T Natarajan IPL 2025: బంతికి 60 లక్షలు.. సన్రైజర్స్ హీరోను జీరో చేశారు.. ఇంతకంటే దారుణం లేదు!
ABN , Publish Date - May 27 , 2025 | 05:51 PM
సన్రైజర్స్ హీరోను జీరో చేసింది ఢిల్లీ క్యాపిటల్స్. వికెట్ల మీద వికెట్లు తీస్తూ ప్రత్యర్థులను భయపెట్టే బౌలర్ సేవల్ని వృథా చేసింది. కోట్లు పోసి కొనుక్కొని డ్రెస్సింగ్ రూమ్కే పరిమితం చేసింది.

టి నటరాజన్.. ఈ పేరు వింటే ఐపీఎల్లో తోపు బ్యాటర్లు కూడా భయపడతారు. కచ్చితమైన లైన్ అండ్ లెంగ్త్తో బంతులు వేస్తూ బ్యాటర్ల వెన్నులో వణుకు పుట్టిస్తుంటాడీ లెఫ్టార్మ్ పేసర్. పదునైన యార్కర్లు, భయపెట్టే బౌన్సర్లు, కన్ఫ్యూజ్ చేసే స్లో-డెలివరీస్తో బ్యాటర్లతో ఓ ఆటాడుకుంటాడు నటరాజన్. ఐపీఎల్లో ఇప్పటివరకు 63 మ్యాచుల్లో 67 వికెట్లు తీశాడీ స్టార్ పేసర్. సన్రైజర్స్ హైదరాబాద్ తరఫున అనేక మ్యాచుల్లో అదరగొట్టాడు. ఎస్ఆర్హెచ్ విజయాల్లో కీలక పాత్ర పోషించాడు. డెత్ ఓవర్స్ స్పెషలిస్ట్గా ముద్రపడిన నట్టూను ఎదుర్కొని పరుగులు చేయడం అంత ఈజీ కాదు. అలాంటోడి టాలెంట్ను ఢిల్లీ క్యాపిటల్స్ వృథా చేసింది. ఎస్ఆర్హెచ్ హీరోను జీరో చేసింది డీసీ. అసలేం జరిగిందో ఇప్పుడు చూద్దాం..
డగౌట్కే పరిమితం..
ఐపీఎల్-2025 మెగా ఆక్షన్కు ముందు నటరాజన్ను వదిలేసుకుంది సన్రైజర్స్. బ్యాటింగ్ను మరింత బలోపేతం చేసుకోవాలనే ఉద్దేశంతో భువనేశ్వర్ కుమార్తో పాటు నట్టూను రీటెయిన్ చేసుకోలేదు. దీంతో డీసీ జట్టు వేలంలో నటరాజన్ను సొంతం చేసుకుంది. గత సీజన్లలో అద్భుతంగా బౌలింగ్ చేయడంతో ఏకంగా రూ.10.75 కోట్ల భారీ ధర పెట్టి మరీ అతడ్ని దక్కించుకుంది. అక్కడి వరకు అంతా బాగానే ఉన్నా.. నటరాజన్ సేవల్ని మాత్రం సరిగ్గా వినియోగించుకోలేదు. ఐపీఎల్-2025లో కేవలం 2 మ్యాచుల్లోనే అతడ్ని ఆడించింది. ఈ సీజన్లో మొత్తంగా అతడు వేసింది 3 ఓవర్లే. అంటే రెమ్యూనరేషన్ నుంచి బంతికి 60 లక్షల చొప్పున 18 బంతులకు కలిపి దాదాపుగా రూ.10.75 కోట్లు నట్టూకు చెల్లించింది డీసీ. డబ్బుల సంగతి ఎలా ఉన్నా.. అతడి టాలెంట్ను వాడుకోకపోవడంపై విమర్శకులు పెదవి విరుస్తున్నారు. నటరాజన్కు బదులు ముఖేష్ కుమార్కు అవకాశం ఇచ్చారని.. అతడు పెద్దగా పెర్ఫార్మ్ చేయలేదని గుర్తుచేస్తున్నారు. తోపు బౌలర్ను టీమ్లో పెట్టుకొని డగౌట్కు పరిమితం చేయడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. నట్టూకు తుదిజట్టులో చాన్స్ ఇచ్చి ఉంటే డీసీ పరిస్థితి మరోలా ఉండేదని చెబుతున్నారు.
ఇవీ చదవండి:
మరిన్ని క్రీడా, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి