IND vs ENG: ప్లేయింగ్ ఎలెవన్తో షాక్ ఇచ్చిన ఇంగ్లండ్.. ఇలా చేశారేంటి?
ABN , Publish Date - Jul 01 , 2025 | 10:17 AM
రెండో టెస్ట్ కోసం ప్లేయింగ్ ఎలెవన్ను ప్రకటించింది ఇంగ్లండ్. అయితే అనూహ్య రీతిలో ఒక ప్లేయర్ను పక్కనపెట్టేసింది. తుది జట్టు ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం..

లీడ్స్ టెస్ట్లో విజయంతో ఫుల్ ఖుషీగా ఉంది ఇంగ్లండ్. టీమిండియాను 5 వికెట్ల తేడాతో ఓడించడంతో స్టోక్స్ సేన కాన్ఫిడెన్స్ మరింత పెరిగింది. ఇదే జోరులో ఎడ్జ్బాస్టన్ వేదికగా జరిగే రెండో టెస్ట్లో కూడా గెలుపుబావుటా ఎగురవేయాలని చూస్తోంది ఆతిథ్య జట్టు. ఈ క్రమంలోనే ప్లేయింగ్ ఎలెవన్ను కూడా ప్రకటించింది. అయితే అనూహ్యంగా ఓ స్టార్ పేసర్ను పక్కనబెట్టేసింది. అతడ్ని తీసుకుంటారంటూ బాగా ప్రచారం జరిగినా తుది జట్టులో మాత్రం అవకాశం కల్పించలేదు. అతడు ఎవరనేది ఇప్పుడు చూద్దాం..
ఎందుకు తీసుకోలేదు?
తొలి టెస్టులో ఆడిన జట్టునే ఎడ్జ్బాస్టన్ టెస్ట్కూ యథావిధిగా కొనసాగించింది ఇంగ్లండ్. ఓపెనర్లుగా జాక్ క్రాలే, బెన్ డకెట్ బరిలోకి దిగుతారు. ఆ తర్వాత ఓలీ పోప్, జో రూట్ ఆడతారు. హ్యారీ బ్రూక్, బెన్ స్టోక్స్, జేమీ స్మిత్ మిడిలార్డర్ బాధ్యతలు పంచుకుంటారు. క్రిస్ వోక్స్, బ్రైడన్ కార్స్, జోష్ టంగ్ పేస్ బాధ్యతలు తీసుకుంటారు. స్పెషలిస్ట్ స్పిన్నర్గా షోయబ్ బషీర్ బరిలోకి దిగుతాడు. అయితే అంతా బాగానే ఉన్నా పేస్ సెన్సేషన్ జోఫ్రా ఆర్చర్ను తుది జట్టులోకి తీసుకోకపోవడం చర్చనీయాంశంగా మారింది. కౌంటీల్లో అదరగొట్టిన ఆర్చర్.. ఫామ్, ఫిట్నెస్ రెండూ నిరూపించుకున్నాడు. దీంతో అతడ్ని స్క్వాడ్లోకి తీసుకున్నారు. కానీ ఈ మ్యాచ్ ప్లేయింగ్ ఎలెవన్లో మాత్రం అవకాశం కల్పించలేదు. ఆర్చర్ విషయంలో మరికొంత కాలం వేచి ఉండాలని, పూర్తి ఫిట్నెస్ సాధించాకే ఆడించాలనే ఆలోచనల్లో ఇంగ్లండ్ టీమ్ మేనేజ్మెంట్ ఉన్నట్లు తెలుస్తోంది.
ఇవీ చదవండి:
ట్రేడ్మార్క్గా కెప్టెన్ కూల్
మరిన్ని క్రీడా వార్తల కోసం క్లిక్ చేయండి