PBKS vs RR: పంజాబ్-రాజస్థాన్ మ్యాచ్.. ఆర్మీపై అయ్యర్ కామెంట్స్! ఏమన్నాడంటే?
ABN , Publish Date - May 18 , 2025 | 03:57 PM
ఐపీఎల్-2025 ఎట్టకేలకు రీస్టార్ట్ అయింది. ఆర్సీబీ-కేకేఆర్ మ్యాచ్తో సీజన్ మళ్లీ ప్రారంభం అవుతుందని అనుకుంటే.. ఈ ఫైట్ వర్షార్పణం అయింది. అయితే ఇవాళ పంజాబ్ కింగ్స్-రాజస్థాన్ రాయల్స్ మ్యాచ్ మాత్రం ఎలాంటి ఆటంకాలు లేకుండా మొదలైంది.

పహల్గాం ఉగ్రదాడి దరిమిలా టెర్రరిస్టుల స్థావరాలపై భారత సైన్యం దాడి చేయడం, ప్రతిదాడి చేసిన పాకిస్థాన్కు మన ఆర్మీ మూడు చెరువుల నీళ్లు తాగించడం చూస్తున్నాం. మన దేశం పేరు చెబితే చాలు.. పాక్ వణికిపోయేలా చేశారు భారత సైనికులు. అందుకే వాళ్లకు హ్యాట్సాఫ్ చెబుతున్నాడు పంజాబ్ కింగ్స్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్. జవాన్ల వల్లే సేఫ్గా క్రికెట్ ఆడగలుగుతున్నామని అన్నాడు. భారత్-పాకిస్థాన్ ఉద్రిక్తతల వల్ల అర్ధాంతరంగా ఆగిపోయిన ఐపీఎల్-2025 శనివారం నాడు రీస్టార్ట్ అయింది. అయితే ఆర్సీబీ-కేకేఆర్ మ్యాచ్ వాన కారణంగా రద్దయింది. ఈ నేపథ్యంలో రెండో మ్యాచ్ జరుగుతుందా అని టెన్షన్ పడ్డారు ఫ్యాన్స్. కానీ పంజాబ్ కింగ్స్-రాజస్థాన్ రాయల్స్ మ్యాచ్ ఎలాంటి ఆటంకాలు లేకుండా మొదలైంది. ఈ నేపథ్యంలో టాస్ సమయంలో భారత ఆర్మీపై ప్రశంసల జల్లులు కురిపించాడు అయ్యర్. అతడు ఇంకా ఏమన్నాడో ఇప్పుడు చూద్దాం..
ఏమన్నాడంటే..
ఐపీఎల్ను మిస్ అయ్యానని, అయితే ఎట్టకేలకు అందరు ఆటగాళ్లు తిరిగొచ్చారని అన్నాడు అయ్యర్. సీజన్ తిరిగి మొదలవడం సంతోషంగా ఉందన్నాడు శ్రేయస్. కారణాలు చెప్పి టోర్నమెంట్కు డుమ్మా కొట్టకుండా అందరూ మళ్లీ రావడం ఆనందంగా ఉందన్నాడు పంజాబ్ సారథి. వచ్చిన అవకాశాల్ని రెండు చేతులా వినియోగించుకునేందుకు సిద్ధంగా ఉన్నామని వ్యాఖ్యానించాడు. మానసికంగా చాలా దృఢంగా ఉన్నామని పేర్కొన్నాడు అయ్యర్. దేశానికి సేవలు అందించిన త్రివిద దళాలకు అభినందనలు తెలియజేశాడు. భారత్ను సురక్షితంగా ఉంచినందుకు వారికి ధన్యవాదాలు తెలిపాడు. కాగా, సవాయ్ మాన్సింగ్ స్టేడియంలో జరుగుతున్న ఈ మ్యాచ్లో టాస్ నెగ్గిన పంజాబ్ తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. అయితే అయ్యర్ నిర్ణయం జట్టును దెబ్బతీసింది. ఆ టీమ్ ఆరంభంలో వరుసగా వికెట్లు కోల్పోయింది. ప్రస్తుతం 3.1 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 34 పరుగులతో ఉంది.
ఇవీ చదవండి:
కోహ్లీ ఆకలి బాధల గురించి తెలుసా?
భారతరత్న.. కోహ్లీ-రోహిత్ ఫ్యాన్స్ రచ్చ
మరిన్ని క్రీడా, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి