RCB vs PBKS Sentiment: నో టెన్షన్.. కప్పు కొట్టేది ఆర్సీబీనే.. ఈ సెంటిమెంటే సాక్ష్యం!
ABN , Publish Date - Jun 03 , 2025 | 10:36 AM
ఐపీఎల్-2025లో నేడు ఆఖరాట జరగనుంది. ఆర్సీబీ-పంజాబ్ నడుమ మరికొన్ని గంటల్లో కప్ ఫైట్ జరగనుంది. ఇందులో ఎవరు గెలుస్తారా.. అని అంతా ఎదురు చూస్తున్నారు. అయితే ఓ సెంటిమెంట్ మాత్రం ఆర్సీబీకి అనుకూలంగా ఉంది.

రాయల్ చాలెంజర్స్ బెంగళూరు-పంజాబ్ కింగ్స్ మధ్య మంగళవారం సాయంత్రం కప్ ఫైట్ జరగనుంది. ఐపీఎల్-2025లో చాంపియన్గా నిలవాలని రెండు జట్లూ పట్టుదలతో ఉన్నాయి. క్యాష్ రిచ్ లీగ్ చరిత్రలో ఒక్కసారి కూడా టైటిల్ గెలుచుకోలేదీ టీమ్స్. దీంతో ఎవరు నెగ్గినా కొత్త చరిత్ర లిఖించినట్లవుతుంది. ఈ ఇరు జట్ల అభిమానులు 18 ఏళ్లుగా మొదటి కప్పు కోసం వేచిచూస్తున్నారు. వాళ్ల కోరిక నెరవేరే రోజు కావడంతో మ్యాచ్ కోసం ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. ఈ పోరుపై అనలిస్టులు, మాజీ క్రికెటర్లు ప్రిడిక్షన్స్ మొదలుపెట్టేశారు. ఫలానా టీమ్ గెలుస్తుందంటే ఫలానా జట్టుదే విజయమంటూ ఎవరికి తోచినట్లు వాళ్లు జోస్యం చెబుతున్నారు. ఈ నేపథ్యంలో ఇవాళ ఆర్సీబీదే గెలుపు అని ఆ జట్టు అభిమానులు అంటున్నారు. దీనికి ఓ సెంటిమెంట్ను సాక్ష్యంగా చూపిస్తున్నారు. అదేంటో ఇప్పుడు చూద్దాం..
సెంటిమెంట్ రిపీట్..
ఈసారి పాయింట్స్ టేబుల్లో పంజాబ్ కింగ్స్ అగ్రస్థానంలో నిలిచింది. ఆర్సీబీ రెండో స్థానాన్ని దక్కించుకుంది. దీంతో బెంగళూరుదే విజయమని అభిమానులు ధీమాగా చెబుతున్నారు. ఐపీఎల్ టోర్నమెంట్ చరిత్రను చూసుకుంటే.. పాయింట్స్ టేబుల్లో 2వ స్థానంలో నిలిచిన జట్టు.. 8 సార్లు ట్రోఫీని సొంతం చేసుకుంది. ఇది కోహ్లీ టీమ్లో జోష్ పెంచుతోంది. మరోవైపు 14 ఐపీఎల్ ఫైనల్స్లో క్వాలిఫయర్-1లో గెలిచిన జట్టు ఏకంగా 11 సార్లు చాంపియన్గా నిలిచింది. 2018 నుంచి 2024 వరకు వరుసగా క్వాలిఫయర్-1లో నెగ్గిన టీమే టైటిల్ విన్నర్గా నిలిచింది. ఈ సీజన్ క్వాలిఫయర్-1లో పంజాబ్పై ఆర్సీబీ గెలిచింది. అటు పాయింట్స్ టేబుల్లో రెండో స్థానంలో నిలిచింది. దీంతో ఈ సెంటిమెంట్ గనుక రిపీట్ అయితే ఇవాళ్టి పోరులో ఆర్సీబీదే విజయం అని సోషల్ మీడియాలో నెటిజన్స్ అంటున్నారు. సెంటిమెంట్ పరంగా పంజాబ్ కంటే ఆర్సీబీ ఆధిక్యంలో ఉందని.. బరిలోకి దిగి అదరగొడితే వాళ్లకు కప్పు ఖాయమని చెబుతున్నారు.
ఇవీ చదవండి:
మరిన్ని క్రీడా, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి