Share News

School: ఒకే విద్యార్థిని కోసం సర్కారు బడి..

ABN , Publish Date - Jun 03 , 2025 | 01:13 PM

ఆ పాఠశాలలో ఒకేఒక్క విద్యార్థిని ఉన్నారు. తమిళనాడు రాష్ట్రం రామనాథపురం జిల్లాలో కేవలం ఒకేఒక్క విద్యార్థిని కోసం ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలను నడుపుతున్నారు. గ్రామం ఉండి, విద్యార్థులున్నా ఎవరూ ప్రభుత్వ పాఠశాలకు రావడం లేదు.

School: ఒకే విద్యార్థిని కోసం సర్కారు బడి..

చెన్నై: తమిళనాడులోని రామనాథపురం(Ramanathapuram) జిల్లా తిరువాడనై యూనియన్‌ పరిధిలోని తలిర్‌మరుంగూర్‌ గ్రామంలో ఒకే విద్యార్థిని కోసం ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల నడుస్తోంది. తిరువాడనై యూనియన్‌లో 112 ప్రభుత్వ, ఎయిడెడ్‌ ప్రాథమిక, మాధ్యమిక పాఠశాలలున్నాయి. వేసవి సెలవుల అనంతరం సోమవారం ఉదయం పాఠశాలలు పునఃప్రారంభమయ్యాయి. ఈ నేపథ్యంలో తొండి సమీపంలోని తలిర్‌మరుంగూర్‌ గ్రామంలో ఉన్న ప్రభుత్వ మాధ్యమిక పాఠశాల కూడా ప్రారంభమైంది.


ఈ పాఠశాలలో గత ఐదేళ్ళుగా విద్యార్థులెవరూ చేరనందున గత ఏడాది 5వ తరగతిలో ఒక విద్యార్థి, 2వ తరగతిలో ఒక విద్యార్థి ఇద్దరు మాత్రమే చదువుకున్నారు. ఈ విద్యాసంవత్సరం 5వ తరగతి పూర్తయిన విద్యార్థి అక్కడి నుండి 6వ తరగతిలో చేరారు. ఇందువల్ల 2వ తరగతి నుండి 3వ తరగతికి వెళ్ళిన ఆ ఒక్క విద్యార్ధిని మాత్రమే ప్రస్తుతం చదువుతోంది. ఈ సర్కారు బడిలో ఒక ప్రధానోపాధ్యాయుడు, ఒక టీచర్‌ మాత్రమే పనిచేసిన నేపథ్యంలో గత నెల ప్రధానోపాధ్యాయుడు పదవీవిరమణ పొందాడు. రాష్ట్ర వ్యాప్తంగా సోమవారం పునఃప్రారంభమైన పాఠశాలల్లో అడ్మిషన్లు జరుగుతుండగా,


తలిర్‌మరుంగూర్‌ గ్రామ ప్రభుత్వ పాఠశాలలో మాత్రం ఒక్క విద్యార్థి కూడా చేరలేదు. తమ గ్రామంలోవున్న ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులు లేకుంటే పాఠశాలను మూసివేస్తారనే కారణంగా పైవేటు పాఠశాలలో 1వ తరగతి చదువుకుంటున్న తన కుమార్తెను ఈ పాఠశాలలో చదివిస్తున్నట్లు ఆ విద్యార్థి తల్లిదండ్రులు తెలిపారు. పాఠశాలలో విద్యార్ధులెవరూ లేనందువల్ల తన కుమార్తె కూడా భయపడుతోందని, ఇప్పటికైనా విద్యార్థులను చేర్పించేందుకు విద్యాశాఖ అధికారులు చర్యలు చేపట్టాలని తల్లిదండ్రులు డిమాండ్‌ చేస్తున్నారు.


ఈ వార్తలు కూడా చదవండి.

నా పేరు కవిత... నేనెప్పుడూ ప్రజలపక్షమే

రాజన్న గోశాలలో మరో మూడు కోడెల మృతి

Read Latest Telangana News and National News

Updated Date - Jun 03 , 2025 | 01:13 PM