI: టాస్ గెలిచిన దక్షిణాఫ్రికా.. బ్యాటింగ్ ఎవరిదంటే..
ABN , Publish Date - Nov 30 , 2025 | 01:11 PM
రాంచి వేదికగా ఇవాళ(ఆదివారం) భారత్, దక్షిణాఫ్రికా మధ్య తొలి వన్డే జరగనుంది. ఈ నేపథ్యంలో టాస్ గెలిచిన సౌతాఫ్రికా బౌలింగ్ ఎంచుకుంది.
ఇంటర్నెట్ డెస్క్: రాంచి వేదికగా ఇవాళ(ఆదివారం) భారత్, దక్షిణాఫ్రికా మధ్య తొలి వన్డే జరగనుంది. ఈ నేపథ్యంలో టాస్ గెలిచిన సౌతాఫ్రికా బౌలింగ్ ఎంచుకుంది. రాంచి వేదికగా తాము తొలుత ఫీల్డింగ్ చేయనున్నట్లు ప్రొటీస్ జట్టు తాత్కాలిక కెప్టెన్ ఎడెన్ మార్క్రమ్ తెలిపాడు. పిచ్ పాతబడుతున్న కొద్ది బ్యాటింగ్కు అనుకూలిస్తుందని.. రాత్రివేళ మంచు ప్రభావం కూడా ఉంటుంది కాబట్టి తాము తొలుత బౌలింగ్ చేయాలనుకుంటున్నట్లు వెల్లడించాడు. ఈ మ్యాచ్ లో తాము ఒకే ఒక్క స్పిన్నర్తో బరిలోకి దిగుతున్నట్లు మార్క్రమ్ తెలిపాడు. సుబ్రాయేన్తో పాటు తాను కూడా పార్ట్టైమ్ బౌలింగ్ చేస్తానని పేర్కొన్నాడు. కెప్టెన్ తెంబా బవుమాతో పాటు కేశవ్ మహరాజ్కు విశ్రాంతినిచ్చామని వెల్లడించాడు.
మరోవైపు.. శుబ్మన్ గిల్ గైర్హాజరీలో భారత జట్టుకు కేఎల్ రాహుల్ సారథ్యం వహిస్తున్న సంగతి తెలిసిందే. రాహుల్ మాట్లాడుతూ.. టాస్ గెలిస్తే తాము కూడా తొలుత బౌలింగే చేసేవాళ్లమని పేర్కొన్నాడు. మధ్య ఓవర్లలో నిలబడటం కీలకమని, తాము మ్యాచ్కు పూర్తి స్థాయిలో రెడీ అయిట్లు తెలిపాడు. పటిష్ట జట్టుతో పోటీపడటం తమకు సవాలు లాంటిదని, అనుకూల ఫలితం రాబట్టేందుకు ప్రయత్నిస్తామన్నాడు. తమ తుదిజట్టులో ముగ్గురు స్పిన్నర్లకు చోటు ఇచ్చినట్లు కేఎల్ రాహుల్ ఈ సందర్భంగా తెలిపాడు.
తుది జట్లు:
దక్షిణాఫ్రికా (ప్లేయింగ్ XI): ర్యాన్ రికెల్టన్, క్వింటన్ డి కాక్ (w), ఎడెన్ మార్క్రమ్(c), మాథ్యూ బ్రీట్జ్కే, టోనీ డి జోర్జి, డెవాల్డ్ బ్రెవిస్, మార్కో జాన్సెన్, కార్బిన్ బాష్, ప్రెనెలన్ సుబ్రాయెన్, నాండ్రే బర్గర్, ఒట్నీల్ బార్ట్మన్
భారత్ (ప్లేయింగ్ XI): రోహిత్ శర్మ, యశస్వి జైస్వాల్, విరాట్ కోహ్లీ, రుతురాజ్ గైక్వాడ్, వాషింగ్టన్ సుందర్, KL రాహుల్ (w/c), రవీంద్ర జడేజా, హర్షిత్ రాణా, కుల్దీప్ యాదవ్, అర్ష్దీప్ సింగ్, ప్రసిద్ధ కృష్ణ
ఇవి కూడా చదవండి:
రో-కో జోడీ రాహుల్కి బలం: బవుమా
విరాట్కు కలిసొచ్చిన కేఎల్ కెప్టెన్సీ.. సెంచరీ రిపీట్ అవ్వనుందా?