Share News

Chief Minister: ప్రభుత్వ ఉద్యోగులకు రూ.కోటి ఉచిత బీమా

ABN , Publish Date - May 20 , 2025 | 11:35 AM

ఉద్యోగులకు ఇదిఒక రకంగా గుడ్ న్యూస్ అనే చెప్పవచ్చు. రాష్ట్రప్రభుత్వ ఉద్యోగుల సంక్షేమార్థం ప్రభుత్వం పలు రాయితీలు కల్పించడంతోపాటు, ప్రమాదంలో మరణించినా, అవయవాలు కోల్పోయిన వారి కుటుంబాలకు రూ.కోటి అందేలా ఉచిత బీమా పథకానికి శ్రీకారం చుట్టింది.

Chief Minister: ప్రభుత్వ ఉద్యోగులకు రూ.కోటి ఉచిత బీమా

- సీఎం నేతృత్వంలో 7 బ్యాంకులతో అవగాహన ఒప్పందం

చెన్నై: రాష్ట్రప్రభుత్వ ఉద్యోగుల సంక్షేమార్థం ప్రభుత్వం పలు రాయితీలు కల్పించడంతోపాటు, ప్రమాదంలో మరణించినా, అవయవాలు కోల్పోయిన వారి కుటుంబాలకు రూ.కోటి అందేలా ఉచిత బీమా పథకానికి శ్రీకారం చుట్టింది. ఇందుకోసం సోమవారం ఉదయం సీఎం స్టాలిన్‌ సమక్షంలో సచివాలయం ప్రాంగణంలో జరిగిన కార్యక్రమంలో ప్రభుత్వం ఏడు బ్యాంకులతో అవగాహన కుదుర్చుకుంది. ప్రభుత్వ పథకాలను ప్రజల వద్దకు చేరుస్తున్న ఉద్యోగుల సంక్షేమంపై దృష్టిసారించిన ముఖ్యమంత్రి స్టాలిన్‌(Chief Minister Stalin) ఆర్జితసెలవు రోజుల భత్యాన్ని ఈ ఏడాది నుండి పెంచడంతో పాటు,

ఈ వార్తను కూడా చదవండి: Chief Minister: కారులోనే.. ముఖ్యమంత్రి భోజనం


ఈ ఉద్యోగుల సంక్షేమం కోసం పలు రాయితీలను కూడా ప్రభుత్వం తరుఫున కల్పిస్తున్నారు. సంపన్న దేశాల్లో లాగే ప్రభుత్వ ఉద్యోగులకు ఉచిత బీమా పథకాన్ని వర్తింపజేయనున్నట్లు ఇటీవల జరిగిన అసెంబ్లీ సమావేశంలో సీఎం ప్రకటించారు. ఈ పథకం కోసం ఆర్థికశాఖ మంత్రి దాఖలు చేసిన ఆర్థిక బడ్జెట్‌లో, ప్రభుత్వ ఉద్యోగులు హఠాత్తుగా ప్రమాదాల్లో మరణించినా, అవయవాలు కోల్పోయినా రూ.కోటి నిధులు అందజేయనున్నట్లు ప్రకటించారు. ఈ పథకం కోసం ఎస్‌బీఐ, ఐఓబి, కెనరా బ్యాంక్‌, యాక్సెస్‌ బ్యాంక్‌, బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా, యూనియన్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా,

nani2.2.jpg


ఇండియన్‌ బ్యాంక్‌ల ఉన్నతాధికారులు సోమవారం ముఖ్యమంత్రి స్టాలిన్‌ సమక్షంలో జరిగిన కార్యక్రమంలో సంతకాలు చేసిన ఒప్పందపత్రాలను మార్చుకున్నారు. ఈ రాయితీ మాత్రమే కాకుండా బ్యాంకు రుణం, హౌసింగ్‌ లోన్‌, ఎడ్యుకేషన్‌ లోన్‌ తదితరాలను ప్రభుత్వ ఉద్యోగులు పొందే సమయంలో తక్కువ వడ్డీని వసూలు చేసేలా బ్యాంకులు ముందుకొచ్చాయి. ఈ కార్యక్రమంలో ఆర్థికశాఖ మంత్రి తంగం తెన్నరసు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎన్‌.మురుగానందం, ఆర్థికశాఖప్రిన్సిపల్‌ సెక్రటరీ ఉదయచంద్రన్‌, కార్యదర్శి ఎస్‌.నాగరాజన్‌, అకౌంట్స్‌, ట్రెజరీశాఖ డైరెక్టర్‌ సావిత్రి, బ్యాంకుల ఉన్నత అధికారులు పాల్గొన్నారు.


ఈ వార్తలు కూడా చదవండి.

Gold Rates Today: తగ్గిన ధరలకు బ్రేక్.. మళ్లీ పెరిగిన బంగారం, వెండి ధరలు

Rice Production: సస్యశ్యామల భారతం

Siricilla : పాత బకాయిలు లేనట్లేనా..?

Telangana fire services: ఇక.. మహిళా ఫైర్‌ఫైటర్లు

Read Latest Telangana News and National News


Updated Date - May 20 , 2025 | 11:35 AM