Share News

Shebaz Sharif: జల వివాదాన్ని గాజా సంక్షోభంతో పోలుస్తూ పాక్ పీఎం రెచ్చగొట్టే వ్యాఖ్యలు

ABN , Publish Date - May 30 , 2025 | 07:32 PM

ఆయుధ దాడులతో గాజా తీవ్ర కరవుకాటకాల్లో చిక్కుకుని మానవతా సంక్షోభాన్ని చవిచూస్తోందని, అది చాలదన్నట్టుగా నీటిని ఆయుధంగా మలుచుకునే పరిస్థితి ఇప్పుడు కళ్లముందు కనిపిస్తోందని షెహబాజ్ వ్యాఖ్యానించారు.

Shebaz Sharif: జల వివాదాన్ని గాజా సంక్షోభంతో పోలుస్తూ పాక్ పీఎం రెచ్చగొట్టే వ్యాఖ్యలు

న్యూఢిల్లీ: ఆపరేషన్ సిందూర్‌(Operation Sindoor)తో భారత్ చేతిలో చావుదెబ్బలు తిన్నా.. ఉగ్రవాదుల అంత్యక్రియల్లో ఆ దేశ ఆర్మీ ఉన్నతాధికారులు పాల్గొన్న విషయం ప్రపంచానికి బహిర్గతమయినా పాక్ వక్రబుద్ధి మార్చుకోవడం లేదు. పహల్గాం ఉగ్రదాడి అనంతరం పాక్‌పై భారత్ తీసుకున్న కఠిన చర్యల్లో భాగంగా సింధూ జలాల ఒప్పందాన్ని తాత్కాలికంగా నిలిపివేయడం దాయాది దేశానికి మింగుడుపడటం లేదు. తాజాగా పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ (Shehbaz Sharif) ఈ అంశానికి ఒక వివాదాస్పద పోలిక జోడించడం ద్వారా రెచ్చగొట్టే ప్రకటన చేశారు. ఇండియాతో తలెత్తిన జల వివాదాన్ని గాజాలోని మానవతా సంక్షోభం (Humanitarian Crisis)తో పోల్చారు. ఇస్లామాబాద్‌పై నీటిని ఆయుధంగా న్యూఢిల్లీ మలుచుకుంటోందని ఆరోపించారు. తజకిస్థాన్‌లోని దుషాన్బేలో 'గ్లేసియర్ ప్రిజర్వేషన్'పై జరిగిన అంతర్జాతీయ సదస్సులో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.


ఆయుధ దాడులతో గాజా ఇవాళ తీవ్ర కరవుకాటకాల్లో చిక్కుకుని మానవతా సంక్షోభాన్ని చవిచూస్తోందని, అది చాలదన్నట్టుగా కొత్తగా నీటిని ఆయుధంగా మలుచుకునే పరిస్థితి ఇప్పుడు కళ్లముందు కనిపిస్తోందని షెహబాజ్ వ్యాఖ్యానించారు. బెదిరింపులకు ఒక ఆయుధంగా నీటిని మలచుకునేందుకు ఇండియా ప్రయత్నిస్తోందని ఆరోపించారు. నీటి ఒప్పందంపై ఏకపక్షంగా తీసుకున్న నిర్ణయం వల్ల లక్షలాది మంది ప్రజల ప్రాణాలు ప్రమాదంలో పడతాయన్నారు. న్యూఢిల్లీ 'రెడ్‌లైన్‌'ను అతిక్రమించడాన్ని తాము చూస్తూ ఊరుకోమని హెచ్చరించారు.


కాగా, పాక్ చేస్తున్న ఆరోపణలను న్యూఢిల్లీ ఇప్పటికే కొట్టివేసింది. దశాబ్దాలుగా సరిహద్దు ఉగ్రవాదానికి పాల్పడుతూ 1960 ఒప్పందం స్ఫూర్తిని పాక్ ఉల్లంఘించిందని స్పష్టం చేసింది. సింధూ జాలాలు భారత్‌వేనని, మనదేశానికి చెందినవి ఇక్కడే ఉంటాయని, వాటిని దేశ ప్రయోజనాలకే వినియోగిస్తామని ప్రధాన మంత్రి నరేంద్ర ఇటీవల స్పష్టం చేశారు.


మన సైన్యం దాడులను చూసి యుద్ధం ఆపాలని వేడుకున్నారు..

పహల్గాం ఉగ్రదాడి బాధితులకు అండగా నిలుస్తాం

For National News And Telugu News

Updated Date - May 30 , 2025 | 07:56 PM