Share News

Tungabhadra: తుంగభద్ర నీటి విడుదలపై స్పష్టత ఇవ్వాలి..

ABN , Publish Date - May 31 , 2025 | 01:04 PM

తుండభద్ర రిజర్వాయర్ నీటి విడుదలపై అధికారులు ఒక స్పష్టమైన ప్రకటన చేయాలని రైతుసంఘం నాయకులు డిమాండ్ చేస్తున్నారు. నీటి విడుదలపై అధికారులు ఇంకా ఏ ప్రకటన చేయకపోవడం వలన రైతుల్లో ఆందోళన వ్యక్తం అవుతోందన్నారు.

Tungabhadra: తుంగభద్ర నీటి విడుదలపై స్పష్టత ఇవ్వాలి..

- రైతు సంఘం

బళ్లారి(కర్ణాటక): ఈ ఏడాది తుంగభద్ర(Tungabhadra) జలాశయం నుంచి నీరు అందించడంపై రైతులు ఆందోళన చెందుతున్నారని, నీటి విడుదలపై అధికారులు స్పష్టత ఇవ్వాలని తుంగభద్ర రైతు సంఘం అధ్యక్షుడు దరూర్‌పురుషోత్తమగౌడ అన్నారు. శనివారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. ఇటీవల ఆనకట్ట నిపుణుడు కన్నయ లాల్‌ మాట్లాడుతూ ఈసంవత్సరం 70శాతం నీటిని మాత్రమే నిల్వ చేయగలమన్నారు.


pandu1.3.jpg

దీని కారణంగా నీటి విడుదలపై రైతుల్లో ఆందోళన చెందుతున్నారని, రెండవ పంటకు నీరు అందుతుందా, లేదా అన్నదానిపై అధికారులు ప్రకటించాలన్నారు. జలాశయంలో 25టీఎంసీల నీరు నిండిన వెంటనే కాలువల్లోకి నీటిని విడుదల చేస్తే అది రెండవ పంటను పండించడానికి సహాయపడుతుంది. దీనిపై చర్చించి నిర్ణయం తీసుకోవడానికి సమావేశం ఏర్పాటు చేయాలని అధికారులు అభిప్రాయపడుతున్నారు.


pandu1.jpg

జలాశయం 19 గేటు విరిగిపోయినప్పుడు జలవనరుల మంత్రి డి.కే.శివకుమార్‌ ఈ గేటుతో సహా జలాశయం యొక్క అన్నిగేట్లను మరమ్మతు చేస్తామని హామీ ఇచ్చారు. కానీ ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదన్నారు. సమావేశంలో సంఘం నాయకులు కొంచిగేరి మల్లప్ప, సిద్దయ్యస్వామి, గోవిందప్ప, భీమనగౌడ, బసవరాజప్ప, ఉమేశ్‌గౌడ, జాలిహాళ్‌ శ్రీధరగౌడ పాల్గొన్నారు.


ఈ వార్తలు కూడా చదవండి.

సామాన్యులకు షాకింగ్.. పెరిగిన గోల్డ్, తగ్గిన వెండి ధరలు

వరంగల్‌లో ఉగ్ర కలకలం!

Read Latest Telangana News and National News

Updated Date - May 31 , 2025 | 01:04 PM