Minister Ponguleti: ఖమ్మం జిల్లాలో మంత్రి పొంగులేటి పర్యటన
ABN, Publish Date - May 12 , 2025 | 08:13 AM
ఖమ్మం జిల్లాలో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆదివారం పర్యటించారు. పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. నేలకొండపల్లి మండలం శంకరగిరి తండాలో జరిగిన శ్రీ సీతారామ, లక్ష్మణ ఆంజనేయ స్వామి శిఖర, ధ్వజస్తంభ ప్రతిష్టాపన మహోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి పొంగులేటిని బ్రాహ్మణులు ఆశీర్వదించి తీర్థప్రసాదాలు అందజేశారు. శ్రీ సీతారామ లక్ష్మణ, ఆంజనేయ, స్వామి వారి ఆశీస్సులతో ప్రజలందరూ సుఖ సంతోషాలతో, సుభిక్షంగా ఉండాలని, ఉన్నత శిఖరాలు చేరుకోవాలన్నదే తన ఆకాంక్ష అని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు.

ఖమ్మం జిల్లాలో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆదివారం పర్యటించారు. పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు.

నేలకొండపల్లి మండలం శంకరగిరి తండాలో జరిగిన శ్రీ సీతారామ, లక్ష్మణ ఆంజనేయ స్వామి శిఖర, ధ్వజస్తంభ ప్రతిష్టాపన మహోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి హాజరయ్యారు.

ఈ కార్యక్రమంలో భక్తులు భారీగా పాల్గొన్నారు. మంత్రి వెంట కాంగ్రెస్ ముఖ్య నేతలు, కార్యకర్తలు ఉన్నారు.

ధ్వజస్తంభ ప్రతిష్టాపన మహోత్సవ కార్యక్రమంలో కొబ్బరికాయ కొడుతున్న మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి

ప్రజలకు అభివాదం చేస్తున్న మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి

చిన్నారితో మాట్లాడుతున్న మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి

ఆలయంలో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డిని ఆశీర్వదిస్తున్న బ్రాహ్మణులు
Updated at - May 12 , 2025 | 09:59 AM