Shreyas Iyer: ఫైనల్కు అయ్యర్ టీమ్.. ఈసారి కప్పు వదిలేలా లేడు!
ABN , Publish Date - Jun 11 , 2025 | 08:34 AM
స్టైలిష్ బ్యాటర్ శ్రేయస్ అయ్యర్ మరోమారు అదరగొట్టాడు. అతడి సారథ్యంలో ఇంకో జట్టు ఫైనల్స్కు చేరుకుంది. ఐపీఎల్ ట్రోఫీ మిస్ అయిన అయ్యర్.. ఈసారి మాత్రం కప్ వదలొద్దనే కసితో కనిపిస్తున్నాడు.

టీమిండియా స్టైలిష్ బ్యాటర్ శ్రేయస్ అయ్యర్ కెరీర్లో రయ్మంటూ దూసుకెళ్తున్నాడు. భారత జట్టు తరఫున వన్డేల్లో అదరగొడుతున్న అయ్యర్.. ఇతర ఫార్మాట్లలోనూ తన స్థానాన్ని పదిలం చేసుకోవాలని చూస్తున్నాడు. దేశవాళీ క్రికెట్లో సెంచరీల మీద సెంచరీలు బాదుతూ సెలెక్టర్ల తలుపులు గట్టిగా కొడుతున్నాడు. అదే సమయంలో ఐపీఎల్లో బ్యాటర్గా, కెప్టెన్గా రఫ్ఫాడిస్తూ మిగతా వారి కంటే తాను చాలా స్పెషల్ అని నిరూపిస్తున్నాడు. గతేడాది కోల్కతా నైట్ రైడర్స్కు కప్పు అందించిన అయ్యర్.. ఈసారి పంజాబ్ కింగ్స్ను ఫైనల్స్కు తీసుకెళ్లాడు. అయితే ట్రోఫీ మిస్ అవడంతో నిరాశలో కూరుకుపోయాడు. అయినా త్వరగానే తేరుకున్న శ్రేయస్.. తాజాగా మరో టోర్నమెంట్లో తన జట్టును ఫైనల్స్కు తీసుకెళ్లాడు. ఈసారి కప్పు వదలొద్దనే కసితో అతడు కనిపిస్తున్నాడు.
కప్పు కొట్టాల్సిందే..
శ్రేయస్ అయ్యర్ సారథ్యం వహిస్తున్న సోబో ఫాల్కన్స్ జట్టు ముంబై టీ20 లీగ్ ఫైనల్స్కు చేరుకుంది. నమో బాంద్రా బ్లాస్టర్స్తో జరిగిన సెమీఫైనల్ ఫైట్లో 5 వికెట్ల తేడాతో నెగ్గిన ఫాల్కన్స్ టీమ్ తుదిపోరుకు దూసుకెళ్లింది. ఫైనల్ ఫైట్లో ముంబై సెంట్రల్ మరాఠా రాయల్స్ను ఢీకొట్టనుంది అయ్యర్ సేన. ఐపీఎల్ ట్రోఫీ మిస్ అయింది కాబట్టి ఈ కప్పును నెగ్గితీరాలని శ్రేయస్ అభిమానులతో పాటు ఫాల్కన్ జట్టు ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. అయ్యర్ ఎంత మంచి కెప్టెన్ అనే దానికి ఇదో ఉదాహరణ అని అంటున్నారు. అతడిలో నాయకత్వ లక్షణాలు పుష్కలంగా ఉన్నాయని, టీమిండియాకూ అతడ్నే సారథిగా నియమించాలని సోషల్ మీడియాలో కొందరు నెటిజన్స్ డిమాండ్ చేస్తున్నారు. ఎంఎస్ ధోని, రోహిత్ శర్మలా గ్రేటెస్ట్ కెప్టెన్గా అతడు నిలిచిపోతాడని చెబుతున్నారు. అయ్యర్ను అన్ని ఫార్మాట్లలో రెగ్యులర్ ప్లేయర్ చేయడంతో పాటు టీ20 టీమ్కు కెప్టెన్ చేయాలని కామెంట్స్ చేస్తున్నారు.
ఇవీ చదవండి:
మరిన్ని క్రీడా వార్తల కోసం క్లిక్ చేయండి