Rohit-Pant: గార్డెన్లో రోహిత్ శర్మ.. పంత్ డైలాగ్ వింటే నవ్వాగదు!
ABN , Publish Date - Jun 06 , 2025 | 01:59 PM
టీమిండియా లండన్ ఫ్లైట్ ఎక్కేసింది. 5 టెస్టుల సిరీస్ కోసం భారత ఆటగాళ్లు ఇంగ్లండ్కు పయనమయ్యారు. ఎయిర్పోర్ట్లో మెన్ ఇన్ బ్లూ ప్లేయర్లు తెగ సందడి చేశారు.

రోహిత్ శర్మ అనగానే భారీ సిక్సులు, పకడ్బందీ వ్యూహాలు, ఓటమి ఒప్పుకోని తత్వం లాంటివే గుర్తుకొస్తాయి. బరిలోకి దిగితే బెబ్బులిలా ప్రత్యర్థులపై విరుచుకుపడతాడు హిట్మ్యాన్. బిగ్ షాట్స్తో వార్ వన్సైడ్ చేస్తాడు. తెలివైన సారథ్యంతో అపోజిషన్ టీమ్స్ నుంచి మ్యాచ్ను భారత్ వైపు మలుపుతాడు. అయితే గ్రౌండ్లో కాస్త గంభీరంగా కనిపించే రోహిత్.. బయట మాత్రం సరదాగా ఉంటాడు. సీనియర్లు, జూనియర్లు అనే తేడాల్లేకుండా టీమ్లోని ఆటగాళ్లందర్నీ కలుపుకొని పోతాడు. ఒక్కోసారి వాళ్ల మీద జోక్స్ వేస్తుంటాడు.. అదే సమయంలో కెప్టెన్ కాబట్టి అందరూ క్రమశిక్షణతో ఉండేలా చూసుకుంటాడు. అలాంటోడిపై తాజాగా రిషబ్ పంత్ జోక్ వేసి కడుపుబ్బా నవ్వించాడు. అసలేం జరిగిందంటే..
రోహిత్ ఎక్కడ..
ఇంగ్లండ్తో 5 టెస్టుల సిరీస్ కోసం టీమిండియా సన్నద్ధం అవుతోంది. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, రవిచంద్రన్ అశ్విన్ రిటైర్మెంట్ నేపథ్యంలో ప్రతిభ కలిగిన కొత్త కుర్రాళ్లతో ఈ సిరీస్లో ఆడేందుకు సిద్ధమవుతోంది. ఈ టూర్ కోసం తాజాగా లండన్ ఫ్లైట్ ఎక్కారు భారత ఆటగాళ్లు. విమానాశ్రయంలో టీమిండియా స్టార్లు సందడి చేశారు. ఈ తరుణంలో కొందరు అభిమానులు రోహిత్ శర్మ ఎక్కడ? అని పంత్ను అడిగారు. దీనికి అతడు.. గార్డెన్లో తిరగడానికి వెళ్లాడంటూ జోక్ చేశాడు. దీంతో అక్కడున్న వారంతా నవ్వుల్లో మునిగిపోయారు. రోహిత్ లేడు కదా.. గార్డెన్ గుర్తొస్తుందా అని అడిగారు ఫ్యాన్స్. ఎందుకు గుర్తురాదంటూ కాస్త ఎమోషనల్ అయ్యాడు పంత్. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. కాగా, అప్పట్లో ఓ టెస్ట్ మ్యాచ్ సమయంలో జట్టులోని కుర్రాళ్లు సీరియస్గా ఆడకపోవడంతో గార్డెన్లో తిరగడానికి వచ్చారా అంటూ రోహిత్ సీరియస్ అయ్యాడు. అలా ఆ డైలాగ్ బాగా ఫేమస్ అయింది. దాన్నే పంత్ ఇప్పుడు గుర్తుచేసి నవ్వించాడు.
ఇవీ చదవండి:
మరిన్ని క్రీడా, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి