SpiceJet: భోజనం నాణ్యతపై స్పైస్జెట్ పాసింజర్లు అగ్రహం.. సిబ్బందితో తినిపించిన వైనం
ABN , Publish Date - Jun 16 , 2025 | 06:26 PM
స్పైస్ జెట్ విమానం ఆలస్యం కావడంతో ప్రయాణికులు ఫుడ్ సర్వ్ చేశారు. అయితే ఏ మాత్రం నాణ్యత లేని ఆహారం సరఫరా చేయడంపై ప్రయాణికులు గొడవకు దిగారు. గ్రౌండ్ సిబ్బంది నచ్చచెప్పే ప్రయత్నం చేసినప్పటికీ వినిపించుకోలేదు.

పుణె: 'జంతువులు తినే ఆహారం మాకు పెడతారా?' అంటూ స్పైస్ జెట్ (SpiceJet) విమాన ప్రయాణికులు గ్రౌండ్ సిబ్బందిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పుణె విమానాశ్రయంలో చోటుచేసుకున్న ఈ ఘటనకు సంబంధించిన వీడియా ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
సంఘటన వివరాల ప్రకారం, స్పైస్ జెట్ విమానం ఆలస్యం కావడంతో ప్రయాణికులకు ఫుడ్ సర్వ్ చేశారు. అయితే ఏ మాత్రం నాణ్యత లేని ఆహారం సరఫరా చేయడంపై ప్రయాణికులు గొడవకు దిగారు. గ్రౌండ్ సిబ్బంది నచ్చచెప్పే ప్రయత్నం చేసినప్పటికీ వినిపించుకోకుండా 'మీరు తిని చెప్పండి' అంటూ వివాదానికి దిగారు. దీంతో ఆందోళనకు దిగిన ప్రయాణికుల ముందే సిబ్బంది ఆ ఆహారం తీసుకున్నారు. కాగా, ఆహారం నాణ్యతపై ప్రయాణికుల ఆరోపణలను స్పైస్ జెట్ యాజమాన్యం తోసిపుచ్చింది. రెండు వారాల క్రితం ఈ ఘటన జరిగినప్పటికీ ఇందుకు సంబంధించిన వీడియో 'వోక్ ఎమినెంట్' పేరుతో సోషల్ మీడియాలో పోస్ట్ అయింది.
ఇవి కూడా చదవండి..
రాజా రఘువంశీ హత్యకు కొన్ని గంటల ముందు వీడియో.. షాకింగ్
ఎయిర్ ఇండియా హాంగ్కాంగ్-ఢిల్లీ విమానంలో సాంకేతిక లోపం
మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి