CM Chandrababu: సింగపూర్లో భారత హైకమిషనర్ శిల్పక్ అంబులేతో సీఎం చంద్రబాబు భేటీ
ABN, Publish Date - Jul 28 , 2025 | 07:23 AM
సింగపూర్లో భారత హైకమిషనర్ డాక్టర్ శిల్పక్ అంబులేతో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదివారం సమావేశం అయ్యారు. ఈ సమావేశంలో మంత్రులు పి.నారాయణ, నారా లోకేష్, టీజీ భరత్తో పాటు ఏపీ ప్రభుత్వ అధికారులు పాల్గొన్నారు. వివిధ రంగాల్లో సింగపూర్ ప్రగతి, గ్రోత్ రేట్, ప్రభుత్వ పాలసీలు, సింగపూర్లో భారతీయుల కార్యకలాపాలను భారత్ హై కమిషనర్ శిల్పక్ అంబులే వివరించారు. ఆరోగ్య రంగం, గ్రీన్ హైడ్రోజన్, ఏవియేషన్, సెమీ కండక్టర్స్, పోర్టులు, పారిశ్రామిక రంగాల్లో సింగపూర్ అనుసరిస్తున్న విధానాలను హైకమిషనర్ వెల్లడించారు.

సింగపూర్లో భారత హైకమిషనర్ డాక్టర్ శిల్పక్ అంబులేతో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదివారం సమావేశం అయ్యారు.

డాక్టర్ శిల్పక్ అంబులేకి బహుమతి అందజేస్తున్న సీఎం చంద్రబాబు

ఈ సమావేశంలో మంత్రులు పి.నారాయణ, నారా లోకేష్, టీజీ భరత్తో పాటు ఏపీ ప్రభుత్వ అధికారులు పాల్గొన్నారు.

వివిధ రంగాల్లో సింగపూర్ ప్రగతి, గ్రోత్ రేట్, ప్రభుత్వ పాలసీలు, సింగపూర్లో భారతీయుల కార్యకలాపాలను భారత్ హై కమిషనర్ శిల్పక్ అంబులే వివరించారు.

ఆరోగ్య రంగం, గ్రీన్ హైడ్రోజన్, ఏవియేషన్, సెమీ కండక్టర్స్, పోర్టులు, పారిశ్రామిక రంగాల్లో సింగపూర్ అనుసరిస్తున్న విధానాలను హైకమిషనర్ శిల్పక్ అంబులే వెల్లడించారు.

సమావేశంలో పాల్గొన్న పలువురు ప్రముఖులు

గతంలో సింగపూర్తో కలిసి అమరావతి ప్రాజెక్ట్ను చేపట్టామని సీఎం చంద్రబాబు గుర్తుచేశారు. కానీ కొన్ని కారణాలతో రాజధాని అమరావతి ప్రాజెక్ట్ నుంచి సింగపూర్ బయటకు వెళ్లిందని సీఎం చంద్రబాబు వెల్లడించారు.

సీఎం చంద్రబాబు మాట్లాడుతుండగా ఆసక్తిగా వింటున్న ప్రముఖులు

విద్యా రంగంలో ఏపీ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను, తమ ఆలోచనలను మంత్రి నారా లోకేష్ వివరించారు.

ఏపీలో ఇప్పటికే ఏర్పాటు అవుతున్న ప్రముఖ విద్యా సంస్థల గురించి మంత్రి లోకేష్ తెలిపారు. ప్రతిష్టాత్మక విద్యా సంస్థల ఏర్పాటుకు సిద్దంగా ఉన్నామని మంత్రి లోకేష్ ఉద్ఘాటించారు.

ఏపీలో చేపడుతున్న ప్రాజెక్ట్ల గురించి మంత్రి నారాయణ వెల్లడించారు.

మంత్రి టీజీ భరత్తో మాట్లాడుతున్న నారా లోకేష్

భారతదేశ ఆర్థిక వ్యవస్థలో విదేశీ పెట్టుబడులు ప్రముఖ పాత్ర పోషిస్తాయని మంత్రి నారా లోకేష్ వ్యాఖ్యానించారు.

ఐదేళ్ల జగన్ పాలనలో ఏపీ ఎంతలా నాశనమైందో మీకు తెలుసుని... రాష్ట్ర పునర్నిర్మాణానికి కూటమి ప్రభుత్వం ఎంత కష్టపడుతోందో మీరంతా చూస్తున్నారని మంత్రి నాారా లోకేష్ పేర్కొన్నారు.
Updated at - Jul 28 , 2025 | 07:30 AM