Mallu Bhatti Vikramarka: కర్నూలు జిల్లాలో గ్రీన్ కో ఇంటిగ్రేటెడ్ పవర్ ప్రాజెక్టును సందర్శించిన మల్లు భట్టి విక్రమార్క
ABN, Publish Date - Jun 08 , 2025 | 08:58 AM
కర్నూలు జిల్లాలో తెలంగాణ డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క శనివారం పర్యటించారు. జిల్లాలోని ఓర్వకల్లు మండలం పిన్నాపురం గ్రామంలోని గ్రీన్ కో ఇంటిగ్రేటెడ్ పవర్ ప్రాజెక్టును సందర్శించారు. ఈ సందర్భంగా మీడియాతో భట్టి విక్రమార్క మాట్లాడారు. 2030 నాటికి తెలంగాణ రాష్ట్రంలో 20,000 మెగావాట్ల గ్రీన్ ఎనర్జీ ఉత్పత్తి లక్ష్యమని మల్లు భట్టి విక్రమార్క ఉద్ఘాటించారు.

కర్నూలు జిల్లాలో తెలంగాణ డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క శనివారం పర్యటించారు. జిల్లాలోని ఓర్వకల్లు మండలం పిన్నాపురం గ్రామంలోని గ్రీన్ కో ఇంటిగ్రేటెడ్ పవర్ ప్రాజెక్టును సందర్శించారు.

ఈ సందర్భంగా మీడియాతో భట్టి విక్రమార్క మాట్లాడారు. 2030 నాటికి తెలంగాణ రాష్ట్రంలో 20,000 మెగావాట్ల గ్రీన్ ఎనర్జీ ఉత్పత్తి లక్ష్యమని ఉద్ఘాటించారు.

ఒక్క ప్రదేశంలోనే 6,680 మెగావాట్లు గ్రీన్ ఎనర్జీ ఉత్పత్తి చేస్తున్న ఈ ప్రాజెక్ట్ అభినందనీయమని అన్నారు. తెలంగాణ రాష్ట్రం గ్రీన్ ఎనర్జీని ప్రాధాన్యతా రంగంగా గుర్తించి, 2025 న్యూ ఎనర్జీ పాలసీ అమల్లోకి తీసుకువచ్చిందని మల్లు భట్టి విక్రమార్క గుర్తుచేశారు.

విద్యుత్ డిమాండ్ రోజు రోజుకూ పెరుగుతోందని మల్లు భట్టి విక్రమార్క తెలిపారు. అందుకు అనుగుణంగా ఉత్పత్తిని పెంచాల్సిన అవసరం ఉందని చెప్పారు. తెలంగాణ రాష్ట్రం ఇప్పటికే లక్ష కోట్ల విలువైన ఎంవోయూలను గ్రీన్ ఎనర్జీ కోసం చేసిందని స్పష్టం చేశారు.

బొగ్గు ఆధారిత విద్యుత్తు వల్ల కలిగే కాలుష్యాన్ని తగ్గించేందుకు సోలార్, విండ్, ఫ్లోటింగ్ సోలార్, హైడ్రోజన్ వంటి మార్గాల్లో విద్యుత్తు ఉత్పత్తి చేస్తున్నామని అన్నారు. విద్యుత్ సరఫరా పెరిగితే ఉత్పత్తి పెరుగుతుందని..ఉపాధి పెరుగుతుంది, జీడీపీ పెరుగుతుందని మల్లు భట్టి విక్రమార్క తెలిపారు.

భవిష్యత్తు అంతా గ్రీన్ పవర్దేనని చెప్పారు. తెలంగాణ రాష్ట్రం దానిని ముందుగానే అర్థం చేసుకుని గ్రీన్ ఎనర్జీలో దేశానికి మార్గదర్శిగా నిలవబోతుందని మల్లు భట్టి విక్రమార్క పేర్కొన్నారు.
Updated at - Jun 08 , 2025 | 09:05 AM