RCB vs PBKS Head To Head: ఆర్సీబీ-పంజాబ్ హెడ్ టు హెడ్ రికార్డ్స్.. ఫైనల్లో ఫేవరెట్స్ ఎవరు?
ABN , Publish Date - Jun 03 , 2025 | 11:52 AM
ఐపీఎల్-2025 ఫైనల్లో రెండు కొదమ సింహాలు బరిలోకి దిగి తాడోపేడో తేల్చుకోనున్నాయి. కప్పు కోసం జరిగే ఈ పోరులో ఎవరు గెలిచినా సరికొత్త విజేత ఆవిర్భవించడం ఖాయం. అందుకే అందరి ఫోకస్ ఈ మ్యాచ్ మీదే నెలకొంది.

ఐపీఎల్-2025 ఆఖరి దశకు చేరుకుంది. ఇప్పటికే ప్లేఆఫ్స్ కూడా ముగిశాయి. ఇవాళ జరిగే ఫైనల్స్తో క్యాష్ రిచ్ లీగ్ మరో సీజన్ పూర్తవుతుంది. అహ్మదాబాద్ వేదికగా ఇంకొన్ని గంటల్లో జరిగే ఫైనల్ ఫైట్లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు, పంజాబ్ కింగ్స్ తాడోపేడో తేల్చుకోనున్నాయి. సమవుజ్జీలుగా ఉన్న ఈ టీమ్స్ మధ్య రసవత్తర పోరు సాగడం ఖాయంగా కనిపిస్తోంది. ఇప్పటివరకు ఒక్క ఐపీఎల్ ట్రోఫీని కూడా కైవసం చేసుకోకపోవడంతో ఎట్టి పరిస్థితుల్లోనూ నెగ్గితీరాలని రెండు జట్లు పంతంతో ఉన్నాయి. కప్పు కోసం 17 ఏళ్లుగా చకోర పక్షిలా ఎదురు చూస్తున్నాయి. ఈసారైనా తమ కలను నెరవేర్చుకోవాలని అనుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో హెడ్ టు హెడ్ రికార్డులు ఎలా ఉన్నాయి.. ఇవాళ్టి పోరులో ఎవరి వైపు మొగ్గు ఎక్కువగా ఉంది అనేది ఇప్పుడు చూద్దాం..
కప్పు కొట్టేదెవరు..
క్యాష్ రిచ్ లీగ్లో ఇప్పటివరకు ఆర్సీబీ-పంజాబ్ కింగ్స్ 36 సార్లు తలపడ్డాయి. ఇందులో ఇరు జట్లు చెరో 18 మ్యాచుల్లో విజయాలు నమోదు చేశాయి. ఈ లెక్కన రెండు టీమ్స్ సమవుజ్జీలుగా ఉన్నాయి. ఈ సీజన్లో ఈ జట్లు మూడుసార్లు ఎదురుపడ్డాయి. ఇందులో ఆర్సీబీదే హవా నడిచింది. మూడుకు మూడు మ్యాచుల్లోనూ బెంగళూరే విజయం సాధించింది. ప్లేఆఫ్స్లో భాగంగా జరిగిన క్వాలిఫయర్-1లో పంజాబ్ను చిత్తు చేసింది కోహ్లీ టీమ్. గత మూడు సీజన్లుగా పంజాబ్పై తిరుగులేని రీతిలో ఆధిపత్యం చెలాయిస్తోంది ఆర్సీబీ.
ఫేవరెట్స్ ఎవరంటే..
ఫైనల్ మ్యాచ్కు ఆతిథ్యం ఇస్తున్న అహ్మదాబాద్లోని నరేంద్ర మోదీ స్టేడియం పంజాబ్ కింగ్స్కు బాగా కలిసొచ్చిందనే చెప్పాలి. ఇక్కడ ఆడిన 7 మ్యాచుల్లో ఐదింట విజయం సాధించిందా టీమ్. అదే ఆర్సీబీ 6 మ్యాచుల్లో మూడింట గెలిచింది. మొత్తంగా ఆర్సీబీ-పంజాబ్లో ఒక జట్టుది కంప్లీట్ డామినేషన్ అని చెప్పడానికి లేదు. కానీ ఈ సీజన్లో పంజాబ్ను మూడుసార్లు ఓడించింది బెంగళూరు. ఆ జట్టు బ్యాటింగ్తో పాటు బౌలింగ్ యూనిట్ బలంగా ఉంది. ప్రస్తుత ఫామ్ పరంగానూ తుదిపోరులో కోహ్లీ టీమ్ ఫేవరెట్ అని ఎక్స్పర్ట్స్ అంటున్నారు.
ఇవీ చదవండి:
మరిన్ని క్రీడా, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి