Tungabhadra: ఉత్సాహంగా తుంగభద్ర రైతు.. వరినారు సిద్ధం చేసుకుంటున్న అన్నదాత
ABN , Publish Date - Jun 11 , 2025 | 12:38 PM
తుంగభద్ర ఆయకట్టు రైతులు సాగుకు సమాయత్తం అవుతున్నారు. కాల్వల్లోకి నీరు రాకున్నా నారు పోసుకుని సిద్ధంగా ఉన్నారు. నదీ జలాలు, బోర్లు, డ్యాం నీరు ఆధారంగా బళ్లారి, విజయనగర, కొప్పళ, రాయచూరు జిల్లాల్లో 7లక్షల హెక్టార్ల ఆయకట్టు పైగా ఉంది.

- రబీలో నష్టపోయామని ఆవేదన..
బళ్లారి(బెంగళూరు): తుంగభద్ర ఆయకట్టు రైతులు సాగుకు సమాయత్తం అవుతున్నారు. కాల్వల్లోకి నీరు రాకున్నా నారు పోసుకుని సిద్ధంగా ఉన్నారు. నదీ జలాలు, బోర్లు, డ్యాం నీరు ఆధారంగా బళ్లారి, విజయనగర, కొప్పళ, రాయచూరు(Ballari, Vijayanagara, Koppal, Raichur) జిల్లాల్లో 7లక్షల హెక్టార్ల ఆయకట్టు పైగా ఉంది. బోర్ల కింద సాగు చేసే రైతులు ముందుగానే వరినారు వేసుకునే పనిలో నిమగ్నమయ్యారు. డ్యాంలో 80 టీఎంసీల నీరు చేరిన తరువాత ఖరీఫ్లో ఆయకట్టు సాగుకు జూలై రెండో వారంలో నీరు విడుదల చేస్తామని అధికారులు ప్రకటించిన సంగతి తెలిసిందే. దీంతో రైతులు ముందుగానే నారు సిద్ధం చేసుకుంటున్నారు. ఇప్పటికే పొలాలను దుక్కి దున్ని సాగుకు సిద్ధం చేసుకుంటున్నారు.
గతేడాది అన్నీ ఎదురుదెబ్బలే..
గతేడాది తుంగభద్ర డ్యాం క్రస్ట్ గేటు కొట్టుకుపోయి ఆయకట్టు సాగులో కొంత అంతరాయం కలిగింది. కొందరు రైతులు ఆలస్యంగా నాట్లు వేసుకున్నారు. దీంతో చివరి ఆయకట్టుకు నీరు అందకుండా పోయింది. వరి పంటే కాకుండా మిరప, పత్తి రైతులు బాగా నష్టపోయారు. ఎలాగోలా పంట పండినా ధరలు లేక రైతులు తీవ్రంగా నష్టపోయారు. కొందరు రైతులు గోడౌన్లలో మిరపను నిల్వ చేశారు. అయినా మిరపకు ధరలు పెరగలేదు. చైనా మార్కెట్లో కూడా మిరపను తిరిగి పంపించేశారు. దీంతో మిరప రైతుకు ఆవేదన తప్పలేదు. తుంగభద్ర కింద సాగు చేసిన మిరపను ఎక్కవగా కృష్టాపట్నం, మంగళూరు పోర్టు నుంచి చైనా మార్కెట్కు తరలించారు.
చైనా మార్కెట్లో ఇండియా నుంచి వచ్చిన ఎండ మిరపలో ఎక్కవ శాతం రసాయన పదార్థాలు కలిగి ఉన్నాయని తిప్పి పంపారు. తిరిగొచ్చిన మిరపను రైతులు పారబోసుకోవాల్సిన దుస్థితి ఏర్పడింది. కొందరు రైతులు ఎంతో కొంత కు అమ్ముకుంటే పోతుందని అమ్మేశారు. ఇలా గతేడాది మిరప సాగు చేసిన రైతులు, స్టాక్ పెట్టిన వ్యాపారులు బాగా నష్టపోయారు. అప్పుల బాధతో కొందరు ఐపీ పెట్టడం శోచనీయం. మొత్తానికి వరి, మిరప రైతులు తీవ్రంగా నష్టపోయి ఆత్మహత్యకు పాల్పడిన ఘటనలూ ఉన్నాయి. వరి సాగుకు ముందుగానే రైతులు సిద్దమవుతున్నారు. బోర్లు కింద నారు వేసుకుని పంట సాగుకు సిద్దమవుతున్నారు.
నీటి నిల్వపై అనుమానాలు
ఈసారి డ్యాంలో 80 టీఎంసీల మించి నీరు నిల్వ ఉంచకూడదని బోర్డు అధికారులు పేర్కొన్నారు. ఎక్కవ నీరు నిల్వ ఉంచితే డ్యాం క్రస్ట్ గేట్లు ప్రమాదం ఏర్పడుతుందని ఇంజనీర్లు ప్రకటించారు. ఈనేపథ్యంలో రైతులు ఆయకట్టు కింద ఖరీప్ కింద అయినా పూర్తీగా ఆయకట్టు సాగు చేసేందుకు సిద్దమవుతున్నారు. రబీలో సాగుకు దేవుడు ఎరుగు..కనీసం ఖరీ్పలోనైనా సహకరిస్తారని ఆశ పడుతున్నారు.
ఈ వార్తలు కూడా చదవండి.
బంగారం కొనాలనుకునేవారికి గుడ్న్యూస్
రాజీవ్ యువ వికాసం మరింత జాప్యం
Read Latest Telangana News and National News