Silicon Andhra: సిలికానాంధ్ర సంస్థ మరో సరికొత్త రికార్డు
ABN , Publish Date - Jun 04 , 2025 | 11:09 AM
సిలికానాంధ్ర సంస్థ మరో సరికొత్త రికార్డు నెలకొల్పింది. ఈ వారాంతంలో బే-ఏరియాలో ఆ సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించే మూడు విద్యాసంస్థలకు చెందిన విద్యార్థులు ఒకేసారి పట్టభద్రులయ్యారు.

ఇంటర్నెట్ డెస్క్: సిలికానాంధ్ర (Silicon Andhra) సంస్థ మరో సరికొత్త రికార్డు నెలకొల్పింది. ఈ వారాంతంలో బే-ఏరియాలో ఆ సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించే మూడు విద్యాసంస్థలకు చెందిన విద్యార్థులు ఒకేసారి పట్టభద్రులయ్యారు. మూడు స్నాతకోత్సవాలు నిర్వహించినట్లు సిలికానాంధ్ర సంస్థ వ్యవస్థాపక అధ్యక్షుడు కూచిభొట్ల ఆనంద్ వెల్లడించారు.
SAMPADA (Silicon Andhra Music, Performing Arts and Dance Academy) నుంచి 230 విద్యార్థులు, సిలికానాంధ్ర మనబడి నుంచి 412 మంది, ఆరియా విశ్వవిద్యాలయం నుంచి 62 మంది.. మొత్తం 704 మంది విద్యార్థులు పట్టాలు అందుకున్నారు. ఈ రికార్డు సాధన వెనుక కృషి చేసిన అధ్యాపకులకు, విద్యార్థుల తల్లిదండ్రులకు, సిలికానాంధ్ర నిర్వాహకులకు ఆనంద్ అభినందనలు తెలిపారు.
ఇవి కూడా చదవండి
రీల్స్ చేస్తుండగా విషాదం.. ఆరుగురు అమ్మాయిలు మృతి
ప్రియురాలితో గొడవ.. ఇదేం పని నాయనా..