IND vs ENG: నితీష్ వర్సెస్ శార్దూల్.. ఎటూ తేల్చుకోలేకపోతున్న టీమిండియా!
ABN , Publish Date - Jun 16 , 2025 | 09:07 PM
ఇంగ్లండ్తో తొలి టెస్ట్ కోసం సన్నద్ధమవుతున్న టీమిండియాకు ఒక చిక్కు వచ్చి పడింది. ఓ స్థానం కోసం ఇద్దరు ఆటగాళ్ల మధ్య పోటీ నెలకొంది.

ఇంగ్లండ్తో 5 టెస్టుల సవాల్కు సన్నద్ధమవుతోంది టీమిండియా. పేస్, స్వింగ్కు అనుకూలించే అక్కడి కండీషన్స్ను తట్టుకొని గెలవడం కష్టమే. పైగా సీనియర్లు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, రవిచంద్రన్ అశ్విన్ జట్టుకు దూరమయ్యారు. ఈ పరిస్థితుల్లో ఉన్న ఆటగాళ్ల నుంచి బెస్ట్ పెర్ఫార్మెన్స్ను రాబట్టాలని గంభీర్ అండ్ కో చూస్తున్నారు. పటిష్టమైన లైనప్తో ఆతిథ్య జట్టును ఎదుర్కోవాలని భావిస్తున్నారు. అయితే ఒక స్థానం విషయంలో మాత్రం ఎటూ తేల్చుకోలేకపోతోందట టీమిండియా. పేస్ ఆల్రౌండర్ పొజిషన్ విషయంలో ఏం చేయాలో టీమ్ మేనేజ్మెంట్కు పాలుపోవడం లేదట. దీని గురించి ఇప్పుడు మరింతగా తెలుసుకుందాం..
ఎవర్ని ఆడిస్తారో..
తెలుగు తేజం నితీష్ కుమార్ రెడ్డి, సీనియర్ ఆల్రౌండర్ శార్దూల్ ఠాకూర్లో ఒక్కరికి మాత్రమే భారత తుదిజట్టులో చోటు దక్కనుందని తెలుస్తోంది. పేస్ ఆల్రౌండర్ పొజిషన్ కోసం వీళ్ల మధ్య తీవ్ర పోటీ నెలకొంది. నితీష్ బ్యాటింగ్ స్పెషలిస్ట్ అనేది తెలిసిందే. ఆస్ట్రేలియా టూర్లో సూపర్ సెంచరీతో మెరిశాడు. బౌలింగ్లోనూ అడపాదడపా వికెట్లు తీస్తూ వస్తున్నాడు. అటు శార్దూల్ నాణ్యమైన పేస్ బౌలింగ్తో బ్యాటర్లను వణికించగలడు. బ్యాటింగ్లోనూ అతడ్ని తీసిపారేయడానికి లేదు. పైగా ఇండియా ఏ-ఇండియా మధ్య జరిగిన ఇంట్రా స్క్వాడ్ మ్యాచ్లో శార్దూల్ సెంచరీతో చెలరేగాడు. దీంతో ఇద్దరిలో ఎవర్ని తీసుకోవాలో కోచ్ గంభీర్, కెప్టెన్ గిల్ తేల్చుకోలేకపోతున్నారట. పిచ్, కండీషన్స్ను బట్టి మ్యాచ్ రోజే వీళ్లలో ఎవర్ని ఆడించాలనేది డిసైడ్ అవుతారని తెలుస్తోంది. బ్యాటింగ్ ఆల్రౌండర్ కావాలనుకుంటే నితీష్, బౌలింగ్ ఆల్రౌండర్ కావాలనుకుంటే శార్దూల్ను ఎంచుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి.
ఇవీ చదవండి:
మరిన్ని క్రీడా వార్తల కోసం క్లిక్ చేయండి