Share News

Vaibhav Suryavanshi: 500 మిస్డ్ కాల్స్.. 14 ఏళ్లకే ఇంత క్రేజా! ద్రవిడ్ ఏం అన్నాడంటే..

ABN , Publish Date - May 21 , 2025 | 05:14 PM

14 ఏళ్లకే ఫుల్ క్రేజ్ సంపాదించిన వైభవ్ సూర్యవంశీపై రాజస్థాన్ రాయల్స్ హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఇదేం క్రేజ్ అంటూ ది వాల్ షాక్ అయ్యాడు. అతడు ఇంకా ఏమన్నాడంటే..

Vaibhav Suryavanshi: 500 మిస్డ్ కాల్స్.. 14 ఏళ్లకే ఇంత క్రేజా! ద్రవిడ్ ఏం అన్నాడంటే..
Rajasthan Royals

14 ఏళ్లకే ఐపీఎల్ అరంగేట్రం, ఆడిన తొలి బంతికే సిక్స్, ఫస్ట్ సీజన్‌లోనే ఫాస్టెస్ట్ సెంచరీతో ఆల్‌టైమ్ రికార్డ్.. ఈ ఘనతలు విని మాట్లాడుతోంది రాజస్థాన్ రాయల్స్ యువ ఓపెనర్ వైభవ్ సూర్యవంశీ గురించి అని ఈపాటికే అర్థమై ఉంటుంది. అవును, ఒక్క సీజన్‌తోనే ఓవర్‌నైట్ స్టార్ అయిపోయాడు. తన తోటి పిల్లలు స్కూల్‌కు వెళ్లే వయసులో ప్యాట్ కమిన్స్, రవిచంద్రన్ అశ్విన్, కగిసో రబాడ లాంటి ఇంటర్నేషనల్ స్టార్ల బౌలింగ్‌ను ఎదుర్కొని పరుగుల వర్షం కురిపిస్తున్నాడు వైభవ్. ఆడిన మొదటి సీజన్‌లోనే 7 మ్యాచుల్లో 208 పరుగులతో రచ్చ రచ్చ చేస్తున్నాడు. భారత క్రికెట్ భవిష్యత్ తానేనని నిరూపిస్తున్న ఈ కుర్రాడి పాపులారిటీ, టాలెంట్‌కు రాజస్థాన్ హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్ ఫుల్ ఫిదా అయిపోయాడు. వైభవ్ గురించి ది వాల్ ఏమన్నాడంటే..


ప్లాన్ మార్చాలె..

వైభవ్ సూర్యవంశీలో ఎంతో ప్రతిభ దాగి ఉందన్నాడు ద్రవిడ్. రాత్రికి రాత్రే రిజల్ట్ రాదని, దేనికైనా ఏళ్ల పాటు పరిశ్రమించక తప్పదన్నాడు. అతడు వచ్చే సీజన్‌లో ఎలా ఆడతాడనేది కీలకమని చెప్పాడు. వైభవ్ ఇప్పటివరకు ఏం చేస్తూ వచ్చాడో అదే ఇక ముందూ కొనసాగించాలని సూచించాడు. అయితే అతడి కోసం బౌలర్లంతా సన్నద్ధమై వస్తారని, దీన్ని దృష్టిలో ఉంచుకొని వైభవ్ కూడా ప్లానింగ్‌తో లీగ్‌లోకి అడుగుపెట్టాలన్నాడు ద్రవిడ్. సాధనలో చెమట చిందించాలని, మ్యాచ్ మ్యాచ్‌కూ నైపుణ్యాలను మరింత పెంచుకుంటూ పోవాలని, కష్టాన్ని నమ్ముకోవాలని సూచించాడు.


ఫోకస్ దాని మీదే..

ఐపీఎల్ తాజా సీజన్‌లో రాణించడంపై వైభవ్ స్పందించాడు. 3 నుంచి 4 ఏళ్లుగా తాను పడుతున్న కష్టానికి ఇప్పుడు ప్రతిఫలం దక్కిందన్నాడు. న్యాచులర్ గేమ్ అనేది ఉండదని, జట్టు అవసరాలను బట్టి ఆడుతూ పోవాలన్నాడు. కాగా, ఈ సీజన్‌లో 38 బంతుల్లో సెంచరీతో విధ్వంసం సృష్టించాడు వైభవ్. దీంతో ఈ మ్యాచ్ తర్వాత తన మొబైల్‌కు ఏకంగా 500 మిస్డ్ కాల్స్ వచ్చాయని తెలిపాడు. 4 రోజుల పాటు ఫోన్ స్విచ్చాఫ్ చేసేశానన్నాడు. తనతో మాట్లాడేందుకు చాలా మంది ప్రయత్నించారని తెలిపాడు. కానీ తాను మాత్రం అవేవీ పట్టించుకోకుండా ఆట మీదే ఫోకస్ పెట్టానన్నాడీ రాజస్థాన్ ఓపెనర్.


ఇవీ చదవండి:

సాకులు చెబుతున్న ధోని

బీసీసీఐపై ఫ్రాంచైజీలు సీరియస్!

డోపింగ్‌లో పట్టుబడ్డ శివ్‌పాల్‌

మరిన్ని క్రీడా, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - May 21 , 2025 | 05:28 PM