Share News

England Cricket Victory: ఇంగ్లండ్‌ ఘనంగా..

ABN , Publish Date - May 31 , 2025 | 02:58 AM

ఇంగ్లండ్‌ వెస్టిండీస్‌తో జరిగిన తొలి వన్డేలో 238 పరుగుల భారీ తేడాతో విజయాన్ని సాధించింది. ఇంగ్లండ్‌ 400 పరుగులు చేసి, వెస్టిండీస్‌ను 162 పరుగులకే ఆలౌట్‌ చేసింది.

England Cricket Victory: ఇంగ్లండ్‌ ఘనంగా..

  • 238 రన్స్‌ తేడాతో విండీస్‌ చిత్తు

బర్మింగ్‌హామ్‌: వెస్టిండీస్‌తో జరిగిన తొలి వన్డేలో ఇంగ్లండ్‌ ఏకంగా 238 పరుగుల తేడాతో నెగ్గింది. తొలుత బ్యాటింగ్‌కు దిగిన ఇంగ్లండ్‌ 50 ఓవర్లలో 8 వికెట్లకు 400 పరుగుల భారీ స్కోరు సాధించింది. బెథెల్‌ (82), డకెట్‌ (60), బ్రూక్‌ (58), రూట్‌ (57) ఆకట్టుకున్నారు. అలాగే వన్డే చరిత్రలో తొలి ఏడుగురు బ్యాటర్లు 30+ స్కోర్లు సాధించడం విశేషం. ఛేదనలో విండీస్‌ 26.2 ఓవర్లలో 162 పరుగులకే కుప్పకూలింది. చివరి బ్యాటర్‌ సీల్స్‌ (29 నాటౌట్‌) టాప్‌ స్కోరర్‌గా నిలిచాడు. ఒవర్టన్‌, మహమూద్‌లకు మూడేసి, రషీద్‌ కు రెండు వికెట్లు దక్కాయి.

Updated Date - May 31 , 2025 | 03:00 AM