Share News

Accident: ఆలయ దర్శనం కోసం వెళ్తుండగా ప్రమాదం..11 మంది మృతి, ముగ్గురికి గాయాలు

ABN , Publish Date - Apr 27 , 2025 | 07:56 PM

వేగంగా వెళ్తున్న కారు, ఆకస్మాత్తుగా వెళ్లి బైక్‌ను ఢీకొట్టింది. ఆ క్రమంలోనే వెళ్లి రోడ్డు పక్కన ఉన్న బావిలో పడిపోయింది. ఈ ఘటనలో 11 మంది మరణించగా, మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. ఆ వివరాలేంటో ఇప్పుడు చూద్దాం.

Accident: ఆలయ దర్శనం కోసం వెళ్తుండగా ప్రమాదం..11 మంది మృతి, ముగ్గురికి గాయాలు
Accident

మధ్యప్రదేశ్‌(Madhya Pradesh)లోని మందసౌర్‌లో ఘోర ప్రమాదం జరిగింది. వేగంగా వెళ్తున్న ఎకో వ్యాన్.. బైక్‌ను ఢీకొట్టి అనుకోకుండా వెళ్లి బావిలో పడిపోయింది. అదే సమయంలో గమనించి వారిని కాపాడటానికి బావిలోకి దిగిన వ్యక్తి కూడా తిరిగి రాలేదు. ఇప్పటివరకు ఈ ఘటనలో 11 మంది మరణించగా, మరో ముగ్గురు గాయపడ్డారు. మాందసౌర్ జిల్లాలోని నారాయణగఢ్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ప్రమాదంలో బైక్ రైడర్, కారు ప్రయాణీకులు సహా 11 మంది మరణించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు ప్రారంభించారు. కారులో ఉన్న వారందరూ రత్లాంకు చెందినవారని చెబుతున్నారు.


సాయం కోసం వెళ్లి..

సమాచారం అందుకున్న మధ్యప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి జగదీష్ దేవ్డా, డీఐజీ మనోజ్ కుమార్ సింగ్ కూడా ఘటనా స్థలానికి చేరుకుని అధికారులకు సూచనలు ఇచ్చారు. ఆదివారం మధ్యాహ్నం 2 గంటల ప్రాంతంలో మంద్‌సౌర్ జిల్లాలోని నారాయణ్‌గఢ్ పోలీస్ స్టేషన్ ప్రాంతంలోని బుధ తకర్వత్ క్రాసింగ్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. అదుపుతప్పిన ఎకో వ్యాన్ మొదట బైక్‌ను ఢీకొట్టి, ఆపై తెరిచి ఉన్న బావిలో పడిపోయింది.

అదే సమయంలో వారిని రక్షించడానికి బావిలోకి దిగిన దౌర్వాడి నివాసి మనోహర్ సింగ్ అనే యువకుడు కూడా గ్యాస్ లీకేజీతో ఊపిరాడక మరణించాడు. అబాఖేడి నివాసి బైక్ రైడర్ గోబర్ సింగ్ మృతి చెందినట్లు అక్కడికక్కడే నిర్ధారించారు. వ్యాన్‌లో ప్రయాణిస్తున్న మరో వ్యక్తి, అతన్ని రక్షించడానికి బావిలోకి దిగిన ఒక గ్రామస్తుడు కూడా ప్రాణాలు కోల్పోయారు.


ఆలయ దర్శనం కోసం వెళ్లి..

ఉజ్జయిని జిల్లాలోని ఉన్హెల్ నుంచి నీముచ్ జిల్లాలోని మానస ప్రాంతంలో ఉన్న అంతర్రీ మాత ఆలయాన్ని సందర్శించడానికి వెళ్తున్న వ్యాన్‌లో 11 మందికి పైగా ఉన్నారు. ప్రమాదంలో గాయపడిన మూడేళ్ల బాలికతో సహా నలుగురిని సురక్షితంగా రక్షించి మాండ్‌సౌర్ జిల్లా ఆసుపత్రికి తరలించారు. ఘటన గురించి సమాచారం అందిన వెంటనే ఉప ముఖ్యమంత్రి జగదీష్ దేవ్డా, కలెక్టర్ అదితి గార్గ్, ఎస్పీ అభిషేక్ ఆనంద్, అదనపు ఎస్పీ గౌతమ్ సోలంకి, ఎస్డీఓపీ నరేంద్ర సోలంకి ఘటనా స్థలానికి చేరుకున్నారు. సహాయక చర్యలు వేగంగా జరుగుతున్నాయి. డ్రైవర్ వ్యాన్ పై నియంత్రణ కోల్పోయిన క్రమంలోనే ఇలా జరిగిందని అధికారులు చెబుతున్నారు.


ఇవి కూడా చదవండి:

Akshay Tritiya: అక్షయ తృతీయకు గోల్డ్ కొనలా..వెయిట్ చేయాలా


Bank Holidays: మే 2025లో 12 రోజులు బ్యాంకులు బంద్.. పూర్తి లిస్ట్ ఇదే

Pahalgam Attack: ఎప్పటి నుంచి ప్లాన్ చేశార్రా.. ఉగ్రదాడి కోసం 22 గంటలు నడిచారా..

NaBFIDలో అనలిస్టు పోస్టులకు నోటిఫికేషన్.. రూ.14 లక్షల జీతంతో మంచి ఛాన్స్

TRAI: సిగ్నల్, నెట్ లేకపోతే సైలెంట్ కాదు..ఫిర్యాదు చేయడం మరింత ఈజీ తెలుసా..

Read More Business News and Latest Telugu News

Updated Date - Apr 27 , 2025 | 08:01 PM