Viral Video: రెస్టారెంట్లో లేట్ సర్వీస్..హోటల్ ధ్వంసం చేసిన కస్టమర్లు
ABN , Publish Date - Jun 09 , 2025 | 09:45 AM
రెస్టారెంట్లో లేట్ సర్వీస్ చేశారని, ఆహారం ఆలస్యంగా తెచ్చారని పలువురు యువకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ క్రమంలో హోటల్లోని కుర్చీలు విరగగొట్టి నానా హంగామా సృష్టించారు. అందుకు సంబంధించిన వీడియో (Viral Video) ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది.

సాధారణంగా ఎక్కడైనా రెస్టారెంట్ లేదా హోటల్ వెళ్లినప్పుడు ఫుడ్ ఆర్డర్ ఇచ్చి వచ్చే వరకు వెయిట్ చేస్తాం. ఒక వేళ ఆలస్యం అయితే ఇంకా ఎంత టైం పడుతుందని ఆరా తీస్తాం. కానీ ఇక్కడ మాత్రం పలువురు యువకులు ఫుడ్ సర్వీస్ లేట్ పట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతటితో ఆగలేదు. హోటల్లోని కుర్చీలను విరగగొట్టారు. కర్రలతో టేబుల్స్ ధ్వంసం చేసి రచ్చ రచ్చ చేశారు. అందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ (Viral Video) అవుతోంది. ఈ ఘటన శనివారం రాత్రి ఉత్తరప్రదేశ్ ఘజియాబాద్ (Ghaziabad restaurant incident) రాజ్నగర్ ఎక్స్టెన్షన్లోని ఓ రెస్టారెంట్లో జరిగింది.
సర్వీస్ గురించి ఫిర్యాదులు
ఈ గొడవ ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. ఆహారం ఆలస్యమైనంత మాత్రాన ఇంత పెద్ద గొడవ చేయడం సరికాదని స్థానికులు అంటున్నారు. రెస్టారెంట్ సిబ్బంది కూడా ఈ ఘటనతో భయపడ్డారు. వారు ఎప్పటిలాగే తమ పని చేస్తుండగా, ఈ యువకులు హఠాత్తుగా గొడవకు దిగారని చెబుతున్నారు. మరికొందరు మాత్రం రెస్టారెంట్ సర్వీస్ గురించి ఫిర్యాదులు చేస్తున్నారు. అయితే ఆలస్యమైన సర్వీస్ను సమర్థించడానికి హింస పరిష్కారం కాదని పలువురు అభిప్రాయపడుతున్నారు.
రంగంలోకి పోలీసులు
స్థానిక పోలీసులు ఈ ఘటనపై వెంటనే స్పందించారు. వారు రెస్టారెంట్కు చేరుకుని, గొడవ చేసిన యువకులను అదుపులోకి తీసుకున్నారు. నలుగురు యువకులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటున్నారు. ఈ ఘటన వల్ల రెస్టారెంట్కు ఆర్థిక నష్టం జరిగింది. ధ్వంసమైన కుర్చీలు, టేబుల్స్, ఇతర సామాన్లను మార్చడానికి హోటల్ యాజమాన్యం ఖర్చు చేయనుంది.
మీరైతే ఏం చేస్తారు..
అయితే హోటల్ వెళ్లినప్పుడు ఆలస్యం అనేది సాధారణమని పలువురు అంటున్నారు. దీనికి శాంతియుతంగా మాట్లాడి పరిష్కరించుకోవాలి. కానీ హింసకు పాల్పడితే, అది మరింత సమస్యలకు దారితీస్తుందని చెబుతున్నారు. ఈ ఘటనలో విద్యార్థులపై తీవ్రమైన కేసులు నమోదైతే మాత్రం వారి భవిష్యత్తుపై ప్రభావం పడే ఛాన్సుంది. మరోవైపు రెస్టారెంట్ యాజమాన్యం కూడా తమ సర్వీస్ను మెరుగుపరిచేందుకు చర్యలు తీసుకోవాలి. తద్వారా ఇలాంటి సంఘటనలు మళ్లీ జరగకుండా ఉంటాయి. దీని గురించి మీరు ఏమనుకుంటున్నారు? ఆహారం ఆలస్యమైతే మీరు ఎలా స్పందిస్తారు? శాంతియుతంగా సమస్యను పరిష్కరించడం మంచిది కాదా? మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.
ఇవీ చదవండి:
ప్రధానిని పలకరించిన యూనస్..బంగ్లాదేశ్ నుంచి మోదీకి సందేశం
ఐఎండీ అలర్ట్.. జూన్ 14 వరకూ ఈ రాష్ట్రాల్లో భారీ వర్షాలు..
మరిన్ని బిజినెస్, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..