
Breaking News: మానవత్వం చాటుకున్న మంత్రి నాదెండ్ల
ABN , First Publish Date - Jan 26 , 2025 | 08:19 AM
Breaking News: ప్రపంచ నలుమూలల, దేశ విదేశాల్లో జరిగే పరిణామాలు, సంఘటనలు, రాజకీయ, ఆర్థిక అంశాలు, క్రీడా, వినోదానికి సంబంధించిన అప్డేట్స్ను ఎప్పటికప్పుడు ఆంధ్రజ్యోతి మీకు అందిస్తోంది. సమస్త సమాచారం ఒకే క్లిక్తో ఇక్కడ చూసేయండి.

Live News & Update
-
2025-01-26T13:37:26+05:30
మానవత్వం చాటుకున్న మంత్రి నాదెండ్ల మనోహర్
విజయవాడ నుంచి గుంటూరు వెళ్తున్న మంత్రి
వారధి వద్ద ద్విచక్ర వాహనం ఢీకొని వ్యక్తికి గాయాలు
వెంటనే కారు ఆపి క్షతగాత్రుడికి ప్రథమ చికిత్స అందించిన మంత్రి
108 కి కాల్ చేసి ఆస్పత్రికి పంపిన మంత్రి మనోహర్
విజయవాడలోని ఓ ప్రయివేట్ ఆసుపత్రిలో జాయిన్ చేస్తున్నట్టు తెలిపిన 108 సిబ్బంది
-
2025-01-26T11:03:57+05:30
ఆకట్టుకున్న ఇండోనేషియా మిలిటరీ బ్యాండ్ కవాతు
ఇండోనేషియా మిలిటరీ అకాడమీకి చెందిన 190 మంది సభ్యుల బృందం నిర్వహించిన కవాతు అందరినీ ఆకట్టుకుంది. ఈ ఏడాది ఈ వేడుకకు ఇండోనేషియా అధ్యక్షుడు ప్రబోవో సుబియాంటో ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
-
2025-01-26T10:34:09+05:30
ఢిల్లీలో రిపబ్లిక్ డే వేడుకలు ప్రారంభం
ఢిల్లీలో ప్రారంభమైన రిపబ్లిక్ డే వేడుకలు
కర్తవ్యపథ్కు చేరుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ఉప రాష్ట్రపతి జగధీప్ దన్కర్
రిపబ్లిక్డే వేడుకలకు ముఖ్య అతిథిగా ఇండోనేషియా అధ్యక్షులు సుబియాంతో
-
2025-01-26T10:14:07+05:30
అమరవీరులకు ప్రధాని నివాళులు
ఢిల్లీలో అమరవీరులకు నివాళులర్పించిన ప్రధాని మోదీ
జాతీయ యుద్ధ స్మారకం వద్ద ప్రధాని నివాళులు
కార్యక్రమంలో పాల్గొన్న రక్షణమంత్రి రాజ్నాధ్ సింగ్, త్రివిధ దళాధిపతులు
-
2025-01-26T08:41:02+05:30
హైదరాబాద్లోని సీఎం నివాసంలో..
గణతంత్ర దినోత్సవం సందర్భంగా జూబ్లీహిల్స్ నివాసంలో సీఎం రేవంత్ రెడ్డి జాతీయ జెండాను ఆవిష్కరించారు.
-
2025-01-26T08:24:44+05:30
మోదీ ట్వీట్
76వ గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని దేశప్రజలకు ప్రధాని మోదీ శుభాకాంక్షలు తెలిపారు. ఈ రోజు ఘనమైన గణతంత్ర 75వ వార్షికోత్సవాన్ని జరుపుకుంటున్నామని తెలిపారు. ఈ జాతీయ పండుగ మన రాజ్యాంగ విలువలను పరిరక్షించడమే కాకుండా బలమైన, సుసంపన్నమైన భారతదేశాన్ని సృష్టించే దిశగా మన ప్రయత్నాలను బలపరచాలని కోరుకుంటున్నట్లు మోదీ తెలిపారు.
-
2025-01-26T08:19:38+05:30
దేశ వ్యాప్తంగా గణతంత్ర వేడుకలు
దేశ వ్యాప్తంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నారు. ప్రధాని మోదీ సహా వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు దేశ ప్రజలకు గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.