PM Surya Ghar Yojana: ఇంట్లో కరెంట్తో డబ్బులే డబ్బులు.. ఈ క్రేజీ స్కీమ్ గురించి తెలుసా
ABN , Publish Date - Jan 24 , 2025 | 03:05 PM
PM Surya Ghar Yojana Muft Bill: నెల పూర్తయ్యే సరికి అందరికీ కరెంట్ బిల్లు టెన్షన్ పట్టుకుంటుంది. ఈ సారి బిల్లు ఎంత వస్తుందోననే గుబులు చాలా మందిలో ఉంటుంది. అయితే బిల్లు గురించి టెన్షన్ పడకుండా, ఇంట్లో కరెంట్తో డబ్బులు సంపాదించే చాన్స్ ఉంది. దాని గురించి మీకు తెలుసా?

కరెంట్ బిల్లు గురించి సామాన్య ప్రజానీకం ఎప్పుడూ టెన్షన్ పడుతూనే ఉంటారు. ఈ నెల ఎంత బిల్లు కట్టాల్సి వస్తుందోనని భయపడుతూ ఉంటారు. చలికాలం, వానకాలం ఫర్వాలేదు గానీ ఎండాకాలంలో భారీ వాడకం వల్ల బిల్లు కూడా తడిసి మోపెడవుతూ ఉంటుంది. ఎండల బారి నుంచి ఉపశమనం కోసం ఫ్యాన్లతో పాటు ఏసీ వినియోగంతో బిల్లు మోత మోగిస్తూ ఉంటుంది. అయితే ఇక మీదట విద్యుత్ బిల్లు గురించి ఆందోళన చెందాల్సిన పని లేదు. ఇంట్లో కరెంట్తో డబ్బులు సంపాదించుకునే అవకాశం ఇస్తోంది కేంద్ర ప్రభుత్వం. ఇంట్లో వాడే కరెంట్ను ప్రభుత్వానికి అమ్మి డబ్బులు సంపాదించే చాన్స్ ఇస్తోంది. అందుకోసం ఓ క్రేజీ స్కీమ్ను అందుబాటులోకి తీసుకొచ్చింది. అదేంటో ఇప్పుడు చూద్దాం..
ఏంటా స్కీమ్?
గత లోక్సభ ఎన్నికల సమయంలో ప్రధాని నరేంద్ర మోడీ ఉచిత విద్యుత్ పథకాన్ని ప్రకటించిన సంగతి తెలిసిందే. కొన్ని నెలల కింద అమల్లోకి వచ్చిన ఆ స్కీమ్ పేరు పీఎం సూర్య ఘర్ యోజన. దీని కింద సోలార్ ప్యానెల్స్, రూఫ్స్ ఇన్స్టాలేషన్ కోసం సబ్సిడీ ఇస్తోంది కేంద్రం. ఈ స్కీమ్ కింద సోలార్ ప్యానెల్స్ను తమ ఇళ్ల మీద అమర్చుకున్న వారికి ప్రతి నెలా 300 యూనిట్ల విద్యుత్ ఉచితంగా ఇస్తోంది సర్కారు. అయితే ఈ కరెంట్ను కేవలం ఇంటికే వాడుకోవాల్సిన అవసరం లేదు. ఇంట్లో వినియోగం పోనూ మిగిలిని విద్యుత్ను తిరిగి ప్రభుత్వానికి అమ్మేసి డబ్బులు కూడా సంపాదించుకోవచ్చు. అది ఎలాగనేది ఇప్పుడు తెలుసుకుందాం..
ఏ ప్యానెల్ తీసుకోవాలి?
ప్రతి నెలా మీ ఇంట్లో ఎంత విద్యుత్ వాడుతున్నారనేది తెలుసుకోవాలి. దాన్ని బట్టి సోలార్ ప్యానెల్ను ఇన్స్టాల్ చేసుకోవాలి. ఒకవేళ మీరు గనుక 150 యూనిట్ల వరకు విద్యుత్ వాడుతున్నట్లయితే 1 కిలోవాట్ సోలార్ ప్యానెల్ను అమర్చాలి. ఒకవేళ 200 నుంచి 250 యూనిట్ల వరకు కరెంట్ వినియోగిస్తున్నట్లయితే 2 కిలోవాట్స్ ప్యానెల్ తీసుకోవాలి. విద్యుత్ వాడకం 300 యూనిట్లు లేదా అంతకుమించి ఉంటే 3 కిలోవాట్స్ ప్యానెల్ అమర్చాలి. ఈ స్కీమ్ కింద ప్రతి ప్యానెల్ ధరను బట్టి కేంద్ర ప్రభుత్వం నుంచి సబ్సిడీ లభిస్తుంది.
ఎలా అమ్మాలి?
సోలార్ ప్యానెల్స్ నుంచి వచ్చే విద్యుత్తో డబ్బులు సంపాదించాలని భావిస్తున్నట్లయితే ఒక పని చేయాలి. ఒకవేళ మీ ఇంట్లో నెలవారీ విద్యుత్ వాడకం 200 యూనిట్లు ఉందనుకుందాం. అందుకు తగ్గట్లు మీరు 2 కిలోవాట్స్ సోలార్ ప్యానెల్ అమర్చారు. అది 250 యూనిట్ల వరకు విద్యుత్ను ఉత్పత్తి చేస్తే.. మీ ప్యానెల్లో ఇంకా 50 యూనిట్ల కరెంట్ మిగిలిపోయినట్లే. మీ వాడకం పోనూ మిగిలిన ఈ ఎలక్ట్రిసిటీని ప్రభుత్వానికి అమ్మేయొచ్చు. ఏడాది మొత్తం మీ ఇంటి వాడకం పోనూ సోలార్ ప్యానెల్లో మిగిలిపోయిన విద్యుత్ను ప్రభుత్వం తీసుకుంటుంది. ఎన్ని యూనిట్లు అమ్మారో అంత డబ్బును నేరుగా మీ అకౌంట్లో వేసేస్తుంది. పీఎం సూర్య ఘర్ యోజన ద్వారా ఏడాదికి సుమారుగా రూ.15 నుంచి రూ.18 వేల వరకు సంపాదించుకోవచ్చని ఎక్స్పర్ట్స్ అంటున్నారు.
ఇదీ చదవండి:
మనుషుల్ని మించిపోయిందిగా.. ఈ రాకూన్ కుక్క తెలివి చూస్తే.. కళ్లు తేలేస్తారు..
రైలు కిటికీలోంచి చోరీ చేయాలని చూశాడు.. చివరకు జరిగింది చూసి ఖంగుతిన్నాడు..
కూతురు గదిలోకి యువకుడిని పంపించిన తల్లి.. దీని వెనుక ఆమె ప్లానింగ్ తెలుసుకుని అంతా షాక్..
మరిన్ని ప్రత్యేక, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి