Shreyas Iyer: అయ్యర్ను వదలని శని.. ఇంతకంటే దారుణం ఉండదు!
ABN , Publish Date - Jun 13 , 2025 | 08:40 AM
స్టైలిష్ బ్యాటర్ శ్రేయస్ అయ్యర్కు మరో పరాభవం ఎదురైంది. ఐపీఎల్-2025 ట్రోఫీని తృటిలో చేజార్చుకున్న అయ్యర్.. ఈసారి మరో కప్పును మిస్ చేసుకున్నాడు. దీని గురించి మరింతగా తెలుసుకుందాం..

టీమిండియా స్టార్ బ్యాటర్ శ్రేయస్ అయ్యర్ మరో కప్పును మిస్ చేసుకున్నాడు. ఇటీవల అతడు కెప్టెన్గా వ్యవహరించిన పంజాబ్ కింగ్స్ జట్టు ఐపీఎల్-2025లో ఫైనల్స్ వరకు వచ్చి ట్రోఫీని చేజార్చుకుంది. రాయల్ చాలెంజర్స్ బెంగళూరు చేతుల్లో ఓడి రన్నరప్గా సరిపెట్టుకుంది. దీంతో నిరాశలో ఉన్న అయ్యర్ అభిమానులకు మరో షాక్ తగిలింది. అతడి సారథ్యంలో మరో జట్టు కప్పు మిస్ చేసుకుంది. టీ20 ముంబై-2025 టోర్నమెంట్లో శ్రేయస్ అయ్యర్ కెప్టెన్గా ఉన్న సోబో ముంబై ఫాల్కన్స్ జట్టు తుదిమెట్టుపై జారిపడింది. టైటిల్ ఫైట్లో ముంబై సౌత్ సెంట్రల్ మరాఠా రాయల్స్ చేతుల్లో 5 వికెట్ల తేడాతో ఓడింది అయ్యర్ సేన.
ఎందుకిలా జరుగుతోంది..?
ఫైనల్ పోరులో తొలుత బ్యాటింగ్కు దిగిన సోబో ఫాల్కన్ జట్టు 20 ఓవర్లలో 4 వికెట్లకు 157 పరుగులు చేసింది. మయురేష్ తండేల్ (50), హర్ష్ అఘవ్ (45) రాణించారు. కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ 17 బంతుల్లో 12 పరుగులు చేసి పెవిలియన్ చేరాడు. ఐపీఎల్ స్టార్ అంగ్క్రిష్ రఘువంశీ (7) కూడా విఫలమయ్యాడు. దీంతో భారీ టార్గెట్ సెట్ చేయడంలో సోబో ఫాల్కన్ ఫెయిలైంది. ఆ తర్వాత ఛేదనకు దిగిన మరాఠా రాయల్స్ జట్టు 19.2 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 158 పరుగులు చేసి విజయాన్ని అందుకుంది. అయ్యర్ సేన ఓటమిపై నెటిజన్స్ షాక్ అవుతున్నారు. శ్రేయస్కు శని పట్టుకున్నట్లు ఉంది.. ఇలా వరుసగా కప్పులు మిస్ అవడం ఏంటని ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. గౌతం గంభీర్ అండగా లేకపోతే అయ్యర్కు ట్రోఫీలు రావడం కష్టమని మరికొందరు కామెంట్స్ చేస్తున్నారు.
ఇవీ చదవండి:
వింబుల్డన్ ప్రైజ్మనీ రూ 625 కోట్లు
మరిన్ని క్రీడా వార్తల కోసం క్లిక్ చేయండి