Aishwarya Rai: నా జీవితంతో ఆడుకున్నారు.. తేజ్ప్రతాప్ భార్య ఐశ్వర్య ఫైర్
ABN , Publish Date - May 26 , 2025 | 09:20 PM
రిలేషన్షిప్ గురించి అందరికీ తెలిసినా ఆ విషయం దాచిపెట్టి తన జీవితాన్ని నాశనం చేశారని ఐశ్వర్యారాయ్ ఆరోపించారు. తనను కొట్టి, వేధింపులకు పాల్పడినప్పుడు, గృహహింస చేసినప్పుడు లాలూ చెబుతున్న సామాజిక న్యాయం ఎక్కడికి పోయిందని నిలదీశారు.

పాట్నా: ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ (Lalu Prasad Yadav) తనయుడు తేజ్ప్రతాప్ (Tej Pratap) గత మూడురోజులుగా వార్తల్లో ప్రముఖంగా నిలుస్తున్నారు. గత 12 ఏళ్లుగా ఒక అమ్మాయితో తన రిలేషన్షిప్ నడుస్తోందంటూ గత శనివారంనాడు ఆయన ఫేస్బుక్ పోస్ట్ సంచలనమైంది. దీంతో ఆయనను ఆర్జేడీ నుంచి బహిష్కరిస్తున్నట్టు లాలూ ప్రసాద్ ప్రకటించారు. ఈ నేపథ్యంలో తేజ్ప్రతాప్తో చాలాకాలంగా దూరంగా ఉంటున్న ఆయన భార్య ఐశ్యరారాయ్ (Aishwarya Rai) తొలిసారిగా స్పందించారు. ఈ రిలేషన్షిప్ ఉన్నట్టు ముందే తెలిసినప్పుడు తన జీవితాన్ని ఎందుకు నాశనం చేశారని లాలూ కుటుంబాన్ని సూటిగా ప్రశ్నించారు.
ఈ వ్యవహారంలో అందరి పాత్ర ఉందని, తనను ఎప్పుడూ కనీసం ఒక మనిషిగా కూడా లాలూ కుటుంబం చూడలేదని ఐశ్వర్యారాయ్ చెప్పారు. రిలేషన్షిప్ గురించి అందరికీ తెలిసినా ఆ విషయం దాచిపెట్టి తన జీవితాన్ని నాశనం చేశారని ఆరోపించారు. తనను కొట్టి, వేధింపులకు పాల్పడినప్పుడు, గృహహింస చేసినప్పుడు లాలూ చెబుతున్న సామాజిక న్యాయం ఎక్కడికి పోయిందని నిలదీశారు. ఇప్పుడు ఎన్నికలు దగ్గరపడే సరికి సామాజిక న్యాయం వాళ్లకు గుర్తొచ్చిందని, ఇదంత ఒక డ్రామా అని ఆగ్రహం వ్యక్తం చేశారు.
బీహార్ మాజీ ముఖ్యమంత్రి దరోగ ప్రసాద్ రాయ్ కుమార్తె అయిన ఐశ్వర్యరాయ్తో తేజ్ప్రతాప్ వివాహం 2018లో జరిగింది. అయితే పెళ్లయిన కొద్ది నెలలకే తనపై గృహహింస జరుగుతోందని, తన భర్త, అత్తామామలు వేధింపులకు గురిచేస్తున్నారని ఆరోపిస్తూ ఐశ్వర్యారాయ్ ఇల్లు విడిచి వెళ్లిపోయారు. చాలాకాలం తర్వాత తాజా పరిణామాలపై ఐశ్వర్యారాయ్ మాట్లాడుతూ, చట్టపరంగా తాను వివాహితనని, ఇప్పటికీ తాను యాదవ్ కుటుంబం కోడల్నేనని చెప్పారు.
ఇవి కూడా చదవండి..
PM Modi: నా బుల్లెట్ రెడీ.. పాక్కు మోదీ వార్నింగ్
మోదీ రోడ్షోలో కల్నల్ సోఫియా ఖురేషి కుటుంబసభ్యులు
జ్యోతి మల్హోత్రాకు ఆరుగురు పాక్ గన్మెన్ల సెక్యూరిటీ.. సాటి యూట్యూబర్కు షాక్
ఆపరేషన్ సిందూర్పై ముందుగానే పాక్కు లీక్.. పెదవి విప్పిన జైశంకర్
For National News And Telugu News