Share News

IND vs PAK: ఆ రోజునే ఇండో-పాక్ ఫైట్.. ఫ్యాన్స్‌కు పూనకాలే!

ABN , Publish Date - Jun 16 , 2025 | 02:15 PM

భారత్-పాకిస్థాన్ మధ్య ఆసక్తికర సమరం జరగనుంది. ఈ రెండు జట్లు బరిలోకి దిగి తాడోపేడో తేల్చుకోనున్నాయి. మరి.. ఇండో-పాక్ క్రికెట్ వార్ ఎప్పుడు జరగనుందో ఇప్పుడు చూద్దాం..

IND vs PAK: ఆ రోజునే ఇండో-పాక్ ఫైట్.. ఫ్యాన్స్‌కు పూనకాలే!
IND vs PAK Clash

భారత్-పాకిస్థాన్ నడుమ దాదాపుగా అన్ని సంబంధాలు తెగిపోయాయి. పహల్గాం దాడికి ప్రతీకారంగా ఇండియా ఆపరేషన్ సిందూర్ నిర్వహించడం, బదులుగా శత్రుదేశం కూడా దాడులకు తెగబడటం, వాటిని మన రక్షణ బలగాలు సమర్థంగా తిప్పికొట్టడం తెలిసిందే. ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు తగ్గినప్పటికీ సంబంధాల్లో మాత్రం ప్రతిష్టంభన కొనసాగుతోంది. క్రికెట్ కూడా ఇందుకు మినహాయింపేమీ కాదు. శత్రుదేశంతో క్రికెట్ రిలేషన్స్‌ను పూర్తిగా తెంచేసే దిశగా బీసీసీఐ సమాలోచనలు చేస్తోందని వినిపిస్తోంది. ఈ తరుణంలో భారత్-పాకిస్థాన్ వరల్డ్ కప్ వార్‌పై ఓ అప్‌డేట్ వచ్చింది. ఇరు జట్లు త్వరలో బరిలోకి దిగి తాడోపేడో తేల్చుకోనున్నాయని తెలుస్తోంది. మరి.. ఇండో-పాక్ క్రికెట్ వార్ ఏ రోజు జరగనుందో ఇప్పుడు చూద్దాం..


పాక్ మ్యాచులు అక్కడే..?

ఐసీసీ ఉమెన్స్ వన్డే వరల్డ్ కప్-2025లో భాగంగా భారత మహిళలు-పాకిస్థాన్ మహిళల నడుమ కీలక మ్యాచ్ జరగనుంది. అక్టోబర్ 5వ తేదీన జరిగే ఈ పోరుకు కొలంబోలోని ప్రేమదాస స్టేడియం ఆతిథ్యం ఇవ్వనుందని తెలుస్తోంది. పాకిస్థాన్ జట్టు ఆడే అన్ని మ్యాచులు ఈ మైదానంలోనే జరుగుతాయని సమాచారం. చాంపియన్స్ ట్రోఫీ-2025 టీమిండియా మ్యాచుల విషయంలో భారత క్రికెట్ బోర్డు, పాకిస్థాన్ క్రికెట్ బోర్డు మధ్య వివాదం తలెత్తిన నేపథ్యంలో ఇండో-పాక్ ఉమెన్స్ టీమ్స్ మ్యాచ్‌ను హైబ్రిడ్ మోడల్‌లో నిర్వహించనున్నారని వినిపిస్తోంది.

ind-vs-pak.jpg


ఆ కోపంతోనే..!

మహిళల ప్రపంచ కప్-2025కు భారత్ ఆతిథ్యం ఇస్తోంది. టోర్నీలో 28 మ్యాచులు జరగనున్నాయి. నవంబర్ 2న జరిగే ఫైనల్ మ్యాచ్‌తో మెగా టోర్నీ ముగుస్తుంది. బెంగళూరుతో పాటు గుహవాటి, విశాఖపట్నం మ్యాచులకు ఆతిథ్యం ఇవ్వనున్నాయి. అయితే చాంపియన్స్ ట్రోఫీ-2025కు భారత జట్టును తమ దేశానికి బీసీసీఐ పంపకపోవడంతో కోపంతో రగిలిపోతున్న పాకిస్థాన్.. ఉమెన్స్ వరల్డ్ కప్‌కు తమ టీమ్‌ను ఇండియాకు పంపేందుకు నిరాకరించినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఇండో-పాక్ మ్యాచ్‌ను కొలంబోలో నిర్వహించాలని ఐసీసీ నిర్ణయించిందని సమాచారం. పాక్ జట్టు గెలుపోటములను బట్టి సెమీస్, ఫైనల్స్‌ను భారత్‌లో నిర్వహించాలా? లేదా కొలంబోలో జరపాలా? అనేది తేల్చుతారట.


ఇవీ చదవండి:

ఆ జట్టు నిండా విషపు వ్యక్తులే: ఏబీడీ

నా కూతుర్ని పెళ్లి చేసుకోమని కోహ్లీని అడిగా

మరిన్ని క్రీడా వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Jun 16 , 2025 | 02:42 PM