Shreyas Iyer IPL 2025: గెలిచినా సంతోషంగా లేని అయ్యర్.. రీజన్ తెలిస్తే షాకే!
ABN , Publish Date - Jun 02 , 2025 | 02:42 PM
ఐపీఎల్-2025లో ఫైనల్కు దూసుకెళ్లింది పంజాబ్ కింగ్స్. కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ సింగిల్ హ్యాండ్తో టీమ్ను విజయతీరాలకు చేర్చాడు. అయినా అతడు సంతోషంగా లేడు.

పంజాబ్ కింగ్స్ సారథి శ్రేయస్ అనుకున్నది సాధించాడు. ఆ టీమ్ను ఐపీఎల్-2025 ఫైనల్స్కు తీసుకెళ్లాడు. 5 సార్లు చాంపియన్ ముంబై ఇండియన్స్ను మట్టికరిపించడంలో కీలక పాత్ర పోషించాడు. పంజాబ్ కెప్టెన్గా చార్జ్ తీసుకున్న తొలి సీజన్లోనే ఫైనల్కు చేర్చి అభిమానుల్లో సంతోషం నింపాడు. అయితే అతడు మాత్రం ఆనందంగా కనిపించడం లేదు. దీంతో అసలు అయ్యర్కు ఏమైంది.. అతడు ఎందుకు ఇలా చేస్తున్నాడని చాలా మంది అభిమానులు టెన్షన్ పడుతున్నారు. సెలబ్రేషన్స్ చేసుకోకపోవడానికి కారణం ఏంటో కనుక్కునే పనిలో పడ్డారు. మరి.. అయ్యర్ ఎందుకిలా వ్యవహరిస్తున్నాడో ఇప్పుడు చూద్దాం..
రీజన్ ఇదే..
ముంబైపై పంజాబ్ కింగ్స్ గెలవగానే ఆ జట్టు ఆటగాళ్లంతా స్టేడియంలోకి దూసుకొచ్చారు. ఒకర్నొకరు కౌగిలించుకున్నారు. ఈలలు వేస్తూ రచ్చ రచ్చ చేశారు. ట్రోఫీకి ఇంకా ఒక్క అడుగే దూరమంటూ అభిమానులకు సంజ్ఞలు చేశారు. అటు ఫ్యాన్స్ కూడా హిప్ హిప్ హుర్రే అంటూ సంబురాలు చేసుకున్నారు. అయితే పంజాబ్ సారథి అయ్యర్ మాత్రం సైలెంట్గా ఉండిపోయాడు. విన్నింగ్ షాట్ కొట్టాక సింపుల్గా హెల్మెట్ తీసి సహచర బ్యాటర్ స్టొయినిస్ను హగ్ చేసుకున్నాడు. ఎగరడం, దూకడం, అరవడం, పరిగెత్తడం లాంటివేమీ చేయలేదు. ఆ సమయంలో అతడి కళ్లలో ఇంకా ఏదో సాధించాలనే తపన, కసి కనిపించాయి. ఇది చూసిన నెటిజన్స్.. ట్రోఫీ కొట్టేదాకా విశ్రమించొద్దనే ఉద్దేశంతోనే అయ్యర్ అలా నిశ్శబ్దంగా ఉండిపోయాడని అంటున్నారు. కప్ గెలిచాకే అతడు సంబురాలు చేసుకుంటాడని చెబుతున్నారు. ఫైనల్ మ్యాచ్ నెగ్గే వరకు ఎదురు చూడండి.. అయ్యర్ సంబురాలు అంబరాన్ని అంటుతాయని కామెంట్స్ చేస్తున్నారు.
ఇవీ చదవండి:
చాహల్ గర్ల్ఫ్రెండ్ సెలబ్రేషన్స్ వైరల్
మరిన్ని క్రీడా, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి