Share News

BCCI-IPL 2025: బీసీసీఐని ముంచేసిన రోబో.. కోట్లలో లాస్..

ABN , Publish Date - May 01 , 2025 | 03:02 PM

Delhi High Court: ఒక రోబో కారణంగా చిక్కుల్లో పడింది భారత క్రికెట్ బోర్డు. ఏకంగా కోట్లలో నష్టం వాటిల్లే పరిస్థితిని తెచ్చుకొంది. అసలు.. బోర్డు చేసిన తప్పేంటి.. అనేది ఇప్పుడు చూద్దాం..

BCCI-IPL 2025: బీసీసీఐని ముంచేసిన రోబో.. కోట్లలో లాస్..
IPL 2025

ప్రపంచ క్రికెట్‌లో అత్యంత శక్తిమంతమైన బోర్డుగా బీసీసీఐ హవా నడిపిస్తోంది. ఐసీసీలోనూ తాము ఏం చెబితే అదే ఫైనల్ అనే రేంజ్‌లో పెత్తనం చలాయిస్తోంది భారత బోర్డు. అలాంటి బోర్డు జోలికి రావడానికి అంతా భయపడతారు. అలాంటిది ఇప్పుడో రోబో కారణంగా చిక్కుల్లో పడింది బీసీసీఐ. దీని వల్ల బోర్డు ఖజానాకు కోట్లలో నష్టం వాటిల్లే ప్రమాదం కనిపిస్తోంది. అసలు ఏంటా రోబో.. దాని విషయంలో బీసీసీఐ చేసిన తప్పేంటి.. కోర్టు కేసుల వరకు ఎందుకు దారితీసింది.. అనేది ఇప్పుడు చూద్దాం..


పేరు తెచ్చిన తంటా..

ప్రతి ఐపీఎల్ సీజన్‌లో ఏదో ఒక కొత్త టెక్నాలజీని ఇంట్రడ్యూస్ చేస్తూ ఉంటుంది బీసీసీఐ. కెమెరాల దగ్గర నుంచి అంపైరింగ్ డెసిషన్స్ దాకా దాదాపుగా ప్రతి విషయంలో నయా ఇన్నోవేషన్స్‌ను ఎంకరేజ్ చేస్తూ వస్తోంది. ఈ క్రమంలోనే ఈసారి క్యాష్ రిచ్ లీగ్‌లో చంపక్ అనే రోబోటిక్ డాగ్‌ను తీసుకొచ్చారు. కెమెరాలతో నిండిన ఈ రోబో గ్రౌండ్‌లోని చాలా విషయాలను కవర్ చేస్తూ అందర్నీ ఎంటర్‌టైన్ చేస్తోంది. ప్లేయర్ల ఆటతీరును దగ్గర నుంచి మానిటర్ చేస్తోంది. నెట్టింట పాపులర్ అయిన ఈ రోబోకు చంపక్ అనే పేరు పెట్టింది బీసీసీఐ. ఇదే ఇప్పుడు బోర్డును చిక్కుల్లో పడేసింది. ఈ పేరు వల్ల చట్టపరమైన సమస్యల్ని ఎదుర్కొంటోంది బీసీసీఐ. పరువునష్టం కింద రూ.2 కోట్లను చెల్లించాలంటూ బోర్డుపై ఓ ప్రసిద్ధ పిల్లల పత్రిక కేసు వేసింది.


తీర్పు అప్పుడే..

చంపక్ పేరుతో ఓ పాపులర్ చిల్డ్రన్ మ్యాగజీన్ ఉంది. ఇదే సంస్థ ఇప్పుడు ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించింది. రోబో డాగ్‌కు చంపక్ అని నామకరణం చేయడం ద్వారా రిజిస్టర్డ్ ట్రేడ్‌మార్క్‌ను బీసీసీఐ ఉల్లంఘించిందని ఆ పత్రిక ఆరోపించింది. దీనిపై ఢిల్లీ కోర్డును ఆశ్రయించగా.. ఈ విషయంలో బోర్డుకు నోటీసులు జారీ చేసింది. దీని మీద 4 రోజుల్లో లిఖితపూర్వకంగా సమాధానం ఇవ్వాలని కోర్టు ఆదేశించింది. ఈ కేసుపై జులై 9వ తేదీన కోర్టు విచారణ జరపనుంది. కాగా, రోబో డాగ్‌కు చంపక్‌ అని నామకరణం చేయడం వల్ల తమ ట్రేడ్‌మార్క్‌, బ్రాండ్‌ దెబ్బతిందని.. పరువునష్టం కింద తమకు బీసీసీఐ రూ.2 కోట్లు చెల్లించాలని కోర్టును కోరిందా మ్యాగజీన్. ఒకవేళ బోర్డు చేసింది నేరం అని రుజువైతే పరిహారం చెల్లించక తప్పదు. ఈ కేసులో కోర్టు తీర్పు కోసం జులై 9 వరకు ఎదురుచూడక తప్పదు.


ఇవీ చదవండి:

ధోనీని ఎందుకు ఆపారు..

ముంబైకి గట్టి షాక్

హెచ్‌సీఏకు ఊరట

మరిన్ని క్రీడా, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - May 01 , 2025 | 03:15 PM